వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరవు
రాష్ట్రంలో వైకాపా అసమర్థ పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి ధ్వజమెత్తారు.
జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడాలంటే ఏళ్లు సరిపోవు
చిత్తూరు జిల్లాలో ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో నారా భువనేశ్వరి
కుప్పం, పుంగనూరు, పెద్దపంజాణి, న్యూస్టుడే: రాష్ట్రంలో వైకాపా అసమర్థ పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి ధ్వజమెత్తారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఆమె బుధవారం రెండోరోజు పర్యటించారు. శాంతిపురంలో ‘ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అనే అంశంపై మహిళలతో మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక పెద్దపంజాణి మండలం శివాడిలో మరణించిన కనకరాజు, కత్తార్లపల్లిలో శంకరప్ప, పుంగనూరు పట్టణం ఎన్ఎస్పేటకు చెందిన జయమ్మ, మంగళం గ్రామానికి చెందిన పద్మావతి, ఒంట్టిమిట్టకు చెందిన శ్రీనివాసు కుటుంబీకులను పరామర్శించి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. జగన్ పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మాట్లాడాలంటే సంవత్సరాలు సరిపోవని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని గంజాయికి నిలయంగా మార్చేశారని దుయ్యబట్టారు. మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్నట్లు చెబుతున్న దిశ చట్టం కాగితాలకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో 2019-21 మధ్య 30,196 మంది మహిళలు అదృశ్యమైనట్లు రాజ్యసభలో చర్చకు వచ్చిందంటే వైకాపా ప్రభుత్వ పనితీరు అర్థం చేసుకోవచ్చన్నారు. చంద్రబాబు పాలన ఉంటే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. తెదేపా పాలనలో మహిళలు ధైర్యంగా తిరిగేవారని గుర్తు చేశారు.
యువత కోసం నిలబడినందుకే అరెస్టు
ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. దీపం పథకం, పసుపు- కుంకుమ, అమృత హస్తం, సామూహిక సీమంతాలు, పెళ్లి కానుక తదితర పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. తెదేపా పాలనలో యువత ఉపాధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చి అనంతపురంలో వేలమందికి ఉపాధి కల్పించారని వివరించారు. వైకాపా పాలనలో అనేక పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని తెలిపారు. ఇక్కడి పరిస్థితులు తట్టుకోలేక అమర రాజ సంస్థ విస్తరణ పరిశ్రమను తెలంగాణలో ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రస్తుత వైకాపా పాలనలో జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పలువురు మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసి జైలులో ఉంచినప్పుడు ధైర్యంగా ఎలా ఉన్నారని స్వాతి అనే మహిళ ప్రశ్నించగా.. ఆయన ఎప్పుడూ కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తి కాదని, రాష్ట్ర భవిష్యత్తు, యువత కోసం నిలబడినందుకు వైకాపా ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదనే విషయాన్ని ప్రజలకు చెప్పేందుకే ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. తాను ధైర్యంగా రోడ్డు మీదకు వచ్చానంటే అది తన తండ్రి ఎన్టీఆర్, భర్త చంద్రబాబు ఇచ్చిన స్ఫూర్తేనన్నారు.
మహాశక్తి పథకాలు మహిళలకు వరం
చంద్రబాబు ప్రకటించిన మహాశక్తి పథకాలు మహిళలకు వరం లాంటివని భువనేశ్వరి తెలిపారు. తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం, ఉచిత వంట గ్యాస్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాలు సామాన్య, పేద కుటుంబాలకు ఆదరువుగా ఉంటాయని పేర్కొన్నారు.
కుప్పంలో నాకు మద్దతు ఇస్తారా.. చంద్రబాబుకా?
మహిళలను కాసేపు సరదా చిట్చాట్
శాంతిపురంలో మహిళలతో సమావేశం సందర్భంగా కొంతసేపు నారా భువనేశ్వరి నవ్వులు పూయించారు. ‘చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యేగా 35 ఏళ్లుగా ఆదరిస్తున్నారు. ఈ దఫా నన్ను గెలిపిస్తారా?’ అని ఆమె సరదా అన్నారు. ‘చంద్రబాబు కావాలనేవారు చేతులెత్తండి’ అనగా అందరూ చేతులెత్తారు. ‘నేను కావాలనుకునేవారు చేతులెత్తండి’ అంటే అందరూ మరోసారి చేతులు పైకి లేపారు. భువనేశ్వరి నవ్వుతూ తాను సరదాగా ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు.. అప్పుడప్పుడూ ఇలా సరదాగా మాట్లాడుకోవాలని అన్నారు. ‘మా ఆయన నన్ను బాగా చూసుకుంటున్నారు.. హెరిటేజ్ సంస్థ నిర్వహణలో సంతోషంగా ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు