ఏటా జాబ్ క్యాలెండర్ కాదు.. ‘సాక్షి’ క్యాలెండర్ ఇస్తున్నారు
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఈ అయిదేళ్లలో వేల మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడిన పాపం మీది కాదా అని ముఖ్యమంత్రి జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు.
మెగా డీఎస్సీ పేరుతో జగన్ దగా
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేకనే నిరుద్యోగుల బలవన్మరణాలు
ఈ పాపం జగన్ ప్రభుత్వానిదే
డీఎస్సీలో మీకంటే చంద్రబాబే నయం
ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్
ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఈ అయిదేళ్లలో వేల మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడిన పాపం మీది కాదా అని ముఖ్యమంత్రి జగన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. ఇవి నిజంగా ఆత్మహత్యలా? ప్రభుత్వం చేస్తున్న హత్యలా అని ఆమె మండిపడ్డారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారిలో ఏటా 500 మంది చనిపోతున్నారంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణం. ఇది మనం చేతులారా చేసుకున్న పాపం కాదా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత ఆత్మహత్యలకు పాల్పడిన విషయం ఒక సర్వేలో వెల్లడైందన్నారు. ఉపాధి కోసం యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఇతర రాష్ట్రాలకు వలసలు పోతుంటే యువత లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోదా అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం చలో సచివాలయం కార్యక్రమం నిర్వహించారు.
‘ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు.. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రిగా, మంత్రులుగా అధికారం అనుభవిస్తున్నారు. చదువుకున్న వారికైతే ఉద్యోగాలు లేవు’ అని షర్మిల ఆక్షేపించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి కార్యక్రమం ప్రారంభించే ముందు, పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీస్స్టేషన్కు తరలించాక షర్మిల విలేకరులతో మాట్లాడారు. ‘జాబ్ నోటిఫికేషన్ల వరద పారిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగనన్న ఒక్క జాబ్ క్యాలెెండర్ అయినా ఇచ్చారా? 23 వేల టీచర్ ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇస్తామన్న మెగా డీఎస్సీ ఎక్కడ? గత ఎన్నికల ముందు చెప్పినట్లుగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం మీకు లేదా? బాబు పోవాలి..జాబ్ రావాలి అనే నినాదం మీది కాదా? అధికారంలోకి వచ్చాక ఈ అయిదేళ్లూ ఏం చేశారు? మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ వేశారు’ అని జగన్పై షర్మిల మండిపడ్డారు.
సచివాలయాల్లో ఉద్యోగాలు జగనన్న తన సైన్యానికి ఇచ్చుకున్నవే
‘అయిదేళ్లలో ఆరు లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని జగనన్న చెబుతున్నారు. పొరుగు సేవలు, ఒప్పంద కార్మికులు కూడా అందులో ఉన్నారని అంటున్నారు. 1.21 లక్షల ఉద్యోగాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో జగనన్న తన సైన్యం కోసం ఇచ్చుకున్నవే. ఆర్టీసీని విలీనం చేస్తేనే వచ్చినవి 51 వేల ఉద్యోగాలు. 2.30 లక్షల ఉద్యోగాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. 2,557 ఉద్యోగాలే ఇప్పటివరకూ భర్తీ చేశారు. 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడానికి సిగ్గుండాలి? వైఎస్ఆర్ మెగా డీఎస్సీ వేసి ఉద్యోగాలు భర్తీ చేశారు. మాట తప్పం మడమ తిప్పమన్నారు..వైఎస్ఆర్ వారసత్వం అంటే ఇదేనా? నవరత్నాలు, జాతిరత్నాలు ఏమయ్యాయి? అయిదేళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
చంద్రబాబును విమర్శించి నువ్వేం చేశావు?
‘డీఎస్సీలో ఏడు వేల ఉద్యోగాలే ఇచ్చారని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టావా? లేదా? మీ ప్రభుత్వంలో ఆరు వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకే డీఎస్సీ ఇచ్చావు. మీకంటే చంద్రబాబే నయం. ఎన్నికలకు ముందు మీరు డీఎస్సీ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా? ఈ అయిదేళ్లూ గుడ్డి గుర్రానికి పళ్లు తోమావా?’ అని జగన్ ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జర్నలిస్టులను కొడుతున్నారంటే...మీరు భయపడుతున్నారన్న వాస్తవం స్పష్టంగా కనిపిస్తోంది. 30 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ను మొదట మీరు వెంటనే ప్రకటించండి. దాని అమలు విషయం వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది’ అని షర్మిల అన్నారు.
తాలిబన్ల పాలనలో ఉన్నామా? ఏమిటీ అరాచకం?
‘చలో సచివాలయం అంటే మాపై ఆంక్షలు ఎందుకు? ఇదేనా ప్రజాస్వామ్యం? ఏపీ తాలిబన్ల పాలనలో ఉందా? అరెస్టులతో కర్ఫ్యూ వాతావరణం తెచ్చారు. మేం దొంగలమా? బందిపోట్లమా? నిజంగా ఉద్యోగాలిచ్చి ఉంటే ఎందుకు భయపడతారు? ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని అడ్డుకోవడం ఎంతవరకు న్యాయం?రెండు రోజులుగా పోలీసులు మమ్మల్ని నియంత్రిస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అడ్డుకోవలసిన అవసరం ఏముంది? మీకు భయపడాల్సిన అవసరం మాకు లేదు’ అని ప్రభుత్వంపై షర్మిల నిప్పులు చెరిగారు.
నాన్న ఆత్మ క్షోభిస్తుంది
‘నా పరిస్థితి చూసి నాన్న (వైఎస్ఆర్) ఆత్మ క్షోభిస్తుంది. అమ్మ కూడా బాధ పడుతుంది. పోలీసులే నా చేతికి గాయం చేశారు. రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావడం లేదని పోరాటం చేసి.. వినతి పత్రం ఇవ్వడానికి కూడా హక్కు లేదా? మాట్లాడటానికీ స్వేచ్ఛ లేదా? వినతి పత్రం తీసుకునేందుకు సచివాలయంలో సీఎం, మంత్రులు, కనీసం సీఎస్ కూడా లేరట. ఈ విధంగా ఉంటే పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు ’ అని షర్మిల ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట