కాళేశ్వరం.. స్వతంత్ర భారతంలో అతిపెద్ద కుంభకోణం
కాళేశ్వరం ప్రాజెక్టు.. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణమని, ఈ ప్రాజెక్టు తెలంగాణకు శాశ్వతంగా గుదిబండగా మారబోతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
భారాస అవినీతి వల్లే ‘మేడిగడ్డ’ కుంగింది
కేసీఆర్ అక్కడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్
ఈనాడు, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు.. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణమని, ఈ ప్రాజెక్టు తెలంగాణకు శాశ్వతంగా గుదిబండగా మారబోతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో గత భారాస ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని, అవినీతి వల్లే మేడిగడ్డ కుంగిందని ఆయన ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్ సర్వనాశనం చేశారని, లాభదాయకం కాని ప్రాజెక్టును కట్టారని అన్నారు. మేడిగడ్డ కుంగుబాటు, పియర్స్ దెబ్బతినడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిన అంశాలను విజిలెన్స్ డీజీ బుధవారం తనను కలిసి వివరించారని తెలిపారు. గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలపై చట్టప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు. మార్చి 1న ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ప్రకటనపై ఉత్తమ్ స్పందించారు. బుధవారం హైదరాబాద్లోని జలసౌధలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మీలాగా (కేటీఆర్ను ఉద్దేశిస్తూ) మేడిగడ్డను మేం నిషేధిత ప్రాంతంగా మార్చలేదు. మీరంతా వెళ్లి ఏం చేస్తారు? కాశేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్ చేశానని చెప్పుకొన్న కేసీఆర్ చూడాలి. కుంగిన మేడిగడ్డ సాక్షిగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ, కాళేశ్వరంలో భాగమైన ఇతర ప్రాజెక్టులను భారాస నేతలకు చూపించేందుకు సహకరించాలని, వారికి అవసరమైన వసతులు కల్పించాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకే భారాస రాజకీయ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.
వేల కోట్లు దోచుకున్నారు
‘కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం తొలుత రూ.38,500 కోట్లే. ముంపు ప్రాంతాలకు రూ.600 కోట్ల పరిహారమిస్తే సరిపోయేది. కమీషన్ల కక్కుర్తితో.. డిజైన్ మార్చి అంచనా వ్యయం పెంచారు. నిపుణుల సిఫార్సుల్ని కాదని అశాస్త్రీయంగా నిర్మించారు. ఇప్పటికే రూ.94 వేల కోట్లు వెచ్చించారు. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు 97 వేల ఎకరాలే. ఐదేళ్లలో ఎత్తిపోసింది 160 టీఎంసీలే. ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ.1.47 లక్షల కోట్లు కావాలి. డీపీఆర్ లేకుండా రూ.25 వేల కోట్ల పనులిచ్చారు. కాళేశ్వరం నిర్మాణంలో రూ.వేల కోట్లు దోచుకున్నారు. భారాస పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై చేసిన ఖర్చు రూ.1.81 లక్షల కోట్లయితే కొత్తగా అందుబాటులో వచ్చిన ఆయకట్టు 15 లక్షల ఎకరాలే. కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు ఒక్కో ఎకరాకు రూ.11.45 లక్షల చొప్పున ఖర్చు చేశారు.
ఎప్పటికీ గుదిబండే..
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహిస్తే ఏడాదికి విద్యుత్తు బిల్లులే రూ.10 వేల కోట్లు కావాలి. ఒకేసారి అన్ని పంపులు నడిపితే రాష్ట్రం మొత్తం వినియోగించే కరెంటు కంటే అధికంగా అవసరం. అప్పులపై వార్షిక వడ్డీ భారం రూ.15 వేల కోట్లు. విద్యుత్తు బిల్లులు, వడ్డీ కలిపి.. ప్రతి సంవత్సరం రాష్ట్రంపై రూ.25 వేల కోట్ల భారం పడుతుంది. ప్రాజెక్టు తెలంగాణకు శాశ్వతంగా గుదిబండ కాబోతోంది. ప్రాజెక్టును నాశనం చేసిన భారాస నేతలు.. కాఫర్ డ్యాం కడితే చాలంటూ ఉచిత సలహాలివ్వడం దారుణం.
నేషనల్ డ్యాం సేఫ్టీ సూచనల ప్రకారం..
మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం డ్యాంలపై విచారణ చేయాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)ని కోరాం. ఎన్డీఎస్ఏ సూచనల ప్రకారం ముందుకెళ్తాం. మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక రాగానే చట్టప్రకారం ముందుకు వెళ్తాం. తప్పుడు నిర్ణయాలపై చర్యలుంటాయి. సిటింగ్ జడ్జితో విచారణపై మరోసారి హైకోర్టు చీఫ్ జస్టిస్ను కోరడమా.. లేదంటే విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపించడమా అనే దానిపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయిస్తాం. మల్లన్నసాగర్ డేంజర్ జోన్లో ఉందని ‘కాగ్’ చెప్పింది. ప్రస్తుతం అందులో పూర్తిస్థాయిలో నీళ్లు లేవు. అయినా ఓసారి పరీక్షించి నిర్ణయం తీసుకుంటాం. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించే ఆలోచనే లేదు’’ అని ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం