వచ్చీరాగానే జోలె పట్టిన నేత
రాజధాని ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి టికెట్ల సర్దుబాటులో భాగంగా అధికార పార్టీ అధిష్ఠానం ఇటీవల నియోజకవర్గాన్ని మార్చింది. దూకుడు, దుందుడుకు స్వభాగం గల ఆ నేత కొత్త ప్రదేశానికి వచ్చీ రాగానే దుకాణం తెరిచారు.
నియోజకవర్గం మారిన ఓ నేత వసూళ్ల పర్వం
విద్యాసంస్థలు, రియల్టర్లకు బెదిరింపులు
రేయింబవళ్లూ ఇసుక తవ్వకాలు
రాష్ట్ర నడిబొడ్డున ఓ నాయకుడి నిర్వాకాలు
ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి టికెట్ల సర్దుబాటులో భాగంగా అధికార పార్టీ అధిష్ఠానం ఇటీవల నియోజకవర్గాన్ని మార్చింది. దూకుడు, దుందుడుకు స్వభాగం గల ఆ నేత కొత్త ప్రదేశానికి వచ్చీ రాగానే దుకాణం తెరిచారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతం.. రియల్ ఎస్టేట్ సంస్థలకు నెలవు. ప్రముఖ విద్యాసంస్థలకు నిలయం. నది వెంబడి ఇసుక రేవులూ ఎక్కువే. వీటన్నింటినీ ఆదాయ వనరులుగా మార్చుకున్న ఆ నేత.. అనుచరులతో కోట్లలో వసూలు చేయిస్తున్నారు. ‘ఎలక్షన్ ఫండ్’ పేరుతో జోలె పట్టి అక్రమార్జనలో మునిగితేలుతున్నారు. తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, జలవనరుల శాఖ ఇంజినీర్లకు లక్ష్యాలు విధిస్తూ వారి ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. ‘ఇక్కడికి వచ్చి నెల రోజులైనా కాలేదు. ఇప్పుడే ఇలా చేస్తుంటే రేపటి ఎన్నికల్లో గెలిస్తే తమ పరిస్థితేంటి?’ అని వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు.
జనానికి సున్నం.. అధినేత ప్రసన్నం
ఈ నాయకుడు అంతకుముందు స్వస్థలంలో ఓడిపోతే.. గత ఎన్నికల్లో మరో నియోజకవర్గానికి పంపించారు. అక్కడ గెలిచినప్పటికీ అక్రమార్జనకు పెద్దగా అవకాశాల్లేకుండా పోయాయి. దీంతో పాత నియోజకవర్గంలోని వనరులపై కన్నేశారు. ఇసుక, బూడిద రవాణాకు సొంత ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేతో విభేదాలు రావడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఉచితంగా దొరికే బూడిదను ఎత్తి రూ.కోట్లు కొల్లగొడుతున్న వైనంపై అధినేతకు ఫిర్యాదులు వెళ్లాయి. కానీ ఆ దూకుడు నేతను ఏమీ అనకపోవడంతో అతని దందాకు లైసెన్స్ ఇచ్చినట్లైంది. అదే క్రమంలో అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యర్థి పార్టీపైకి కర్రలు చేతబూని మరీ దాడికి వెళ్లారు. ఈ ఘటన తర్వాత అధినేత మరింత పెద్ద పదవితో వీరతిలకం దిద్దారు. ఇక అంతే, అతని ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
అక్రమాల చిట్టాలో మచ్చుకు కొన్ని..
ఈ నేత కొత్త నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించిన వెంటనే అతనిలోని అసలు అక్రమార్జనుడు నిద్ర లేచాడు. అంతకుముందు అక్కడి ప్రజాప్రతినిధి దగ్గర ఉన్న ‘రాంబంటు’.. అతన్ని వదిలి ఈ నేత పంచన చేరారు. ఈ వ్యక్తి గతంలో రాముని పేరు చెప్పి రూ.కోట్లు కొల్లగొట్టడంతో ఆ నేత పక్కన పెట్టారు. ఇప్పుడీ కొత్త నాయకుడి వద్ద విధేయుడిగా చేరిన రాంబంటు స్థిరాస్తి వ్యాపారుల వద్ద ఎన్నికల ఖర్చు పేరుతో జోలె పట్టారు. ఓ ప్రముఖ సంస్థ పంచాయతీ అనుమతులు లేకుండానే 40 ఎకరాల్లో భారీ వెంచర్ వేసింది. పక్కనున్న రోడ్డుకు మరమ్మతులు చేయించేందుకు ఓ సంస్థకు రూ.10 లక్షల చెక్ అందించింది. ఇది తెలిసిన గ్రామస్థులు.. రోడ్డు ధ్వంసమైందని, రూ.కోటి ఇవ్వాల్సిందేనని భీష్మించారు. వెంచర్లో పనులను అడ్డుకొని వాహనాలు రాకుండా రోడ్డును తవ్వేశారు. కొత్త ప్రజాప్రతినిధి రంగంలో దిగి, వ్యవహారం చక్కబెట్టారు. రియల్టర్ల నుంచి ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.40 లక్షల గుడ్విల్ అందుకున్నారు. గ్రామస్థుల నోటికి తాళం వేయించారు.
- ఈ నియోజకవర్గంలో విద్యా సంస్థలు ఎక్కువ. రెండు ప్రముఖ సంస్థల బ్రాంచీలు అనేకం ఉన్నాయి. ఈ నాయకుడికి ఎన్నికల విరాళం ఇవ్వాలంటూ అనుచరుడు రాంబంటు ద్వారా ఆ కాలేజీలకు సందేశం పంపించారు.
- మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమాంతం పడిపోయిన స్థిరాస్తి వ్యాపారం.. తెదేపా- జనసేన పొత్తు ప్రభావంతో ఇటీవల పుంజుకుంటోంది. కొత్తగా వెంచర్లు వేస్తున్న వారిపై కన్నేసిన వసూలురాజా అనధికార లేఔట్లు, నిర్మాణాలను టార్గెట్గా చేసుకొన్నారు. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. రాంబంటుకు గతంలో ఉన్న అనుభవంతో వెంచర్ల యజమానులకు హెచ్చరికలు పంపుతున్నారు. మూణ్నాలుగు వారాలుగా ఈ ప్రాంతంలో రియల్టర్లు హడలిపోతున్నారు. వసూలురాజా నివాసం సమీపంలోనే ఉన్నా ఆర్అండ్బీ అతిథి గృహాన్ని అడ్డాగా మార్చుకున్నారు.
- తన నియోజకవర్గం కాకపోయినా జగనన్న కాలనీల పేరుతో కలెక్టర్ల నుంచి గ్రావెల్ తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు. అనుచరులతోమట్టి తవ్విస్తున్నారు. నగరానికి సమీపంలో కొండలను కరిగించేస్తున్నారు.
- ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగైదు ఇసుక రేవులు ఉన్నాయి. కొత్తగా టెండర్ దక్కించుకున్న సంస్థను కాదని, ఇసుక తవ్వకాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ రీచ్ల నుంచి హైదరాబాద్కు ఇసుక తరలిస్తున్నారు. రోజుకు రూ.50 లక్షల చొప్పున 20 రోజులుగా రూ.10 కోట్ల వరకు కొల్లగొట్టారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
- ఈ నాయకుడి అనుచరులు నియోజకవర్గంలోని ఓ మున్సిపల్ కమిషనర్ను ‘సార్ పర్యటనలకు ఖర్చులు భరించాలి. మీ వాటా రూ.లక్ష!’ అంటూ రేట్ ఫిక్స్ చేశారు. ఆ అధికారి కిమ్మనకుండా సమర్పించుకున్నారు. తహసీల్దారు, ఎంపీడీవోలు, ఇంజినీర్లకు కూడా టార్గెట్లు పెడుతున్నారు. మహిళలతో సమావేశాలు నిర్వహిస్తూ చికెన్తో భోజనాలు పెట్టిస్తూ, బిల్లులు మాత్రం డ్వాక్రా గ్రూపులకు పంపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి