Bandi Sanjay: కేసీఆర్‌పై కేసు పెట్టాలని రేవంత్‌రెడ్డికి చెప్పా: బండి సంజయ్‌

రూ.లక్ష కోట్ల స్కాం చేసిన కేసీఆర్‌పై కేసు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెప్పానని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ తెలిపారు.

Updated : 15 Feb 2024 07:06 IST

గంభీరావుపేట, ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: రూ.లక్ష కోట్ల స్కాం చేసిన కేసీఆర్‌పై కేసు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చెప్పానని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ తెలిపారు. ‘కేసీఆర్‌ కొత్త భాష మొదలు పెట్టారు. కట్టె కాలే వరకు తెలంగాణ కోసం కొట్లాడతానని అంటున్నారు. ఆయన కట్టె కాలే వరకు తెలంగాణను దోచుకుంటారు’ అని ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి మండలాల్లో బుధవారం ప్రజాహిత యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు పిట్ట కథలు చెబితే వింటారని, ఏ భాషలో మాట్లాడితే వింటారనేదానిలో కేసీఆర్‌ ఆరితేరారని విమర్శించారు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే       సర్పంచులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారని ప్రశ్నించారు. ఒక్కో సర్పంచి రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు అప్పులపాలయ్యారన్నారు. మోదీని మళ్లీ ప్రధానిని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేస్తే రాముడికి వేసినట్లేనని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని