వైకాపా దుష్టపాలన ఇంకా మూడు నెలలే
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా-జనసేన పొత్తు తప్పనిసరి. అందుకే మా పొత్తును గెలిపించండి. మళ్లీ వైకాపా వైపు చూశారా? మీ భవిష్యత్ను మీరు నాశనం చేసుకున్నట్లే.
ఏపీ బాగుండాలంటే తెదేపా-జనసేన పొత్తును గెలిపించండి
సంక్షేమ కార్యక్రమాలను ఇంకా పెంచి కొనసాగిస్తాం
విశాఖ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్
దశాబ్ద కాలంగా ఓడినా మీ ముందు నిల్చున్నానంటే అది మీ భవిష్యత్ కోసం. ఓటమి విలువ యువతకు బాగా తెలుసు. ఓటమి మీద ఓటమి వస్తున్నా.. సవాల్గా తీసుకుని ఎదుగుతూనే ఉన్నా. దొడ్డి దారుల్లేవు.. నిలబడి చూపించడమే నాయకత్వం. ఇందుకు అబ్రహాం లింకన్ నాకు ఆదర్శం
పవన్ కల్యాణ్
ఈనాడు-విశాఖపట్నం: ‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలంటే తెదేపా-జనసేన పొత్తు తప్పనిసరి. అందుకే మా పొత్తును గెలిపించండి. మళ్లీ వైకాపా వైపు చూశారా? మీ భవిష్యత్ను మీరు నాశనం చేసుకున్నట్లే. వైకాపా దుష్టపాలనను ఇంకా మూడు నెలలే భరిద్దాం’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గురువారం విశాఖలోని ఎంవీపీ కాలనీ ఆళ్వార్దాస్ స్టేడియంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి విజయ్కుమార్ సోదరుడు, గుత్తేదారు సుందరపు వెంకట సతీష్కుమార్ జనసేనలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
‘విశాఖ నాలో ధైర్యాన్ని నింపి పార్టీని ముందుకు నడిపించే స్థాయికి తీసుకొచ్చింది. ఆ ధైర్యమే రేపు తెదేపా-జనసేన కూటమిని నిలబెడుతుంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ‘2014లో తెదేపా, భాజపాకు అండగా ఉంటే విడిపోయిన రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆలోచించా. 2019లో దురదృష్టవశాత్తూ కలవలేదు, 2024 ఎన్నికలకు మాత్రం ఏపీకి బంగారు భవిష్యత్ ఇవ్వాలని పొత్తు పెట్టుకుంటున్నాం. ఏపీ బాగుండాలంటే ప్రభుత్వాన్ని స్థాపించేంత బలం ఇవ్వాలి. మరోసారి వైకాపాకు ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. మరో అయిదేళ్లు యువత భవిష్యత్ను తాకట్టు పెట్టలేను. అవసరమైతే నన్ను నేను తగ్గించుకుంటా’ అని పేర్కొన్నారు.
గుండెల్లో అభిమానం ఓట్లలో చూపిస్తేనే: ‘మనం పోటీ చేసే స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా మనం మద్దతిచ్చిన స్థానాల్లోని అభ్యర్థులకు బలమైన మెజార్టీ ఇవ్వాలి. మీ గుండెల్లో ఉన్న అభిమానం ఓట్లలో చూపించకపోతే ప్రయోజనం లేదు. ఎక్కువమంది ఎమ్మెల్యేలను గెలిపించి, అధిక శాతం ఓట్లు తెదేపాకు బదిలీ అయితే మంచి స్థాయిలో మనం ఉంటాం. సీఎం ఎవరనేది నేను, చంద్రబాబు కలిసి నిర్ణయిస్తాం. అది మీకు చెప్పే చేస్తా. లోపాయికారిగా ఏమీ చేయను. నేను ఎవరికీ ‘బి’ పార్టీ కాదు. జనసేన తెదేపా వెనుక నడిచేది కాదు.. కలిసి నడిచేది. నన్ను అభిమానించే వీర మహిళలు, జనసైనికుల అభిమానం కాపాడుతా’ అంటూ సీఎం.. సీఎం అని నినాదాలు చేస్తున్న అభిమానులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు.
జగన్ ఓటు అనే బోటుపై సముద్రం దాటి తెప్ప తగలేశాడు
‘రాబోయే మూడు నెలలూ వ్యక్తిగతంగా కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం పొరపొచ్చాలు లేకుండా తెదేపాతో కలిసి పోరాడండి. పొత్తు గురించి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వైకాపాకు అమ్ముడుపోయినట్లే. నా చుట్టూ తిరగకుండా, ప్రతిఒక్కరూ ఎన్నికల ప్రక్రియపై దృష్టిసారించాలి. ఓటరును ఇంటి నుంచి పోలింగ్ బూత్ వరకు తీసుకు రావాలి. 2024లో తెదేపా-జనసేనలు అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తాం. ఇంకా రూ.పది ఎక్కువే ఇస్తాముగానీ కోత విధించం. జగన్ ఓటు అనే బోటు మీద సముద్రం దాటాడు. ఆ వెంటనే తెప్ప తగలేశాడు. మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ప్రకృతిని నాశనం చేసి సంపాదించిన డబ్బుతో జగన్ మీ విలువైన ఓటును కొనేస్తాడు. రూ.2 వేలిచ్చినా రూ.3 వేలిచ్చినా ఆ డబ్బు జగన్ జేబులోది కాదు. ఆ డబ్బుకు రుణపడి ఉండాల్సిన అవసరం లేదు. ఈసారి ఓటు సుస్థిర, బలమైన మార్పు కోసం వేయండి’ అని పవన్ పిలుపునిచ్చారు.
అత్తారింటికి దారేదిలా.. ఏపీ రాజధానికి దారేది?
‘విభజన తర్వాత పదేళ్లైనా రాష్ట్ర రాజధాని ఎక్కడుంది? అత్తారింటికి దారేది సినిమా కథను మూడు గంటల్లో చెప్పేయొచ్చు. ఏపీ రాజధానికి దారేది..? అంటే ఎవరూ చెప్పలేరు. ప్రతిసారీ దిల్లీ నుంచి ఎవరో ఒకరు గుర్తుచేయాల్సి వస్తోంది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నా. స్టీల్ప్లాంటు విషయంలోనూ అలాగే నిలబడతా. దీనిపై అమిత్షాకు ఇప్పటికే తెలియజేశా. అందుకే ప్రైవేటీకరణ ఆగింది. జనసేనకు మద్దతుగా నిలబడితే స్టీల్ప్లాంటు కోసం నా సర్వశక్తులతో అండగా ఉంటా’ అని జనసేనాని భరోసా ఇచ్చారు.
రావోయి మా రాష్ట్రానికి.. ఈజీగా గంజాయి దొరుకుతాది!
‘రావోయి మా కంట్రికి.. నువ్వు తిననీకి బ్రౌన్ షుగరు మందున్నాది. నువ్వు తాగనీకి సర్కారు సారా ఉన్నది’ అని జానీ సినిమాలో నేను పాట పాడా. సెన్సార్ నేపథ్యంలో ‘రావోయి మా ఇంటికి బొంబాట లైఫ్ ఉన్నది’గా మారింది. ఈ రోజు ఆ పాట పాడమంటే.. ‘రావోయి మా రాష్ట్రానికి. ఈజీగా గంజాయి దొరుకుతుంది. నువ్వు తాగడానికి బోలెడంత సర్కారు సారా ఉంటుంది’ అనొచ్చు. బ్రౌన్ షుగరు, గంజాయి, మద్యంతో రూ.వేల కోట్లు కూడబెట్టారు. జగన్కు డబ్బులు పెరిగిపోయి.. ప్రజలు ఏం తినాలి? ఏం ధరించాలి? అనేవి కూడా నిర్దేశించే స్థాయికి వెళ్లారు’ అని పవన్ వ్యాఖ్యానించారు.
అలాంటి చిల్లర పనులకు అధికారులను వాడుకోం
‘పోలీసు వ్యవస్థను రాజకీయ పార్టీలకు గూండాల్లా వాడుకోకూడదు. తెదేపా, జనసేన అధికారంలోకి వస్తే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. బలమైన పోలీసు అధికారులు, చట్టానికి లోబడి పనిచేసే వారినే తీసుకొస్తాం. నా సినిమాలను ఆపేందుకు అధికారులు థియేటర్ల వద్ద కాపాలా కాశారు. అలాంటి చిల్లర పనులకు వారిని మేం వాడుకోం. ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలి. మత్స్యకారులకు ప్రతి 30 కి.మీ.లకు ఒక జెట్టీ ఉండేలా కృషి చేస్తాం. ఏపీలో బీసీ జాబితాలో ఉన్న 29 కులాలను తెలంగాణలో బీసీ జాబితాలో నుంచి తీసేశారు. 151 ఎమ్మెల్యేలను ఇచ్చినా వైకాపా నాయకులు ఒక్కరు కూడా దీన్ని ప్రశ్నించ లేదు. ఎన్నికలప్పుడు మాత్రం ఒకరికొకరు సహకరించుకున్న నాయకులు దానిపై కనీసం ఆలోచించలేదు’ అని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, తెదేపా, జనసేన ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం