28న తెదేపా-జనసేన ఎన్నికల శంఖారావం
వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఫిబ్రవరి 28న తెదేపా, జనసేన ఉమ్మడి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆ రోజు భారీ బహిరంగసభ నిర్వహించనున్నాయి.
తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ
రెండు పార్టీల సమన్వయ కమిటీల సమావేశంలో నిర్ణయం
ఎన్డీఏలోకి ఆహ్వానించారు.. చర్చలు జరుగుతున్నాయి
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడి
వైకాపా విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యం
జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన
ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఫిబ్రవరి 28న తెదేపా, జనసేన ఉమ్మడి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆ రోజు భారీ బహిరంగసభ నిర్వహించనున్నాయి. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో గురువారం తెదేపా, జనసేన సమన్వయ కమిటీలు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. అనంతరం ఇరు పార్టీల నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్లు విలేకర్లకు ఈ వివరాలను వెల్లడించారు. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అన్ని విషయాలు ప్రజలకు వెల్లడిస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ‘ఇప్పటికే మాతో పొత్తులో ఉన్న జనసేన ఎన్డీఏలో భాగస్వామి. ఆ కూటమిలో చేరాలని తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం అందింది. మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు దిల్లీ వెళ్లి మాట్లాడారు. చర్చలు జరుగుతున్నాయి. ఇందులో దాపరికమేదీ లేదు. త్వరలోనే అన్నీ ఖరారవుతాయి. ప్రజలకు అన్నీ వెల్లడిస్తాం’ అని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నేతలు యనమల రామకృష్ణుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, తంగిరాల సౌమ్య... జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఆ పార్టీ నాయకులు కందుల దుర్గేష్, బి.మహేందర్రెడ్డి, కొటికలపూడి గోవిందరావు (చినబాబు), బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్వి గురువారం విజయవాడలో భేటీ అయ్యారు. ఈ సమావేశం రెండు గంటలకు పైగా జరిగింది. ఉమ్మడి మ్యానిఫెస్టోకు తుదిరూపు ఇవ్వడం, ఉమ్మడి బహిరంగసభ నిర్వహణ, రెండు పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రెండు పార్టీల నాయకులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ఇరు పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం
వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని, ఏపీలో వైకాపాకు బైబై చెప్పాలని ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పొత్తు నిర్ణయం తీసుకుని కలిసి ప్రయాణిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో ఉమ్మడి ఎన్నికల శంఖారావంలో రెండు పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరాన్ని ఉమ్మడిగా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నాయి. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ల నేతృత్వంలో జరిగే సభకు రెండు పార్టీల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులంతా హాజరవుతారు. దాదాపు 6 లక్షల మంది ఈ బహిరంగసభకు హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయకులు వెల్లడించారు.
మ్యానిఫెస్టోపై కసరత్తు
ఉమ్మడి మ్యానిఫెస్టోపైనా సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించారు. దాదాపు ఇది కొలిక్కి వచ్చింది, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలుగుదేశం ఇప్పటికే ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజలకు ఏం చేయబోతున్నామో చెప్పి, వాటిని జనంలోకి తీసుకెళ్తోంది. మరోవైపు ‘జనసేన షణ్ముఖ వ్యూహం’లో భాగంగా ప్రజలకు ఏమేం చేయబోతున్నారో ప్రకటించారు. ఈ రెండింటినీ కలపడంతో పాటు ఇంకా ఏయే అంశాలు చేర్చాలో ఈ సమావేశంలో చర్చించారు.
ఇంత దుర్మార్గపు సీఎంను చూడలేదు: అచ్చెన్నాయుడు
‘రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలను, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. జగన్ లాంటి దుర్మార్గ, దారుణ సీఎంను ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రంలో మొదటిసారి 5 కోట్ల మంది ప్రజలు అసహ్యించుకునే ముఖ్యమంత్రిగా ఆయన పేరుపొందారు. ఒక సైకోలా రాష్ట్రాన్ని నాశనం చేశారు. అందుకే మరోసారి జగన్ ముఖ్యమంత్రి కాకూడదని, ఆయన ప్రజావ్యతిరేక విధానాలు, దళిత, బడుగు బలహీనవర్గాలపై దమనకాండపై తెలుగుదేశం, జనసేన కలిసి పోరాటం చేస్తున్నాయి. జగన్ సామదాన భేద దండోపాయాలతో గెలవాలని చూస్తున్నారు. ఇప్పటికే కుటుంబాలను చీలుస్తున్నారు. తగాదాలు పెడుతున్నారు. జనసేన, తెలుగుదేశం మధ్య తగాదాలు పెట్టి తాను లాభపడాలన్నది జగన్ ఆలోచన. కులాలు, మతాలు, వ్యక్తుల మధ్య కూడా ఆయన తగాదాలు పెడతారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు కూడా పన్నుతున్నారు’ అని అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రజలంతావీటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో తెదేపా-జనసేన కూటమిని గెలిపించి, రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాం: మనోహర్
వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు లక్ష్యంగా జనసేన తెదేపాతో పొత్తు పెట్టుకుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎక్కడా లోపం లేకుండా రెండు పార్టీల నాయకులు మంచి భావనతో ముందుకు సాగుతున్నామన్నారు. సీట్లు, ఓట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఉమ్మడిగా, బలంగా కలిసి పని చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. పొత్తు ధర్మంలో భాగంగా కొందరు నాయకులు త్యాగాలు చేయడానికి సిద్ధపడాలని, కచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు.
మీడియాపై గూండాగిరీ ప్రజాస్వామ్యానికి హానికరం
కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెళ్తాం
తెదేపా- జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో తీర్మానం
ఈనాడు, అమరావతి: ‘ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలా ఉన్న మీడియాపై ఆంధ్రప్రదేశ్లో దాడులు పెరిగిపోతుండటం దురదృష్టకర పరిణామం. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో మీడియా ప్రతినిధులు, మీడియా కార్యాలయాలపై ఒక పథకం ప్రకారం వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. పాలకపక్షమే ఈ దాడులు చేస్తుండటం వైకాపా నైజాన్ని వెల్లడిస్తోంది. మీడియాపై దాడులు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితులను ప్రెస్ కౌన్సిల్ దృష్టికి, కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెళ్తాం’ అని తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీల సమావేశం తీర్మానించింది. కర్నూలులో ‘ఈనాడు’ కార్యాలయంపై దాడి, ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ, న్యూస్టుడే, ఆంధ్రజ్యోతి విలేకరులు పరమేశ్వరరావు, వీరశేఖర్లపై చేసిన మూకదాడులు, తుని నియోజకవర్గంలో సత్యనారాయణ అనే విలేకరి హత్య ఘటనలను సమావేశం తీవ్రంగా ఖండించింది. వైకాపా పాలనలో రాష్ట్ర పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో, నేతల అరాచకాలు, పాలకుల వైఖరి ఏ స్థాయిలో ఉన్నాయో పత్రికలు, ఛానళ్లు ప్రజలకు తెలియచెబుతున్నాయంది. ఇది జీర్ణించుకోలేని వైకాపా ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛను హరించడంతో పాటు దాడులకు పాల్పడుతోందని సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికా సంస్థలు, పాత్రికేయులను కట్టడి చేసేందుకు తొలుత జీఓలు ఇచ్చి కేసులు నమోదు చేయించిందని, ఇప్పుడు దాడులకు తెగబడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?