జగన్ అవినీతిపై కేంద్రం మౌనం ఎందుకు?
సీఎం జగన్ అవినీతికి పాల్పడుతున్నారని తెలిసీ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.
భాజపాకు జగన్ బీ టీం కాదు.. జగన్ ఉన్నది భాజపాలోనే
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల
ఈనాడు, అమరావతి: సీఎం జగన్ అవినీతికి పాల్పడుతున్నారని తెలిసీ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. జగన్ ఇక్కడ మైనింగ్, లిక్కర్, ఇసుక మాఫియా చేస్తున్నారని రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ఆరోపించారని ఆమె అన్నారు. రాష్ట్రాల పట్ల వాచ్డాగ్గా ఉన్న కేంద్రం.. జగన్ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదని షర్మిల నిలదీశారు. విజయవాడ ఆంధ్రరత్నభవన్లో బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ‘ఏపీలో అన్యాయం జరుగుతుందని తెలుసు. కేంద్రంలో మీరు (భాజపా) అధికారంలో ఉన్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతిపై మీకు సమాచారం తెలిసీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? జగన్ భాజపాలోనే ఉన్నారనడానికి వేరే సాక్ష్యాలు అక్కర్లేదు. జగన్పై కేంద్రం చర్యలు లేవంటే ఆయన భాజపాలోనే ఉన్నారని అర్థం. భాజపాకు జగన్ బీ టీం కాదు... జగన్ ఉన్నది భాజపాలోనే’ అని షర్మిల విమర్శించారు.
ప్రత్యేకహోదాపై తిరుపతి వేదికగా డిక్లరేషన్
‘కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరుపతిలో శుక్రవారం నిర్వహించే బహిరంగసభలో రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై డిక్లరేషన్ ఇస్తున్నాం. హోదాపై ఎవరికీ చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి వచ్చాక హోదా ఊసే ఎత్తలేదు. పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని తిరుపతి వేదికగా భాజపా ప్రకటించి మాట తప్పింది’ అని షర్మిల ధ్వజమెత్తారు.
రాష్ట్ర హక్కులు మోదీ కాళ్ల దగ్గర తాకట్టు
‘జగనన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో పెద్ద మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక రాష్ట్ర హక్కులను ప్రధాని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు. 25 మంది ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని అన్లేదా? హోదా కోసం నిరాహారదీక్షలు చేయలేదా? జగనన్న అధికారంలోకి వచ్చాక మాట మార్చారు’ అని షర్మిల మండిపడ్డారు. ‘2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 1.18% ఓట్లే వచ్చాయి. అయినా వైఎస్ఆర్ బిడ్డ కాంగ్రెస్లో చేరిందంటే... విభజన హామీల సాధన కోసమే. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏపీకి ప్రత్యేకహోదాపై మొదటి సంతకం చేస్తామని రాహుల్గాంధీ ఇప్పటికే హామీ ఇచ్చారు’ అని షర్మిల వివరించారు.
కాంగ్రెస్ టికెట్ ఆశావహులతో షర్మిల ముఖాముఖి
ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసిన ఆశావహులతో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల బుధవారం ముఖాముఖి నిర్వహించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్న 280 మందితో చర్చించారు. పలువురితో ఆమె విడివిడిగా మాట్లాడారు. రాజకీయ, కుటుంబ నేపథ్యం, కాంగ్రెస్లో ఎప్పటినుంచి పని చేస్తున్నారు? ఏయే హోదాల్లో పార్టీకి సేవలందించారు? టికెట్ ఇస్తే ఎన్నికల్లో గెలుపొందేందుకున్న అవకాశాలు తదితర విషయాలపై ఆమె సమగ్రంగా చర్చించారు. జిల్లాల్లో రాజకీయ పరిణామాలు, పరిస్థితులపైనా ఆరా తీశారు. మరో 63 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసిన వారితో గురువారం ఆమె సమావేశమవనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.