తిరుపతికి ‘బ్యాండ్’ వేశారు!
తిరుపతిలో టీడీఆర్ బాండ్ల రూపంలో భారీ కుంభకోణం జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈసీలు ఉంటే భూమి ఎవరికి ఎలా వచ్చిందనే వివరాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈసీలు లేకుండానే బాండ్లను జారీ చేశారని ఆరోపించారు.
టెంపుల్ సిటీలో రూ. 4,000 కోట్ల టీడీఆర్ కుంభకోణం
తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి
ఈనాడు, అమరావతి: తిరుపతిలో టీడీఆర్ బాండ్ల రూపంలో భారీ కుంభకోణం జరిగిందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఈసీలు ఉంటే భూమి ఎవరికి ఎలా వచ్చిందనే వివరాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈసీలు లేకుండానే బాండ్లను జారీ చేశారని ఆరోపించారు. ఈసీలను బయట పెట్టాలని, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన నెల్లూరు తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తిరుపతిలో వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు, తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తిరుపతి మాస్టర్ప్లాన్ కమిటీలోని సభ్యుల్లో ఇద్దరి పేర్లతోనూ బాండ్లు జారీ చేశారని బయటపెట్టారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే, కమర్షియల్గా చూపించి పరిహారం విలువను భారీగా పెంచి బాండ్లను కేటాయించారని పేర్కొన్నారు. ‘ఒక్క తిరుపతిలోనే టీడీఆర్ బాండ్ల రూపంలో రూ.4,000 కోట్ల కుంభకోణం జరిగింది.. ఇందులో కరుణాకరరెడ్డి రూ.2,000 కోట్ల మేర సంపాదించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ టీడీఆర్ బాండ్లపై రూ.50 వేల కోట్ల వరకు కుంభకోణం జరిగింది’ అని ఆరోపించారు. ‘ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి జగన్ నుంచి కార్పొరేషన్లలో సర్వేయర్ వరకు చాలామంది పాత్ర ఉంది. ఒక్క వైఎస్ కుటుంబమే ఈ బాండ్లపై రూ.10,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లు సంపాదించుకుంది’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తెలిపిన వివరాలివి..
తిరుపతిలో గోల్మాల్ ఇలా..
‘తిరుపతిలో 18 మాస్టర్ప్లాన్ రోడ్లను (కొన్ని కొత్తవి, కొన్ని విస్తరించినవి) ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు అభినయ్రెడ్డి మంజూరుచేశారు. వాటి కోసం సేకరించిన భూములు, ఆస్తుల పేరిట గత రెండేళ్లలో 342 బాండ్లను జారీచేశారు. వాటి వివరాలు భూమన తొక్కిపెట్టారు. అయినా సేకరించగలిగాం. తిరుపతిలో మొత్తం 2,85,406.56 చదరపు గజాలకు బాండ్లు ఇచ్చారు. గజానికి సగటున రూ.35 వేల చొప్పున వేసుకున్నా పరిహారం మొత్తం రూ.1,000 కోట్లవుతుంది. కానీ, ఈ స్థలాలన్నింటినీ కమర్షియల్గా చూపించి నాలుగు రెట్లు అధికంగా రూ.4,052 కోట్ల బాండ్లు జారీ చేశారు.
కరుణాకరరెడ్డి వేసిన కమిటీలోని వారికీ..
కరుణాకరరెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ కమిటీలోని సభ్యుల్లో మురళి, పి.అమర్నాథ్రెడ్డికి కూడా బాండ్లు ఇచ్చారు. వారు ఇతరుల భూమికి జీపీఏ తీసుకుని దాని ఆధారంగా బాండ్లు తీసుకున్నారు. వీరిద్దరూ ఒకేరోజు జీపీఏ చేయించుకున్నట్లు ఉంది. మురళికి 00062, తర్వాత నంబరు 00063 బాండ్ను అమర్నాథ్రెడ్డికి జారీ చేశారు. మురళి స్థలం ప్రభుత్వ ధర చదరపు గజం రూ. 10 వేలు.. కానీ, 16 నెలల్లోనే దాని ధర రూ.1.60 లక్షకు పెంచి ఆయనకు రూ.12.69 కోట్ల బాండ్ ఇచ్చారు. అమర్నాథ్రెడ్డికి రూ.14.72 కోట్ల బాండ్ ఇచ్చారు.
కంచి రాము బాండ్ నంబరు 00356
‘3,113 చదరపు గజాలకు రూ.61 కోట్ల బాండ్ ఇచ్చారు. అందులో చూపించిన స్థలం నివాసిత ప్రాంతం. అయినా కమర్షియల్గా రేటు కట్టి ఇచ్చారు.
కె.వెంకటరమణారెడ్డి బాండ్ నంబరు 00320
‘4,793 చదరపు గజాలు సేకరించారు. ఈ స్థలం ఉన్న ప్రాంతం వివాదాస్పదమైంది. మఠం భూములు, అధికార వైకాపా పెద్ద నేతల భూములు అక్కడున్నాయి. అయినా వెంకటరమణారెడ్డి స్థలాన్ని కమర్షియల్గా చూపించి రూ. 53.72 కోట్ల బాండ్ ఇచ్చారు. కమర్షియల్ కింద మార్పు (కన్వర్షన్) చేసినట్లు ధ్రువీకరణ పత్రం కూడా లేదు.
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడి కూతురు పెద్దిరెడ్డి ఆశ్రిత భూమిని కమర్షియల్గా చూపించి 60 సెంట్లకు రూ.32.52 కోట్ల బాండ్ పొందారు.
- పులిగోరు మహేశ్వరరెడ్డికి 3,415 చదరపు గజాలకు రూ.55.55 కోట్ల బాండ్ ఇచ్చారు.
- అన్నపూర్ణ (ఈమె పెద్దిరెడ్డి బినామీ అంటున్నారు)కు రూ.27 కోట్ల బాండ్ జారీచేశారు.
భూమనకు దమ్ముందా..
రూ.లక్ష విలువైన టీడీఆర్ బాండ్ ఉంటే 40 నుంచి 45 శాతం ఎక్కువ ధరతో బిల్డర్లు కొంటున్నారు. వాటిని ఎమ్మెల్యేల బ్రోకర్లే అమ్మాలి తప్ప, అవి ఉన్నవారు అమ్ముకోలేరు. తిరుపతిలో ఇలా బ్రోకర్ల ద్వారా అమ్మిన బాండ్లపై భూమన కరుణాకరరెడ్డి దాదాపు రూ.2,000 కోట్లు సంపాదించుకున్నారు. అదేంలేదని మీరు, మీ కుమారుడు తిరుమల శ్రీవారి ముందు ప్రమాణం చేయగలరా కరుణాకర్రెడ్డి?’ అని ఆనం సవాల్ చేశారు.
పాత బాండ్లపై విచారణ ఏదీ?
రూ. 40,000 నుంచి రూ. 50,000 కోట్ల టీడీఆర్ బాండ్లు ఇష్యూ అయిపోయాక.. ఈ ఏడాది అక్టోబరు 30న బాండ్ల జారీ పర్యవేక్షణకు కమిటీ వేయాలంటూ పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మరి పాతవాటి సంగతి ఏం చేస్తారు? వాటిపై విచారణ జరపరా? తెదేపా అధికారంలోకి రాగానే ఈ బాండ్ల వ్యవహారంపై విచారణ చేయిస్తుంది. సీబీఐ విచారణ కోరతాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆ డబ్బును ప్రభుత్వానికి తిరిగి కట్టిస్తాం’ అని ఆనం అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్