వైకాపా అభ్యర్థులు స్మగ్లర్లు, రౌడీలు
‘‘మన ఐక్యతను చెడగొట్టేందుకు, రాష్ట్రం బాగుపడకుండా చూసేందుకు అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో అందరికీ టికెట్లు ఇవ్వలేకపోవచ్చు.
వాళ్లు గెలిస్తే ప్రజలకు రక్షణ ఉంటుందా?
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజం
సైకో జగన్ను సాగనంపాలని ప్రజలకు పిలుపు
రాష్ట్రాన్ని నిలబెట్టే బ్లూప్రింట్ తమ వద్ద ఉందని వెల్లడి
(తాడేపల్లిగూడెం సభాప్రాంగణం నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి)
‘‘మన ఐక్యతను చెడగొట్టేందుకు, రాష్ట్రం బాగుపడకుండా చూసేందుకు అనేక కుట్రలు, కుతంత్రాలు చేస్తారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో అందరికీ టికెట్లు ఇవ్వలేకపోవచ్చు. కానీ కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యతను రెండు పార్టీల నాయకులం తీసుకుంటాం’’
‘‘మనలో ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. ఒక పార్టీ వెనకాల మరో పార్టీ నడవడం లేదు. రెండు పార్టీలూ కలసి అడుగులు వేస్తున్నాయి’’
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
వచ్చే ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించి, జగన్ అనే సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు జగన్ స్కెచ్ వేస్తే.. దెబ్బతిన్న రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు తెదేపా, జనసేన కూటమి దగ్గర పెద్ద బ్లూప్రింట్ ఉందని ఆయన తెలిపారు. ‘ఇప్పటికే ప్రకటించిన తెదేపా, జనసేన అభ్యర్థులు విద్యావంతులు, పేరున్నవాళ్లు. వైకాపా అభ్యర్థులు స్మగ్లర్లు, రౌడీలు. వాళ్లు గెలిస్తే ప్రజలకు రక్షణ ఉంటుందా? రాష్ట్రానికి బూతులు, మాఫియా నేతలు కావాలా? ప్రజలకు సేవ చేసే మంచి వ్యక్తులు కావాలా?’ అని ఆయన ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో బుధవారం జనసేన, తెదేపా సంయుక్తంగా నిర్వహించిన తొలి ఉమ్మడి ఎన్నికల ప్రచారసభలో.. భారీసంఖ్యలో హాజరైన ప్రజల్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. తెదేపా, జనసేన కూటమి తొలి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్ని చూసి జగన్లో వణుకు మొదలైందని, అందుకే వైకాపా అభ్యర్థుల్ని మళ్లీ మారుస్తానంటున్నారని పేర్కొన్నారు. ‘అన్ని వర్గాలకూ న్యాయం చేసేలా త్వరలో బీసీ, ఎస్సీ డిక్లరేషన్లు ఇస్తాం. ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు, రైతులు, ఉద్యోగులకు మేలు చేసే అంశాలతో మ్యానిఫెస్టో విడుదల చేస్తాం. కానీ జగన్ అనే ఈ మాఫియా పాలకుడు, దోచుకున్న డబ్బుతో మళ్లీ ప్రజల వద్దకు ఓట్లడగడానికి వస్తున్నారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సైకోకు తల్లీ, చెల్లీ విచక్షణ లేదు
‘జగన్కు తల్లి, చెల్లి అనే విచక్షణ కూడా లేదు. ఆస్తి తగాదాల వల్లో, ప్యాలెస్ గొడవల వల్లో సొంత చెల్లెలు జగన్తో విభేదించి వేరే పార్టీలో చేరితే... ఆమెపైనా, తల్లిపైనా కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టించారంటే ఆయన ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవాలి’ అని అన్నారు. ‘నిలువెత్తు అహంకారానికి నిదర్శనం జగన్. ఇప్పటం గ్రామ ప్రజలు పవన్ కల్యాణ్ సభకు స్థలం ఇచ్చారని ఇళ్లు కూలగొట్టించారు. అదీ ఈ సీఎం విధానం’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
అది ముమ్మాటికీ సైకో లక్షణమే
‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో ఒక సైకో.. ఒంటరి మహిళల్ని వరుసగా హత్యలు చేసేవాడు. రాళ్లతో తలపై కొట్టి క్రూరంగా చంపేసేవాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతను గతంలో జైలుకి వెళ్లి వచ్చాడని, ఏ కారణం చేతనో మహిళలంటే విపరీతమైన ద్వేషం పెంచుకున్న ఆ సైకో 40 మందిని చంపేశాడని తేలింది. ఆ తర్వాత అతను ఎన్కౌంటర్లో చనిపోయాడు. జగన్ను చూస్తే ఆ ఘటనే గుర్తుకు వస్తుంది. ఆయనకు డబ్బులు కావాలి. అందుకోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాజకీయానికి, వ్యాపారానికి అడ్డు వస్తే చంద్రబాబు అయినా, పవన్ అయినా, ప్రజలైనా లెక్కలేదు. అందర్నీ అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘నేను, నా మిత్రుడు పవన్ కల్యాణ్ ఆలోచించేది.. తెలుగుజాతిని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టాలనే. అందుకే చేతులు కలిపాం రాష్ట్రాన్ని కాపాడేందుకు అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నారు. విమానాశ్రయం ఏదో వాళ్లబ్బ సొత్తన్నట్టు పవన్ కల్యాణ్ను రాకూడదని ఆంక్షలు పెట్టారని, విశాఖ వీధుల్లో తిరగకూడదంటూ హోటల్లోనే కట్టడి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ‘వాళ్ల అహంభావం ఎలా ఉందంటే.. సినిమా టికెట్ల ధరల్ని నియంత్రించి సినీ ప్రముఖుల్ని శాసించే స్థితికి వెళ్లారు. ప్రముఖ నటుడు చిరంజీవిని, ప్రముఖ దర్శకుడు రాజమౌళిని అవమానించిన తీరు చూసి చాలా నొచ్చుకున్నాను’ అని తెలిపారు.
వైనాట్ పులివెందుల అంటున్నారు
‘జగన్ వైనాట్ 175 అంటున్నారు. ఏం పొడిచారని మీకు ఓటెయ్యాలి?’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘వైనాట్ జాబ్ క్యాలెండర్. వైనాట్ డీఎస్సీ? వైనాట్ ఉచిత ఇసుక? ముందు వీటికి జగన్ సమాధానం చెప్పాలి. పోనీ అవన్నీ వదిలి పెట్టండి. హూ కిల్డ్ బాబాయ్? దీనికి సమాధానం చెప్పమని జగన్కు సవాల్ విసురుతున్నాను’ అని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలంతా వైనాట్ పులివెందుల అంటున్నారని, అక్కడ కూడా జగన్ను ఓడించాలని ఆయన పేర్కొన్నారు. ‘జగన్ పచ్చి అబద్ధాల కోరు. ఊళ్లల్లో కనికట్టు చేసేవాళ్లకీ ఆయనకూ తేడా లేదు. 25 మంది ఎంపీల్ని ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. మద్యం నిషేధిస్తామని, సీపీఎస్ రద్దు చేస్తామని గొప్పలు చెప్పారు. ఎందుకు చేయలేదు?’ అని మండిపడ్డారు.
అగ్నికి వాయువు తోడైంది.. ఇక వైకాపా బుగ్గే
‘కుప్పానికి నీళ్లిస్తున్నామంటూ జగన్ నాటకమాటారు. ట్యాంకర్లతో నీళ్లు తీసుకెళ్లి కాలువల్లో పోశారు. సినిమా సెట్టింగ్ల్లా గేట్లు తెచ్చిపెట్టి... నీళ్లు వదిలి వెళ్లారు. మర్నాటికి అక్కడ నీళ్లూ లేవు. గేట్లూ లేవు. అదీ ఈ సీఎం విశ్వసనీయత’ అని మండిపడ్డారు. జగన్ నాటకాల్ని కుప్పం ప్రజలు పట్టించుకోరని, వచ్చే ఎన్నికల్లో అక్కడ తాను లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ప్రశాంతమైన రాష్ట్రంలో హింస, దాడులు, కేసులతో జగన్ అగ్గి రాజేశారు. ఇప్పుడు అదే అగ్గితో తెదేపా, జనసేన తమ్ముళ్లు వైకాపాను తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అగ్గికి పవన్ రూపంలో వాయువు కూడా తోడైంది. ఇక వైకాపా బుగ్గవడమే మిగిలింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రానికి మేలు చేసేందుకే మహోద్యమానికి శ్రీకారం చుట్టాం. వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన కొట్టే దెబ్బకు ఫ్యాన్ ముక్కలు ముక్కలవ్వాలి. పొత్తు గెలవాలి. రాష్ట్రం నిలవాలి. ప్రజల బతుకులు వెలగాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు