Jayadev Galla : కక్ష సాధింపుల వల్లే వనవాసం
‘‘కక్ష సాధింపుల వల్ల నేను రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాను. వివిధ పరిమితుల కారణంగా ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయలేకపోతున్నాను.
లోక్సభ చివరి ప్రసంగంలో ఎంపీ గల్లా జయదేవ్ భావోద్వేగం
ఆర్థిక రంగానికి చేయూతనిచ్చే వ్యాపారులను గౌరవించాలని వినతి
తమ గ్రూప్ ద్వారా 17వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వెల్లడి
తనలాంటి నాయకులు ఎందరో పదేళ్లుగా వేధింపులకు గురవుతున్నారని వ్యాఖ్య
ఈనాడు, దిల్లీ: ‘‘కక్ష సాధింపుల వల్ల నేను రాజకీయాల నుంచి విరామం తీసుకుంటున్నాను. వివిధ పరిమితుల కారణంగా ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయలేకపోతున్నాను. 14 ఏళ్ల వనవాసం ముగిసిన తర్వాత రాముడు తిరిగి వచ్చినట్లే, నేను నా పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించగలిగినప్పుడు, ప్రజలకు అర్హుడినైన ప్రతినిధిగా ఉండగలిగినప్పుడు నేను మరింత బలంగా తిరిగి వస్తాను’’ అని గుంటూరు ఎంపీ, తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సోమవారం మాట్లాడుతూ ఇదే తన చివరి ప్రసంగమని తెలిపారు. ఈ సందర్భంగా గత పదేళ్లలో దేశంలో, రాష్ట్రంలో జరిగిన వివిధ పరిణామాలను ప్రస్తావించారు.
‘‘రాజకీయ ప్రక్రియలో వ్యాపారం చాలా ముఖ్యమైన భాగం. ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చి, వృద్ధిని వేగవంతం చేయడంలో వ్యాపారుల పాత్ర కీలకం. వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలగాలి. ప్రతీకార భయం, వ్యాపారాలపై దాడులు చేస్తారన్న ఆలోచన లేకుండా మాట్లాడే వాతావరణం కల్పించాలి. రాజకీయ అభిప్రాయాలతో ఏకీభవించలేదన్న కారణంతో చట్టబద్ధంగా నడిచే వ్యాపార సంస్థలను వేధించే అవకాశం లేకుండా పార్లమెంటు రక్షణ కల్పించడం ముఖ్యం. పార్లమెంటు సభ్యుల అఫిడవిట్లను పరిశీలిస్తే అందులో 20% మంది తమకు వ్యాపారాలున్నట్లు ప్రకటించారు. గత పదేళ్లుగా నేను ఎదుర్కొంటున్న సమస్యలే వారికీ ఉన్నాయని నమ్ముతున్నా. ప్రభుత్వాలు నిర్ణయించే ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి వ్యాపారస్తులు చేయూతనందిస్తారు కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లోని రాజకీయ, పరిపాలన వ్యవస్థలు వ్యాపారస్తులను ప్రోత్సహిస్తుంటాయి.
దురదృష్టవశాత్తు మన దేశంలో మాత్రం నిరంతరం ప్రతీకార భయం వెంటాడుతోంది. ఒక వ్యాపారానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి 70కి పైగా అనుమతులు తీసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ... ఇందులోని ప్రతి వ్యవస్థనూ ఆయుధంగా ప్రయోగించడానికి వీలుంది. అది మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ నినాదాలకు గొడ్డలిపెట్టులా పనిచేస్తుంది. నేను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నా నిద్రపోను. వ్యాపారవేత్తగా పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి ద్వారా రాష్ట్రానికి, దేశానికి సేవ చేస్తూనే ఉంటాను. మా గ్రూప్ 17వేల మందికి ఉద్యోగాలు కల్పించి, వారి కుటుంబసభ్యుల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోంది’’ అని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా.. పోలవరం.. విభజన సమస్యలపై...
గల్లా జయదేవ్ తన ప్రసంగంలో రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టుతోపాటు, విభజన చట్టంలోని హామీల గురించి మాట్లాడారు. ‘‘రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు గురించి ప్రస్తావించడాన్ని స్వాగతిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 13వ షెడ్యూలు ప్రకారం 11 సంస్థలు ఏర్పాటుచేయాలి. ఇక్కడ పోలవరం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. తెదేపా అధికారం నుంచి వైదొలిగే 2019 నాటికి 75% పనులు పూర్తయ్యాయి. అయిదేళ్లు గడిచినా నాడు ఎక్కడున్నాయో అక్కడే ఉన్నాయి. రెండో సవరించిన అంచనా మొత్తం రూ.55,656 కోట్లకు ఆమోదముద్ర వేసి, నిర్దిష్ట గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని ఈ నా చివరి ప్రసంగం ద్వారా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా.
- ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా చర్చలోకి మళ్లీ వెళ్లదలచుకోలేదు. రాష్ట్రానికి 10 ఏళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధానమంత్రి మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. అయితే 14వ ఆర్థికసంఘం సిఫార్సులను సాకుగా చూపి కేంద్రం దానిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
- మేజర్ పోర్టు, సమీకృత స్టీల్ప్లాంట్, క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విశాఖ రైల్వేజోన్, వైజాగ్, విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోరైలు ప్రాజెక్టు మంజూరు లాంటి విషయాలు పెండింగ్లో ఉన్నాయి. కొత్త రైల్వేజోన్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి ఇవ్వలేదని ఇటీవల రైల్వేమంత్రి ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం మాత్రం ఇచ్చామంటోంది. ఇందులో ఎవర్ని నమ్మాలి? దీనిపై కేంద్రమంత్రి వివరణ ఇవ్వాలి.
- మనం ఎన్నికల సంవత్సరంలో ఉన్నాం. వచ్చే రెండు నెలల్లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లబోతున్నాం. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించడానికి ఎన్నికల సంఘం తప్పుల్లేని ఓటర్ల జాబితా తయారుచేయాలి. కానీ ఏపీలో క్షేత్రస్థాయి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలోని అధికారపార్టీ నేతల ఒత్తిడి కారణంగా ఎన్నికల సంఘం ఆదేశాలను కిందనున్న ఎన్నికల అధికారులు పాటించడం లేదు. కేంద్రం నుంచి ప్రత్యేక పరిశీలకులను పంపి ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని కోరాం. క్షేత్రస్థాయి అధికారులు ఓటర్ల జాబితా పరిశీలనకు వెళ్లినప్పుడు చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తూ నెపాన్ని కిందిస్థాయి సిబ్బందిపైకి వేసి చేతులు దులిపేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం