జనసేనకు గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 24 శాసనసభ, మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.
24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ
5 స్థానాలే అధికారికంగా ప్రకటన
అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో బరిలోకి
భీమవరం నుంచే పవన్ కల్యాణ్
అనకాపల్లి లోక్సభ స్థానానికి నాగబాబు
దాదాపు ఖరారు.. ప్రకటనే తరువాయి
ఈనాడు, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 24 శాసనసభ, మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఇందులో జనసేన పోటీ చేయబోయే 5 శాసనసభ స్థానాలు, అక్కడి అభ్యర్థులను శనివారం ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే అధిక సీట్లు దక్కనున్నాయి. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయాలని దాదాపు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. తెలుగుదేశతో పొత్తులో భాగంగా మూడు లోక్సభ స్థానాలు ఖరారు కాగా.. అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది. అనకాపల్లి నుంచి కొణిదెల నాగబాబు, మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ దాదాపు ఖాయం. కాకినాడ నుంచి సానా సతీష్తో పాటు మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండి ఆ పార్టీ కాకినాడ ఎంపీ సీటు ఆశిస్తే జనసేనకు దాని బదులు మరొకటి ఖరారవుతుంది.
శాసనసభ నియోజకవర్గాల్లో జనసేన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువ స్థానాలు తీసుకుంటోంది. ఉమ్మడి తూర్పుగోదావరిలో ఇప్పటికే కాకినాడ గ్రామీణ, రాజానగరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రాజోలులో సైతం పోటీ చేస్తారు. వీటికి తోడు రాజమహేంద్రవరం గ్రామీణ, పిఠాపురం స్థానాలనూ ఆ పార్టీ కోరుకుంటోంది. ఇక్కడ తెదేపాకు బలమైన అభ్యర్థులు ఉండటంతో కూలంకషంగా చర్చ జరుగుతోంది. ఒక్క ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనే ఆరు సీట్లు (భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు) జనసేన కోరుతోంది. నాలుగు సీట్ల వరకు జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. నిడదవోలు సీటు దక్కితే ఇతర స్థానాల్లోని బలమైన అభ్యర్థిని ఎవరినైనా అక్కడికి తీసుకొచ్చే ఆలోచనా చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ స్థానం జనసేన కావాలంటోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి, యలమంచిలి, విశాఖ దక్షిణ స్థానాల్లో ఏవైనా రెండు జనసేనకు దక్కే ఆస్కారం ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ స్థానాలతోపాటు ప్రకాశం జిల్లాలో దర్శి కూడా అడుగుతున్నారు. తిరుపతి, చిత్తూరు శాసనసభల్లో ఒకటి, మదనపల్లి స్థానంపైనా ఆ పార్టీ దృష్టి పెట్టింది. గుంటూరు పశ్చిమ, అనంతపురం స్థానాలను జనసేన నేతలు కోరుతున్నారు.
పక్క స్థానాలకు మార్పు
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో జనసేన నుంచి కందుల దుర్గేష్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ తెదేపా సిటింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి కూడా సీటు కావాలంటున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులేనని.. ఇద్దరికీ అవకాశం కల్పిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఇలా రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉన్నచోట ఒకరికి అక్కడ అవకాశమిచ్చి, మరొకరిని సమీపంలోని మరో స్థానానికి పంపాలని యోచిస్తున్నారు. అయితే ఎవరిని ఉంచాలి, ఎవరిని మార్చాలి, ఎవరికి ఎక్కడ విజయావకాశాలు ఎక్కువ ఉంటాయనే కోణంలో పరిశీలిస్తున్నారు.
5 అంకె ఇష్టం కావడం వల్లే..
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు 5 అంకె ఇష్టమని.. అందువల్లే మరికొన్ని స్థానాలు, అభ్యర్థులపై పూర్తి స్పష్టత ఉన్నప్పటికీ తొలి జాబితాలో 5 స్థానాలే ప్రకటించారని తెలిసింది. తెనాలి నుంచి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ, కాకినాడ గ్రామీణం నుంచి పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ పేర్లు ప్రకటించారు. వీరందరి అభ్యర్థిత్వాలు ముందు నుంచీ ఊహిస్తున్నవే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్