ఎత్తర ‘జెండా’... గెలుపు ఎజెండా
తెలుగుదేశం, జనసేన పార్టీలను గుండెల్లో పెట్టుకుని కొలిచే గోదావరి నేలపై బుధవారం ఆ పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి.
ఎన్నికల యుద్ధానికి తెదేపా - జనసేన సిద్ధం
తాడేపల్లిగూడెంలో నేడు ఉమ్మడి బహిరంగ సభ
26 ఎకరాల్లో ఏర్పాట్లు.. లక్షల్లో రానున్న కార్యకర్తలు, అభిమానులు
కలిసి కదనరంగంలోకి దూకేలా ఇరు పార్టీల శ్రేణులకు దిశానిర్దేశం
ఈనాడు, అమరావతి: తెలుగుదేశం, జనసేన పార్టీలను గుండెల్లో పెట్టుకుని కొలిచే గోదావరి నేలపై బుధవారం ఆ పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్కు చాలా ముందుగా ఏకంగా 99 మంది అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి సిద్ధమంటున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ప్రచార బరిలోకి దిగుతున్నారు. రెండు పార్టీల క్యాడర్ను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కలిసి కదనరంగంలోకి దూకేలా సంసిద్ధం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ సభలో ఉమ్మడి ‘జెండా’ ఎత్తబోతున్నారు. అందుకే ఈ సభకు ‘జెండా’ అనే పేరును నిర్ణయించారు. ఉత్తరాంధ్ర వేదికగా తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం ముగింపు సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సైతం పాల్గొన్నారు. అయినా తొలి ఉమ్మడి సభగా తాడేపల్లిగూడెం ‘జెండా’ సభనే పేర్కొంటున్నారు.
పొత్తు అవసరాన్ని వివరించి కార్యోన్ముఖులను చేయడానికే..
తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు, సీట్ల సంఖ్య ఖరారైన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. అందుకే జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత అస్తవ్యస్తంగా తయారైంది, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సరైన మార్గంలోకి తీసుకెళ్లేందుకు రాజకీయ పార్టీలుగా, రాష్ట్ర భవిష్యత్తును కాంక్షించే బాధ్యతాయుత నాయకులుగా పొత్తుతో ఎందుకు ముందుకెళుతున్నామో అటు తెదేపా, ఇటు జనసేన శ్రేణులకు ఈ సభలో స్పష్టంగా వివరించబోతున్నారు. రెండు పార్టీల శ్రేణుల మధ్య పొరపొచ్చాలు సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గళమెత్తబోతున్నారు. కార్యకర్తలు ఎంత బాధ్యతాయుతంగా కలిసి కదనరంగంలోకి దూకాలో దిశానిర్దేశం చేయబోతున్నారు. వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యసాధనలో పొత్తు ఎంత ప్రధానమో పవన్ కల్యాణ్ చెప్పబోతున్నారు. అధినేతల ప్రసంగాల్లో ‘ఓటు బదిలీ’ కీలకాంశం కానుంది. ఈ పొత్తు రాబోయే రోజుల్లోనూ రెండు పార్టీల క్యాడర్కు ప్రయోజనం కలిగిస్తుందని, జనసేన కార్యకర్తలకు అన్నింటిలోనూ అవకాశాలు లభించబోతున్నాయనీ స్పష్టం చేయనున్నారు. తెదేపా, జనసేన ప్రభుత్వంలోనూ సంక్షేమ పథకాలు ఉంటాయని, ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలకు మించిన సంక్షేమం ప్రజలకు అందించడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులనూ పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్లు సంయుక్తంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం మహానాడులో తెదేపా ప్రకటించిన పథకాలతో పాటు జనసేన షణ్ముఖ వ్యూహంలోని సంక్షేమ పథకాలను కలిపి ప్రజలకు వివరించబోతున్నారు. తెదేపా - జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను మరింత స్పష్టంగా తెలియజేయబోతున్నారు.
విస్తృతంగా ఏర్పాట్లు
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు, సమీపంలోని కృష్ణా జిల్లాకు ఎంతో అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఈ భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నారు. తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్డులో తణుకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిని అనుకుని దాదాపు 26 ఎకరాల విశాల మైదానంలో సభకు సర్వం సిద్ధం చేశారు. వేదికపైనే దాదాపు 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. లక్షల మంది హాజరయినా ప్రశాంతంగా సభను తిలకించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ జరుగుతోంది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలిరానున్నారు. వందల మంది పోలీసులు మంగళవారమే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై అక్కడే సమావేశమయ్యారు. సభాప్రాంగణమంతా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, జనసేన నేతలు కొటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి చూసి వెళుతుండటంతో సభావేదిక వద్ద మంగళవారమే పెద్ద ఎత్తున కోలాహలం ఏర్పడింది.
సభకు రావాలంటూ చంద్రబాబు ప్రచారం
‘జెండా’ సభకు హాజరుకావాలంటూ తెదేపా అధినేత చంద్రబాబు ఐవీఆర్ఎస్ విధానంలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఏర్పాట్లు పరిశీలించిన అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల సభలు జరగకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. వైకాపా సభలకు ఎన్ని బస్సులైనా పంపిస్తున్న ఆర్టీసీ.. తెదేపా-జనసేన ఉమ్మడి సభకు మాత్రం ఒక్కటీ కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి