ఓట్ల తొలగింపునకు వైకాపా కుట్ర!
దొంగ ఓట్లు చేర్చడంతోపాటు విపక్షాల ఓట్లు తొలగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తటస్థులు, తమకు మద్దతుగా ఉండబోరని భావించిన వారి ఓట్లు తొలగించేందుకు తప్పుడు ధ్రువీకరణలు, సమాచారంతో పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు చేస్తున్నారు.
తటస్థుల ఓట్లు తొలగించేలా దరఖాస్తులు
విశాఖ పశ్చిమ వైకాపా నేత ఇష్టారాజ్యం
10 మందిపై కేసు నమోదు
ఇందులో వైకాపా బీఎల్ఏలు, ఆ పార్టీ ఇన్ఛార్జి వద్ద పనిచేసే వ్యక్తులు
ఈనాడు- విశాఖపట్నం, న్యూస్టుడే- గోపాలపట్నం: దొంగ ఓట్లు చేర్చడంతోపాటు విపక్షాల ఓట్లు తొలగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా తటస్థులు, తమకు మద్దతుగా ఉండబోరని భావించిన వారి ఓట్లు తొలగించేందుకు తప్పుడు ధ్రువీకరణలు, సమాచారంతో పెద్ద సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు చేస్తున్నారు. తాజాగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోనూ ఇలాంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తప్పుడు వివరాలతో ఫారం-7 దరఖాస్తులు చేసిన పది మందిపై గోపాలపట్నం, మల్కాపురం, కంచరపాలెం, ఎయిర్పోర్టు పోలీసుస్టేషన్లలో గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం, ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం, ఇతరుల చట్టబద్ధమైన హక్కులకు ఇబ్బంది కలిగించడం, కావాలనే తప్పుడు పత్రాలు అందజేయడం అనే నేరాల కింద 177, 181, 182, 192, 193, ఐపీసీ 66-సి, 66-డి, ఐటీఏ చట్టం 2000-2008 31(ఎ) సెక్షన్లు పెట్టారు. ఇది నిరూపణ అయితే ఆర్నెల్ల జైలు శిక్ష, రూ.వెయ్యి అపరాధ రుసుం, తీవ్రమైతే రెండేళ్ల జైలు శిక్ష, అపరాధ రుసుం విధిస్తారు. లేదా రెండు శిక్షలూ విధించొచ్చు. అయితే పోలీసులు కేసులు నమోదు చేసినా ఇప్పటివరకు వారికి ఎటువంటి నోటీసులూ అందజేయలేదని సమాచారం.
అంతా వైకాపా సేవకులే..
66 ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేసిన బి.రంగనాయకమ్మ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె వైకాపా పశ్చిమ ఇన్ఛార్జి ఆడారి ఆనందకుమార్కు చెందిన పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తారని తెలిసింది. వార్డు వాలంటీరు భార్య అయిన రొంగలి సుధ, వైకాపా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లీలానాగవల్లి, వైకాపా 204 బీఎల్ఏ జి.నూకరాజుతోపాటు సాకూరి సత్యవతి, కొలిచాన రవి, ఎస్.సుజాత, టి.యశ్వంత్రావు, కె.సత్తిబాబు, జి.కావ్య అక్రమాలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించి కేసులు నమోదు చేశారు.
4,409 ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు 163 మంది వ్యక్తులు ఒక్కొక్కరు పదికన్నా ఎక్కువ ఫారం- 7 దరఖాస్తులు చేశారు. వీరిలో వంద దరఖాస్తులు చేసినవారు కూడా ఉన్నారు. దీనిపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ముగ్గురు సభ్యుల కమిటీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. 163 మంది నుంచి వచ్చిన 4,409 అభ్యంతరాలను పరిశీలించింది. ఇందులో 750 అభ్యంతరాల్లో 545 మంది.. ఓటర్ల జాబితాలో ఉన్న చిరునామాలోనే ఉంటున్నారని, పనుల కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారని తేలడంతో వారి ఓట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. మరో 205 మంది జాబితాలో పేర్కొన్న చిరునామాలోనే ఉన్నారు. అయినా వీరి ఓట్లు తొలగించేందుకు ఉద్దేశపూర్వకంగా దరఖాస్తు చేశారని నిర్ధారించారు. ఈ ఓట్లు తొలగించాలని ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసిన వారిని గుర్తించి, కేసులు పెట్టారు. సంబంధం లేని వ్యక్తుల ఓట్లు తొలగించాలని 163 మంది పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేయడమే పెద్ద తప్పిదం. దాని తీవ్రతను తగ్గించేందుకు 10 మందిపై మాత్రమే కేసులు పెట్టి, మరో 13 మందిని హెచ్చరించి మిగిలినవారిని వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్