Nara Lokesh: వంద రోజుల్లో.. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం
తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని, ఈ అంశంపై పవన్ కల్యాణ్ అన్నతో తొలి సమావేశంలోనే చర్చించామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు.
గీత కార్మికులకు 50 ఏళ్లకే పింఛను
రాబోయేది మన ప్రభుత్వమే
తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్
ఈనాడు, రాజమహేంద్రవరం: తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని, ఈ అంశంపై పవన్ కల్యాణ్ అన్నతో తొలి సమావేశంలోనే చర్చించామని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోరంగిలో శెట్టిబలిజలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. దింపు, ఒలుపు కార్మికులకు రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని, కులవృత్తుల్ని ప్రోత్సహించేందుకు ఆదరణ పథకంలో భాగంగా ఏటా పరికరాల్ని అందిస్తామని చెప్పారు. ‘సీఎం జగన్ సభలు పెట్టి బటన్లు నొక్కాను అంటారు. ఇంటికెళ్లి చూస్తే ఖాతాల్లో డబ్బులు పడవు. ఆయన రూ.12 లక్షల కోట్లు అప్పులు చేసి బటన్లు నొక్కారు. ఈ బటన్ సీఎం పనైపోయింది’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఒలుపు కార్మికులకు న్యాయం జరగలేదని రెడ్డి శ్రీను అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరి రైతులు, ఒలుపు, దింపు కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారికి మేలుచేసే నిర్ణయాల్ని తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.
చెట్టు మీద నుంచి పడి నడుం దెబ్బతిన్నదని, తహసీల్దారు దగ్గరకు వెళితే.. చనిపోతే రూ.50 వేలు ఇస్తామని, దెబ్బతగిలితే ఏమీ ఉండదని చెప్పినట్లు ఓ కల్లుగీత కార్మికుడు వాపోయారు. లోకేశ్ స్పందిస్తూ.. మీలాంటి బాధితులకు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. గీత కార్మికులకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని చెప్పారు. మద్యనిషేధం అమలు చేస్తే కల్లుగీత కార్మికులకు మేలు జరుగుతుందని ఒకరు ప్రస్తావించగా... ‘జగన్లా నోటికొచ్చినట్లు ఊరికో హామీ ఇస్తే పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి నాకూ వస్తుంది. చేయగలిగింది చేస్తానని చెబుతా. మద్యనిషేధాన్ని ఆనాడు అన్న ఎన్టీఆర్ అమలు చేశారు. అది ఎక్కువ రోజులు నిలబడలేదు. మీరు అన్నట్లు కల్లుగీత కార్మికులకు ఇబ్బందులు, వేధింపులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అని లోకేశ్ చెప్పారు.
ఏటా నియామకాల్ని చేపడతాం
నోటిఫికేషన్లు రాక శెట్టిబలిజ యువత నిరుద్యోగులుగా మిగిలారని రామచంద్రపురం విశ్రాంత ప్రిన్సిపల్ సత్యనారాయణ ప్రస్తావించగా.. మన ప్రభుత్వం వచ్చాక ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి, నియామకాలు చేపడతామని లోకేశ్ భరోసా ఇచ్చారు. నీరా కేఫ్ల ఏర్పాటు, మద్యం దుకాణాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో 26 వేల మంది బీసీలపై కేసులు నమోదు చేసిందన్నారు. కార్యక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం, దాట్ల బుచ్చిబాబు, పితాని బాలకృష్ణ, గుత్తుల సాయి, పిల్లి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర గురువారం 213వ రోజు 21.1 కిలోమీటర్లు సాగింది. విద్యార్థులు పెద్దసంఖ్యలో విచ్చేసి లోకేశ్కు మద్దతు పలికారు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం సుంకరపాలెం వద్ద ప్రారంభమైన యాత్ర సాయంత్రానికి చొల్లంగిపేటకు చేరుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే