సింహపురిలో సీన్ రివర్స్.. ప్రకాశంలో ఎదురుగాలి
వైకాపాకు ఎదురులేని సింహపురి జిల్లా.. కంచుకోట ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితులు ప్రస్తుతం తల్లకిందులయ్యాయి.
వైకాపా కంచుకోటలకు బీటలు
నెల్లూరులో పార్టీకి ఆర్థిక అండదండ ఎంపీ వేమిరెడ్డి అవుట్
ఇప్పటికే ఫ్యాన్కు దూరమైన ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్
తాజాగా జతకూడిన మరో ఎమ్మెల్యే వరప్రసాద్
ఈనాడు, అమరావతి: వైకాపాకు ఎదురులేని సింహపురి జిల్లా.. కంచుకోట ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితులు ప్రస్తుతం తల్లకిందులయ్యాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదింటికి పది క్లీన్స్వీప్ చేసిన వైకాపాకు ప్రస్తుత పరిణామాలు క్షణమోయుగంలా కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో 12లో 8 సీట్లను కైవసం చేసుకున్న పార్టీ మరింత దిగజారింది. నెల్లూరు జిల్లాలో పార్టీని ఇప్పుడు సిట్టింగులు ఒక్కొక్కరూ ఖాళీ చేసేస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తాజాగా పార్టీకి గుడ్బై చెప్పేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పార్టీని వీడారు. ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన అధిష్ఠానం.. అనర్హత వేటు కోసం స్పీకర్కూ ఫిర్యాదు చేసింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఇటీవల జనసేన టచ్లోకి వెళ్లారు. శుక్రవారం ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్ సభకు సిటింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే మహీధర్రెడ్డి, మరో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, పర్చూరు వైకాపా మాజీ ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ దూరంగా ఉన్నారు. రెండు జిల్లాల్లోనూ పార్టీకి అండగా నిలుస్తున్న ప్రధాన సామాజికవర్గంలోనూ చీలికొచ్చింది.
ఆర్థిక దన్ను దూరం
వైకాపాకు ఆర్థికంగా దన్నుగా నిలిచిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఖరారు చేసినప్పటికీ ఆయన పార్టీలో మనలేక వెళ్లిపోయారు. ఆయనపైన, ఆయన భార్యపైన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు వ్యంగ్యంగా విమర్శించినా పార్టీ పెద్దలు నియంత్రించకపోగా.. సదరు ఎమ్మెల్యే అవకాశాలనూ పెంచారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయబోనన్న వేమిరెడ్డి విన్నపాలను కాదని లోక్సభ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. సర్దుకుపోతున్నప్పటికీ కనీసం గుర్తించకుండా అవమానిస్తుండడంతో మనస్తాపంతో పార్టీకి గుడ్బై చెప్పారు.
ఆనంను అవమానకరంగా...
నెల్లూరు నగరం, గ్రామీణం, ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఆనం రాంనారాయణరెడ్డి అనుచరగణం ఉంది. 2019 ఎన్నికల ముందు వైకాపాలో చేరిన ఆనంకు వెంకటగిరి టికెట్నైతే ఇచ్చారు కానీ.. గెలిచాక ఎమ్మెల్యేగా ఆయనకు సముచిత ప్రాధాన్యం లభించలేదు. నియోజకవర్గంలో అభివృద్ధిపై ప్రశ్నించినందుకు వైకాపా అధిష్ఠానం ఆయన్ను పక్కనపెట్టింది. వెంటనే వెంకటగిరి పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిని ముఖ్యమంత్రి నియమించేశారు. చివరకు గత మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ఓటింగ్కు పాల్పడ్డారంటూ సస్పెన్షన్ వేటు వేశారు.
వీరసైనికుడు కోటంరెడ్డి కోట దాటారు..
ఓదార్పుయాత్ర నుంచే జిల్లాలో జగన్కు వీరసైనికుడిగా నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నిలిచారు. 2014, 2019లలో రెండుసార్లూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లోగానీ, 2022లోగానీ ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోలేదు. పైగా నియోజకవర్గ అభివృద్ధి గురించి అధికారిక సమావేశంలో కోటంరెడ్డి ప్రశ్నించడాన్నీ పార్టీ అధిష్ఠానం తప్పుపట్టింది. తన ఫోన్ను ట్యాప్ చేయించడాన్ని ఆయన ప్రశ్నించారు. తర్వాత ఆయన్ను పార్టీ సస్పెండ్ చేసింది.
నగరం ఖాళీ
నెల్లూరు నగరంలోనూ వైకాపా ఖాళీ అయింది. ఇక్కడ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్కుమార్ను పార్టీలోని ప్రధాన సామాజికవర్గం వ్యతిరేకించింది. పరిస్థితి చేయి దాటుతుండడంతో అనిల్ను నరసరావుపేట లోక్సభ స్థానానికి ముఖ్యమంత్రి మార్చేశారు. రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మార్గాన్నే నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, మద్దతినిచ్చే కార్పొరేటర్లూ అనుసరిస్తున్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పార్టీకి అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. అనిల్ను వ్యతిరేకించిన వీరంతా ఇప్పుడు ఆయన అనుచరుడైన ఖలీల్అహ్మద్ను నగర నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా నియమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
జిల్లాలో మరో పెద్ద కుటుంబం నల్లపురెడ్డిది. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డికి పార్టీలో తగిన గుర్తింపు లేదు. 2019 తర్వాత రెండుసార్లు మంత్రివర్గ ఏర్పాటులో అవకాశం దక్కలేదు.
నెల్లూరులో అస్మదీయులు దూరం
మేకపాటి కుటుంబంలో కీలకమైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డికి గత ఎన్నికల్లో ఆయన సిటింగ్ సీటు అయినప్పటికీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి అవకాశమివ్వలేదు. ఆయన కోరుకున్నట్టు తితిదే ఛైర్మన్గా నియమిస్తారన్న ప్రచారమూ సాకారం కాలేదు. ఆయన వారసుడు మేకపాటి గౌతమ్రెడ్డి జగన్కు అండగా ఉండేవారు. గౌతమ్రెడ్డి మరణానంతరం ఆ కుటుంబంనుంచి గతంలో ఉన్నంత మద్దతు వైకాపాకు లభించడం లేదు. ఇంకోవైపు ఆ కుటుంబంలోని మరో ముఖ్యుడు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి వైకాపాను వీడారు. చంద్రశేఖర్రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు రాజగోపాల్రెడ్డిని నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా నియమించారు. ఈ నియామకంతో అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టారా? అన్న చర్చ జిల్లాలో మొదలైంది.
ప్రకాశంలో పోరాటం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఉంది. ఒంగోలులో తన స్థానంలో తాను కొనసాగేందుకూ బాలినేని పోరాడాల్సి వచ్చింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్టీకి దూరం జరిగారు. తమ సిటింగ్ స్థానాల్లో వేరేవారిని పార్టీ సమన్వయకర్తలుగా నియమించడంతో కందుకూరు, దర్శి ఎమ్మెల్యేలు మహీధర్రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీకి గుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. సీటు విషయంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్యాదవ్ డోలాయమానంలోనే ఉన్నారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుటుంబమూ క్రియాశీలంగా వ్యవహరించడం లేదు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్బాబూ జిల్లా వదలక తప్పని పరిస్థితి. మంత్రి సురేష్ను ఆయన సొంత నియోజకవర్గం నుంచి కొండపికి మార్చారు. కొండపిలో ఆయన్ను ఓడించేందుకు అక్కడి పార్టీ మాజీ సమన్వయకర్త మాదాసు వెంకయ్య వర్గంతోపాటు బాలినేని వర్గమూ సిద్ధమవుతోంది. మార్కాపురంలో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు మార్చారు. అక్కడున్న ఎమ్మెల్యే రాంబాబును మార్కాపురానికి మార్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం