Janasena: జనసేన ప్రచార రథాలు ప్రారంభం

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం నిర్వహించడానికి ప్రచార రథాలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రారంభించారు.

Updated : 25 Feb 2024 07:57 IST

ఈనాడు, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం నిర్వహించడానికి ప్రచార రథాలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రారంభించారు. ఎన్‌.ఆర్‌.ఐ కొట్టి ఉదయ్‌భాస్కర్‌ ఇలాంటి 25 వాహనాలను సమకూర్చారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం వాటిని నాగబాబు జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ విధానాలను ప్రజలకు చేరువ చేస్తూ వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన విజయానికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉదయ్‌భాస్కర్‌ సోదరుడు కొట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని