అన్నా రాంబాబుపై చర్యలు తీసుకోండి

మార్కాపురం నియోజకవర్గంలో వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి వారికి స్వీటు బాక్సులు, ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున నగదు పంచిన గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ డిమాండుచేశారు.

Published : 28 Feb 2024 04:28 IST

వాలంటీర్లకు డబ్బులిచ్చారు: ఎంఏ షరీఫ్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: మార్కాపురం నియోజకవర్గంలో వాలంటీర్లతో సమావేశం ఏర్పాటు చేసి వారికి స్వీటు బాక్సులు, ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున నగదు పంచిన గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ డిమాండుచేశారు. రాబోయే ఎన్నికల్లో మార్కాపురం నుంచి వైకాపా అభ్యర్థిగా ఆయన పోటీ చేయనుండటంతో ఇలాంటి ప్రలోభాలకు తెరలేపారని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి మంగళవారం లేఖ రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని