షర్మిల అరెస్టు
మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ప్రధాన డిమాండ్లతో కాంగ్రెస్పార్టీ గురువారం చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
బలవంతంగా లాక్కెళ్లి వాహనం ఎక్కించిన పోలీసులు
వాహనమెక్కుతూ జారిపడగా.. షర్మిలకు స్వల్ప గాయం
కాంగ్రెస్ ‘చలో సచివాలయం’ తీవ్ర ఉద్రిక్తం
ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్-అమరావతి, మంగళగిరి-న్యూస్టుడే: మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ప్రధాన డిమాండ్లతో కాంగ్రెస్పార్టీ గురువారం చేపట్టిన చలో సచివాలయం కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పీసీసీ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జగన్ ప్రభుత్వం తీవ్రంగా యత్నించింది. షర్మిల కూడా అంతే మొండిగా వ్యవహరిస్తూ ముందుకెళ్లారు. పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించే క్రమంలో వాహనం మెట్లపై జారి పడటంతో షర్మిల చేతికి స్వల్ప గాయమైంది. ఈ సందర్భంగా ‘సీఎం జగన్ డౌన్ డౌన్’ అంటూ ఆమె నినాదాలు చేశారు. పోలీసులు దొరికినవారిని దొరికినట్లుగా నాయకులు, కార్యకర్తలను వాహనాల్లో ఎక్కించి స్టేషన్లకు తరలించారు. షర్మిలతోపాటు మొత్తం 47 మందిని అరెస్టు చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావలసిన కార్యక్రమం పోలీసుల అత్యుత్సాహంతో 2 గంటల ఆలస్యంగా 12 గంటలకు మొదలైంది. వివిధ జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలను విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ ముందు పోలీసులు అడ్డుకుని స్టేషన్లకు తరలించారు. పోలీసుల తీరుకి నిరసనగా షర్మిలతోపాటు పలువురు సీనియర్ నేతలు ఆంధ్రరత్న భవన్ ప్రాంగణంలో ఉదయం 10.30 గంటలకు బైఠాయించారు. దాదాపు 2 గంటలపాటు ఆమె అక్కడే ఉన్నారు. సీఎం జగన్ డౌన్ డౌన్...దగా డీఎస్సీ వద్దు..మెగా డీఎస్సీ కావాలి’ అంటూ నినాదాలు చేశారు.
రాస్తారోకోలు...నిరసనలు
మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రరత్న భవనం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి షర్మిల కాలినడకన సచివాలయానికి బయలు దేరారు. మార్గమధ్యలో స్వర్ణప్యాలెస్ హోటల్, పోలీసు కంట్రోల్ రూం కూడలిలో రాస్తారోకో చేశారు. రెండు సందర్భాల్లోనూ ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎండలోనూ రోడ్డుపై కార్యకర్తలతో కలిసి ఆమె బైఠాయించారు. అక్కడి నుంచి వారు వాహనాల్లో ప్రకాశం బ్యారేజీ మీదుగా సచివాలయానికి బయలుదేరారు. కొండవీటివాగు ఎత్తిపోతల పథకం వద్ద పెద్దఎత్తున మోహరించిన పోలీసులు మధ్యాహ్నం 1:40 గంటల సమయంలో కాంగ్రెస్ నేతల వాహనాలను అడ్డుకున్నారు. వాహనాల్లోని కాంగ్రెస్ నేతలను లాక్కెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. కొందరు సీనియర్ నేతలను కాళ్లు, చేతులు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తోపులాట జరిగింది.
షర్మిలను బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు
మహిళా పోలీసులు షర్మిలను వాహనం నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ సందర్భంగానే ఆమె వాహనం మెట్లపై జారిపడ్డారు. పోలీసుల తీరుపై షర్మిల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి మంగళగిరి పోలీసుస్టేషన్కు తరలించారు. సాయంత్రం విడుదల చేశారు.
సీపీఎం, సీపీఐ సంఘీభావం
చలో సచివాలయం కార్యక్రమానికి సీపీఎం, సీపీఐలు సంఘీభావం ప్రకటించాయి. ఆంధ్రరత్న భవన్లో షర్మిల బైఠాయించి నిరసన తెలియజేస్తున్న సమయంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ అక్కడికి చేరుకుని ఆమెకు మద్దతు ప్రకటించారు.
షర్మిల అరెస్టు తగదు: మాణికం ఠాగూర్
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల అరెస్టును రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ ఖండించారు. పోలీసులు అరెస్టు చేసిన విధానాన్ని చూస్తుంటే జగన్కు షర్మిలపై ఉన్న కోపం అర్థమవుతోందని గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆయన విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.