దూకుడుగా తొలి అడుగు
రానున్న సాధారణ ఎన్నికల్లో అధికార వైకాపాను సవాల్ చేస్తూ తెదేపా, జనసేన కూటమి తొలి అడుగు వేసింది. ఒకేసారి 99 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
99 స్థానాలకు తెదేపా-జనసేన అభ్యర్థుల ఖరారు
ఎన్నికల నోటిఫికేషన్కు ముందే తొలి జాబితా
యువత, కొత్తవారు, ప్రవాసులకు చోటు
భాజపాతో పొత్తు కొలిక్కి వచ్చాక మలి జాబితా
ఈనాడు - అమరావతి
రానున్న సాధారణ ఎన్నికల్లో అధికార వైకాపాను సవాల్ చేస్తూ తెదేపా, జనసేన కూటమి తొలి అడుగు వేసింది. ఒకేసారి 99 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి విడతలోనే ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేయడం, గత కొన్ని ఎన్నికలను పరిశీలిస్తే ఇదే తొలిసారి. భాజపాతో పొత్తు చర్చలు జరుగుతున్నా, తెదేపా, జనసేన మధ్య సీట్ల పంపకంపై కసరత్తు కొనసాగుతున్నా ఇలా ముందడుగు వేయడాన్ని సాహసోపేత నిర్ణయంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వైకాపా.. పేరుకు ఏడు విడతలుగా 65 మందితో జాబితాలు విడుదల చేసినా అవన్నీ పార్టీ సమన్వయకర్తలుగా చేపట్టిన ఎంపికలే. వీరే అభ్యర్థులు అవుతారా.. అన్నది చివరివరకూ సందేహాస్పదమే. పైగా ఎంపిక చేసినప్పుడే వీరు ఖరారైనట్లు కాదని, మార్పులూచేర్పులూ ఉంటాయని అధిష్ఠానం చెప్పింది. అన్నట్లుగానే, ఇప్పటికే ఐదారుగురిని మార్చింది. విజయావకాశాలపై నమ్మకం లేక కొందరు స్వతహాగా వైదొలిగారు. ఈ పరిణామాల్ని పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది తెదేపా- జనసేన కూటమి మాత్రమే.
గతానికి భిన్నంగా..
సాధారణంగా ఎన్నికల షెడ్యూలు వచ్చేవరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కొలిక్కి తీసుకురారన్నది తెదేపా అధినేత చంద్రబాబుకున్న పేరు. నామినేషన్ల దాఖలు గడువు మరికొద్ది గంటల్లో ముగుస్తుందనగా.. పేర్లు ప్రకటించిన సందర్భాలున్నాయి. అలాంటిది ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించటం విశేషమే. భాజపాతో పొత్తు ప్రతిపాదన రాకముందు.. ఒకేసారి మొత్తం 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని తెదేపా, జనసేన భావించాయి. తర్వాత వ్యూహం మార్చుకున్నాయి. తన రాజకీయ జీవితంలో అభ్యర్థుల ఎంపికకు ఈ స్థాయిలో ఎప్పుడూ కష్టపడలేదని చంద్రబాబే స్వయంగా పేర్కొన్నారు. వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ.. యువతకు, కొత్తవారికి, మహిళలకు, బలహీన వర్గాలకూ ప్రాధాన్యమిస్తూ, పార్టీకి బలమైన, ముఖ్యమైన స్థానాలనూ మిత్రపక్షానికి కేటాయించేందుకూ సమ్మతిస్తూ తెదేపా నాయకత్వం విస్తృత కసరత్తు చేసింది. ఐవీఆర్ఎస్ విధానంలో 1.03 కోట్ల మంది అభిప్రాయాలు సేకరించి, విశ్లేషించి, మూణ్నాలుగు రూపాల్లో సర్వేలు నిర్వహించి అభ్యర్థులను వడపోసింది. దీనికోసం పార్టీ అంతర్గత విభాగం (బ్యాక్ ఆఫీస్) నాలుగైదు దశల్లో కసరత్తు చేసింది. ప్రకటించిన వాటిల్లో ఎక్కువ స్థానాల్లో ఊహించిన అభ్యర్థులే ఉన్నట్లు కనిపిస్తున్నా.. గుర్తించదగిన స్థాయిలో మార్పులూ ఉన్నాయి. పొత్తులో భాగంగా కొన్ని ఇబ్బందికర నిర్ణయాలూ తీసుకున్నారు. తెనాలిలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్తో సహా అనకాపల్లి, నెల్లిమర్ల, రాజానగరంలో తెదేపాకు బలమైన అభ్యర్థులున్నా పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సి వచ్చింది.
ఆ స్థానాలపై లోతుగా కసరత్తు..
పార్టీకున్న సిట్టింగ్ల్లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గంటా శ్రీనివాసరావులకు తప్ప అందరికీ అవకాశమిచ్చారు. గంటాను మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీకి నిలపాలనే ప్రతిపాదన ఇంకా కొలిక్కిరాలేదు. రాజమహేంద్రవరం గ్రామీణ స్థానాన్ని జనసేన కోరుతున్నందున బుచ్చయ్యచౌదరి అభ్యర్థిత్వం పెండింగ్లో పడింది. వైకాపా నుంచి వచ్చిన వారిలో సిట్టింగులైన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఎక్కడి నుంచి బరిలో నిలపాలన్న చర్చ జరుగుతోంది. ఉండవల్లి శ్రీదేవి పేరు బాపట్ల లోక్సభ అభ్యర్థిత్వానికి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కోటంరెడ్డిశ్రీధర్రెడ్డి (నెల్లూరు గ్రామీణం), పార్థసారథి (నూజివీడు)లకు తొలి జాబితాలోనే అవకాశం లభించింది. మేకపాటి చంద్రశేఖరరెడ్డికి మాత్రం చోటు దక్కలేదు. కళా వెంకట్రావు, బుచ్చయ్యచౌదరి, దేవినేని ఉమ, బండారు సత్యనారాయణమూర్తి, యరపతినేని శ్రీనివాసరావు, బీకే పార్థసారథి, మండలి బుద్ధప్రసాద్, చింతమనేని ప్రభాకర్ వంటి సీనియర్ల పేర్లు తొలి జాబితాలో లేవు. రాజమహేంద్రవరం గ్రామీణ, అవనిగడ్డ, పెందుర్తి స్థానాలను జనసేన అడుగుతోంది. కొందరి అభ్యర్థిత్వాలపై సంప్రదింపులు కొలిక్కి రాకపోవటం, ఇంకొందరికి స్థానాలు మార్చడం, వేరే అవకాశాలు కల్పించాలని భావించటం, తొలి జాబితాను 99 సంఖ్యకు పరిమితం చేయాలనుకోవడం తదితర కారణాలతో వీరి పేర్లు లేవని పార్టీ వర్గాల కథనం. చంద్రబాబు, అచ్చెన్నాయుడు మినహా మరే నాయకుడి కుటుంబం నుంచి ఒకరికి మించి టికెట్ ఇవ్వలేదు. ఈ క్రమంలో కోట్ల, భూమా, కేఈ, జేసీ కుటుంబాల నుంచి ఒక్కొక్కరే బరిలో నిలవనున్నారు. సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఈసారి పోటీకి ఆసక్తి చూపటం లేదని సమాచారం. ఆయన కుమార్తె అదితి విజయనగరం నుంచి పోటీ చేస్తున్నారు.
మలి జాబితాకి మరింత సమయం
తెదేపా- జనసేనల రెండో జాబితాకు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. జనసేన కోరుకుంటున్న స్థానాల్లో కొన్నింట్లో తెదేపా తరఫున బలమైన అభ్యర్థులుండటం, మొదటి నుంచి పార్టీకి కంచుకోట వంటి నియోజకవర్గాలు కావడంతో చర్చలు కొలిక్కిరావటం అంత సులువయ్యేలా లేదు. భాజపా నేతలు ఆసక్తి చూపుతున్న స్థానాలను తొలి జాబితా నుంచి మినహాయించారు. ఆ పార్టీ నేతలతో వచ్చే వారం చర్చించే అవకాశముంది. మార్చి మొదటి వారానికల్లా మిగిలిన శాసనసభ, లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కొలిక్కివచ్చే వీలుంది. వాస్తవానికి అభ్యర్థుల ఎంపికలో క్లిష్టమైన, ఉత్కంఠకు తావిచ్చే నియోజకవర్గాలు మలి విడతలో ఎక్కువగా ఉండనున్నాయి. భాజపా లోక్సభ స్థానాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందని సమాచారం.
కొత్త తరానికి అవకాశం
ఈసారి కొత్త తరాన్ని గణనీయంగా తెరపైకి తెచ్చారు. మహాసేన రాజేష్గా గుర్తింపు పొందిన సామాజిక మాధ్యమ కార్యకర్త, దళిత నాయకుడైన రాజేష్కుమార్కు పి.గన్నవరం నుంచి అవకాశమిచ్చారు. రాజధాని అమరావతి ఉద్యమంతోపాటు చంద్రబాబు అరెస్టు సమయంలో యువత, ఐటీ ఉద్యోగులను సమీకరించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొలికపూడి శ్రీనివాసరావును తిరువూరు నుంచి బరిలో నిలిపారు. ఇది సంచలనం, సాహసోపేతమే. ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో మునుపెన్నడూ లేనంత కొత్తతరాన్ని తీసుకొచ్చారు. సీనియర్ నాయకులకు వారసులుగా యువతకు అవకాశమిచ్చారు. అత్యధికులు ఉన్నత విద్యావంతులు. వీరి సగటు వయసు 52. 35 ఏళ్లలోపు వారు ఇద్దరుంటే, 36-45 ఏళ్ల మధ్య వయస్కులు 22 మంది ఉన్నారు. రాజకీయాలకు కొత్తవారు 23 మంది. రాబోయే 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే స్థాయి, ఆసక్తి ఉన్నవారికి ప్రాధాన్యమిచ్చారు. అభ్యర్థులకు క్లీన్ ఇమేజ్ ఉండేలా జాగ్రత్తలూ తీసుకున్నారు. గుడివాడ, ఉదయగిరిల్లో ఎన్ఆర్ఐలకూ అవకాశమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
వికసిత్ భారత్ దిశగా అధ్బుతమైన బడ్జెట్ను మోదీ సర్కారు ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయనతో మీడియాతో మాట్లాడారు. -
బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి అధిక వడ్డీలకు వేల కోట్ల అప్పు తెస్తున్నారు : బండి సంజయ్
మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. -
ఉనికి కోసమే దిల్లీలో జగన్ డ్రామాలు : కేశినేని చిన్ని
రెడ్ బుక్ అంటే చాలు.. వైకాపా నేతలకు భయం పట్టుకుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. -
బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?: సీఎం రేవంత్రెడ్డి
భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు