సంక్షిప్త వార్తలు (5)
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ దానీశ్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను భాజపా ఎంపీ రమేశ్ బిధురి విచారం వ్యక్తం చేశారు.
బీఎస్పీ ఎంపీ దానీశ్ అలీపై అనుచిత వ్యాఖ్యలకు విచారం తెలిపిన భాజపా ఎంపీ
దిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో బీఎస్పీ ఎంపీ దానీశ్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను భాజపా ఎంపీ రమేశ్ బిధురి విచారం వ్యక్తం చేశారు. గురువారం లోక్సభ హక్కుల కమిటీ ముందు హాజరైన రమేశ్ బిధురి తన తప్పును అంగీకరించడంతో ఇక ఈ వివాదం ముగిసిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నివేదికను స్పీకర్కు లోక్సభ హక్కుల కమిటీ సమర్పించనుంది. మరోవైపు దానీశ్ అలీ కూడా కమిటీ ముందు హాజరై వివాదానికి సంబంధించిన వివరాలు అందించినట్లు తెలిసింది. ప్రధాని మోదీని తాను అవమానించానన్న భాజపా ఎంపీల ఆరోపణలను ఆలీ తోసిపుచ్చారు.
‘ఇండియా’ కూటమి సమావేశంలో సీట్ల పంపకమే ప్రధాన ఎజెండా!
దిల్లీ: ఈ నెల మూడో వారంలో జరగనున్న ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశంలో సీట్ల పంపక ఒప్పందాలపై కసరత్తు ప్రధాన ఎజెండా కానుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డిసెంబరు 17 - 20 తేదీల మధ్య జరగనున్న ఈ భేటీకి ఇంకా కచ్చితమైన తేదీ ఖరారు చేయలేదని చెప్పాయి. వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై సత్వరం నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులు క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన తెచ్చుకునేందుకు తగినంత సమయం ఉంటుందని ఆయా పార్టీల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి పార్టీల సభాపక్ష నేతల సమావేశం బుధవారం జరిగిన విషయం తెలిసిందే. పార్లమెంటు శీతాకాల సమావేశాలకుగాను ఉభయ సభల్లో ప్రతిపక్షాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో నేతలంతా ప్రధానంగా దృష్టి పెట్టారు. అంతకుముందు జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో సీట్ల పంపకం విషయాన్ని టీఎంసీ నేతలు లేవనెత్తారు.
అవి చాయ్ సమోసా భేటీలే
జేడీయూ ఎంపీ వ్యాఖ్య
పట్నా: మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాని మోదీని ప్రశంసించిన జేడీయూ ఎంపీ సునీల్కుమార్ పింటు తాజాగా ఇండియా కూటమిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూటమిలోని పార్టీల మధ్య విభేదాలను ఎత్తిచూపుతూ నాయకుల ఐక్యతను ప్రశ్నించారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం వాయిదాపడటంపై సునీల్కుమార్ స్పందిస్తూ..‘‘పార్టీల మధ్య సీట్ల పంపిణీపై అవగాహన రానంతవరకు అవి చాయ్ సమోసా భేటీలే’’ అని వ్యాఖ్యానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జేడీయూతో కొనసాగలేనని ఇప్పటికే ప్రకటించిన సునీల్కుమార్.. బిహార్ సీఎం నీతీశ్ కోరితే వెంటనే రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
మోదీ విజయాల అంకగణితంతో విపక్షాల లెక్కలు తారుమారు: నఖ్వీ
గాజియాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయాల అంకగణితం ఇండియా కూటమి నేతల లెక్కలను తారుమారు చేస్తోందని భాజపా సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని రాంపుర్ జిల్లా కోయ్లా గ్రామంలో గురువారం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రజాదరణతో పర్వత సమానంగా ఎదిగిన నేతను తమ ప్రత్యామ్నాయ గుంపు జయించలేదన్న వాస్తవాన్ని విపక్షాలు గుర్తించాలన్నారు. భాజపా ఘనవిజయం వారసత్వ రాజకీయాల నేతలను ఒత్తిడికి గురిచేసి ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన ప్రేమ దుకాణంలో మోసపూరిత సామాను విక్రయిస్తోందని చెప్పడానికి చరిత్ర నిదర్శనమని నఖ్వీ ఎద్దేవా చేశారు. దశాబ్దాల తరబడి తమను దోపిడీకి గురిచేస్తున్న ఓట్ల వ్యాపారుల కబంద హస్తాల నుంచి మైనారిటీలు బయటపడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
బోగస్ ఓట్లపై ఉన్న శ్రద్ధ రైతులపై ఏదీ!
లంకా దినకర్ విమర్శ
ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వానికి బోగస్ ఓట్లను జాబితాల్లో చేర్చడంపై ఉన్న శ్రద్ధ.. తుపాన్ బాధిత రైతులను ఆదుకోవడంపై మాత్రం లేదని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. ‘రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులు 90 లక్షల ఎకరాలకుపైగా సాగుచేయగా కేవలం 16 మంది రైతులు 0.4 హెక్టార్లలో మాత్రమే సాగుచేసినట్లు బీమా పోర్టల్లో నమోదుచేశారు. పంట నష్టం అంచనాల్లో పదేళ్ల కిందట ఉన్న సాగు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని, రైతులకు ఇప్పుడు జరిగిన నష్టాన్ని తేల్చకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. అర్హులైన రైతులకు ఫసల్ బీమా ప్రయోజనం లేకుండా, నష్ట పరిహారం అంచనా వేయకుండా వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోంది’ అని గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు