తెదేపా, భాజపాతో కలిసి వస్తున్నాం
‘తెదేపా, భాజపాతో కలిసి వస్తున్నందున ఏ శక్తీ మనల్ని ఆపలేదు. అప్పుల్లో కూరుకుపోయి, అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన రాష్ట్రాన్ని కాపాడటానికి మూడు పార్టీల పొత్తు ద్వారా కృషి చేస్తున్నా. దీనికోసం ఎంతో నలిగిపోయా.
వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వం
సీఎం.. కులాలను విచ్ఛిన్నం చేశారు
నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు
భీమవరం పర్యటనలో జనసేన అధినేత పవన్
ఈనాడు, ఏలూరు: ‘తెదేపా, భాజపాతో కలిసి వస్తున్నందున ఏ శక్తీ మనల్ని ఆపలేదు. అప్పుల్లో కూరుకుపోయి, అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన రాష్ట్రాన్ని కాపాడటానికి మూడు పార్టీల పొత్తు ద్వారా కృషి చేస్తున్నా. దీనికోసం ఎంతో నలిగిపోయా. జాతీయ నాయకులతో చీవాట్లు తిన్నా. రెండు చేతులెత్తి దండం పెట్టి మా రాష్ట్రం కోసమని ప్రాధేయపడ్డా’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బుధవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసంలో ఆ పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రెండు పార్టీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో వైకాపా నాయకులు అంతర్గత విభేదాలు సృష్టించేందుకు యత్నిస్తారని, ఆ పన్నాగాల్ని తిప్పికొట్టాలని కోరారు. తర్వాత భాజపా క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పాక సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అంజిబాబును వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జనసేన ముఖ్య నేతలతో సమావేశమై ప్రసంగించారు.
అప్పులు తెచ్చి బటన్లు నొక్కుతున్నావ్
‘జగన్ నువ్వు అప్పులు తెచ్చి బటన్లు నొక్కుతూ నేను మగాణ్ని అంటున్నావ్. అభివృద్ధి చేసి మగాణ్ని అనిపించుకో. అప్పుడు నీకు సలాం చేస్తాం. తెదేపా- జనసేన ప్రభుత్వం వస్తే పథకాలతో పాటు అభివృద్ధి చేస్తాం. జగన్ నువ్వు సిద్ధం అంటే మేం యుద్ధం అంటాం’ అని అన్నారు. కానీ జగన్ యుద్ధం చేసేంత గొప్పవాడా కాదా అన్నది మనం నిర్ణయించుకోవాలని జనసేన నాయకులతో వ్యాఖ్యానించారు.
కులాలను వాడుకొని ఎదుగుతున్నారు
‘మనం కులాలను కలుపుకొనిపోతుంటే.. జగన్ వ్యక్తిగత లబ్ధి కోసం వాటిని విచ్ఛిన్నం చేస్తున్నారు. బీసీలకు సీట్లిస్తున్నామని చెబుతూనే వారిని ఉత్సవ విగ్రహాలను చేసి నిర్ణయాధికారం లేకుండా కూర్చోబెట్టారు. సంఖ్యాబలం ఉన్న కులాల్లో సఖ్యత లేదు.. అది సాధిస్తేనే ఆ కులాలు జగన్ దగ్గర దేహి అనే స్థితి నుంచి బయటపడతాయి. జగన్ లాంటి నాయకులు కులాలను వాడుకుని ఎదుగుతున్నారు. ఆ పరిస్థితి మారాలి.. మారుస్తాం. నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు. అందరి కోసం పెట్టాను. జగన్.. నువ్వు నన్ను వైజాగ్లో ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఆపితే నెట్టుకుంటూ ముందుకొస్తా. నేను ఎప్పుడు జనసేన ప్రయోజనాలు ఆలోచించలేదు. రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచించా. డబ్బులతో ఓట్లు కొనలేని రాజకీయాలు రావాలి’ అని పవన్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు, అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు.. వీళ్లంతా సమస్త మానవాళికి చెందినవారు. అలాంటి మహానుభావులను మనం కులాల పేరుతో దూరం చేసుకున్నాం. జగన్.. శెట్టిబలిజలు- కాపులు, కాపులు- క్షత్రియులు ఇలా కులాల మధ్య చిచ్చుపెట్టి సమాజంలో సుస్థిరత లేకుండా చేస్తున్నారు. జగన్ ఈ రోజు ఉంటారు.. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు గుర్తు కూడా ఉండరు. ఎన్నికల వస్తున్నాయని నేను ఇలా మాట్లాడటం లేదు. సమాజ సుస్థిరత నా ధ్యేయం’ అని చెప్పారు.
మా అన్నయ్యతో విభేదించి వచ్చా
‘భీమవరం వైకాపా ఎమ్మెల్యేకు, నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదు. తులసి అనే వ్యక్తి వచ్చి ఎమ్మెల్యే నా వియ్యంకుడు.. ఆయన్ను ఏమీ అనొద్దన్నారు. మరి మా అన్నయ్య కాంగ్రెస్లో ఉంటే ఆయనతో విభేదించి పార్టీ పెట్టా. బంధుత్వం వేరు.. రాజకీయం వేరు’ అని పవన్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
29న దిల్లీ జంతర్మంతర్లో మహిళా ధర్నా
మహిళా రిజర్వేషన్ చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందినా మోదీ ప్రభుత్వం అమలు చేయనందుకు, ఈ చట్టంలో ఓబీసీ వర్గాల మహిళలను చేర్చనందుకు నిరసనగా ఈ నెల 29న దిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?