మా బ్యాంకు ఖాతాల నుంచి అక్రమంగా రూ.65 కోట్లు తీసుకున్నారు
పన్ను చెల్లింపు వివాదం న్యాయస్థానం పరిశీలనలో ఉండగానే తమ బ్యాంకు ఖాతాల నుంచి ఆదాయపు పన్నుల (ఐటీ) శాఖ అప్రజాస్వామికంగా రూ.65 కోట్లను తీసేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఆదాయపు పన్ను శాఖపై కాంగ్రెస్ ఆరోపణ
దిల్లీ: పన్ను చెల్లింపు వివాదం న్యాయస్థానం పరిశీలనలో ఉండగానే తమ బ్యాంకు ఖాతాల నుంచి ఆదాయపు పన్నుల (ఐటీ) శాఖ అప్రజాస్వామికంగా రూ.65 కోట్లను తీసేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ బ్యాంకు ఖాతాల నుంచి రూ.5కోట్లు, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.60.25 కోట్ల బదిలీకి ఆయా బ్యాంకులను మంగళవారం ఐటీ శాఖ ఆదేశించిందని ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకన్ బుధవారం వెల్లడించారు. తమకు ఐటీ శాఖ పంపిన రూ.210 కోట్ల డిమాండ్ నోటీస్పై ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్లో బుధవారం విచారణ జరిగిందని, గురువారం కూడా ఇది కొనసాగనుందని తెలిపారు. ట్రైబ్యునల్లో విచారణ కొనసాగుతున్నందున పార్టీ ఖాతాల నుంచి డబ్బును తీసుకోవద్దని బ్యాంకులకు లేఖ రాశామన్నారు. అయినప్పటికీ ఐటీ శాఖ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ల రూపంలో నగదును బ్యాంకుల నుంచి విత్డ్రా చేయించారని ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ పన్ను చెల్లించిందా?అని మాకన్ ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీని పన్ను అధికారులు లక్ష్యంగా ఎంచుకున్నారని ఆరోపించారు. సభ్యత్వం ద్వారా, క్రౌడ్ఫండింగ్ ద్వారా, క్షేత్రస్థాయిలో చందాల ద్వారా యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐలు నిధులు సేకరించుకున్నాయని అజయ్ మాకన్ చెప్పారు. ఏయే బ్యాంకుల నుంచి ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీ డబ్బును తీసుకుందో వివరిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాల ద్వారా కాంగ్రెస్ పార్టీని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థల చర్యలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం అంతమై పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రూ.210 కోట్ల డిమాండ్ నోటీస్కు సంబంధించి గత శుక్రవారం ఐటీ శాఖ తమ బ్యాంకు ఖాతాలను నిలిపివేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ను ఆశ్రయించింది. రూ.115 కోట్లను ఖాతాల్లో నిల్వ ఉంచాలని, అంతకు మించి ఉన్న నగదును పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చంటూ ట్రైబ్యునల్ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు