గెలుస్తున్నాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం
‘వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తెదేపా- జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు’ అని ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదేపా-జనసేన పొత్తు
ఈ కూటమికి భాజపా ఆశీస్సులున్నాయి
ఐదు కోట్ల మంది ప్రజలకు, అవినీతి పార్టీకి మధ్య ఎన్నికలివి
విలేకరుల సమావేశంలో చంద్రబాబు, పవన్
తెదేపా 94, జనసేన 5 పేర్లతో తొలి జాబితా విడుదల
24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ
ఈనాడు, అమరావతి: ‘వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తెదేపా- జనసేన గెలుపును ఎవరూ ఆపలేరు’ అని ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తంచేశారు. ‘తెదేపా - జనసేన కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమే. ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలని రెండు పార్టీలూ నడుం బిగించాయి. దీన్ని మరింత బలోపేతం చేయడానికి భాజపా ఆశీస్సులూ ఉన్నాయి. మంచి ప్రయత్నానికి ఇది తొలి అడుగు’ అని వివరించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో.. తెదేపా, జనసేన తరఫున శాసనసభకు పోటీ పడే అభ్యర్థుల జాబితాను ఇద్దరు నేతలు ఉమ్మడిగా శనివారం విడుదల చేశారు. నాగపౌర్ణమి శుభ ముహూర్తంలో తొలి జాబితా ప్రకటిస్తున్నట్లు చెప్పారు. జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, భాజపా కలిసొస్తే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ‘ఐదు కోట్ల ప్రజలకు.. అహంభావి, పెత్తందారీ, ధనబలం కలిగిన పార్టీకి మధ్య జరిగే ఎన్నికలివి. ప్రజలంతా ఆలోచించాలి. తెదేపా- జనసేన అభ్యర్థులకు విజయం చేకూర్చాలి. అందరికీ సీట్లు రాకపోవచ్చు. తెదేపా అభ్యర్థులు పోటీచేసే చోట జనసేన, జనసేన అభ్యర్థులు బరిలో ఉన్నచోట తెదేపా కార్యకర్తలు సహకరించాలి. ఇరు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అది ఓటుబ్యాంకుగా మారుతుంది’ అని పేర్కొన్నారు.
ఇప్పటికే డబ్బు చేరవేశారు: చంద్రబాబు
తెదేపా- జనసేన కలిసినప్పుడే ఓటమి భయంతో వైకాపా కాడి కింద పడేసిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘రౌడీయిజం, దొంగ ఓట్లు, బూత్ల ఆక్రమణ, వాలంటీర్ల ద్వారా అధికార దుర్వినియోగానికి ప్రయత్నిస్తోంది. వారి ఆటలు సాగనివ్వం. సమర్థంగా ఎదుర్కొంటాం. ఇప్పటికే బస్తాల కొద్దీ డబ్బును నియోజకవర్గాలకు తరలించారు. ఎర్రచందనం, ఇసుక, మద్యంతో దోచుకున్న అవినీతి సొమ్ముతో గెలవాలని చూస్తున్నారు. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు. ప్రజాబలం ఉంది. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలే ముందుకొచ్చి అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టి గెలిపించుకోవాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘ఇరు పార్టీల అభ్యర్థులంతా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. వైకాపా అభ్యర్థుల్లో రౌడీలు, గూండాలే కాదు, ఎర్రచందనం స్మగ్లర్లూ ఉన్నారు. ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కేసులు వాదించడానికి అడ్వొకేట్లకు రూ.కోట్లలో చెల్లిస్తున్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. భయం కూడా ఉంది. మీడియాపై దాడులు జరుగుతున్నా ప్రతిఘటించలేని పరిస్థితి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వైకాపా విధ్వంసం చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నార’ని వాపోయారు.
‘రాష్ట్రం విడిపోయినప్పటి కంటే.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ఏపీ ఎక్కువగా నష్టపోయింది. ఐదేళ్ల పాలనలో కోలుకోలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను విధ్వంసం చేశారు. ప్రజావేదికను కూలగొట్టిన తర్వాత ఆ శిథిలాలను తొలగించకపోవడమే అహంభావి పాలనకు ఉదాహరణ’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం నుంచి ఇరు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంపై విలేకరులు ప్రశ్నించగా.. ‘సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జనసేన నేత కందుల దుర్గేశ్ ఇద్దరూ సమర్థులైన నాయకులే. వీరికి తప్పకుండా న్యాయంచేస్తాం. ఒకరికి రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి, మరొకరికి ఇంకోచోట అవకాశం కల్పిస్తాం. ఇద్దరితోనూ మాట్లాడుతున్నాం. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో త్వరలోనే స్పష్టత ఇస్తామ’ని వెల్లడించారు.
ఓట్ల బదలాయింపు సాఫీగా జరగాలి: పవన్
‘భాజపాతో పొత్తును దృష్టిలో పెట్టుకొని మా సీట్ల సంఖ్యను కుదించుకున్నాం. పరిమిత స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాం. తొలి దఫాలో ఐదుగురు అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నామ’ని పవన్కల్యాణ్ చెప్పారు. ‘మేం నిర్మాణాత్మకంగా, బాధ్యతగా ఆలోచించాం. ఎక్కువ స్థానాలు తీసుకోవాలని కొందరు చెబుతున్నారు. గత ఎన్నికల్లో పది స్థానాల్లోనైనా గెలిచి ఉంటే ఈసారి ఎక్కువ స్థానాలు తీసుకునే అవకాశం ఉండేది. ఎక్కువ చోట్ల పోటీపడి ప్రయోగం చేయడం కంటే, తక్కువ స్థానాలతో రాష్ట్రానికి ఉపయోగపడాలని నిర్ణయించాం. 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. 3 లోక్సభ స్థానాల పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలనూ పరిగణనలోకి తీసుకుంటే.. 40 చోట్ల పోటీ చేస్తున్నట్లు లెక్క’ అని వివరించారు. ‘వ్యక్తి, పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. పార్టీ కోసం కష్టపడ్డవారు, సమర్థులు, అనుభవజ్ఞులకు ప్రభుత్వం ఏర్పడ్డాక పదవుల్లో ప్రాధాన్యమిస్తాం’ అని పవన్ హామీ ఇచ్చారు. జనసేన ఓటు తెదేపాకు బదిలీ అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, ఇది సాఫీగా జరిగేలా చూడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘సిద్ధం అంటూ జగన్ చావగొడుతున్నారు. మేం కూడా యుద్ధానికి సిద్ధమే. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికే యుద్ధం’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి