హిమాచల్లో ఊపిరి పీల్చుకొన్న కాంగ్రెస్
హిమాచల్ప్రదేశ్ రాజకీయ క్రీడలో కాంగ్రెస్ సర్కారు కూలిపోయే దశకు వెళ్లి.. జాగరూకతతో ప్రస్తుతానికి క్షేమంగా బయపడింది.
కలకలం రేపిన రాజ్యసభ ఎన్నికల క్రాస్ ఓటింగ్
ఆ ఆరుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు
భాజపా ‘అవిశ్వాస’ ప్రయత్నాలకు ప్రభుత్వం చెక్
శిమ్లా, దిల్లీ: హిమాచల్ప్రదేశ్ రాజకీయ క్రీడలో కాంగ్రెస్ సర్కారు కూలిపోయే దశకు వెళ్లి.. జాగరూకతతో ప్రస్తుతానికి క్షేమంగా బయపడింది. రాష్ట్రంలోని ఒక స్థానానికి మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా క్రాస్ ఓటింగుకు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్సింగ్ అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ గుర్తుపై గెలుపొందిన వీరు సభకు హాజరై ఆర్థికబిల్లుపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ జారీ చేసిన విప్ను ధిక్కరించి ఓటింగుకు దూరంగా ఉండిపోయారు. దీంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లఘించినందుకు ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం తన తీర్పును రిజర్వు చేసిన స్పీకర్.. గురువారం శిమ్లాలో వేటు విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు 14వ హిమాచల్ విధానసభలో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషను జారీ చేశారు. స్పీకర్ నిర్ణయంపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరైన రాజిందర్ రాణా తెలిపారు. మరోవైపు.. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగు నేపథ్యంలో కాంగ్రెస్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసిన భాజపా నేతలు అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందకుండా చూసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సభలో నినాదాలు చేశారన్న కారణంగా 15 మంది భాజపా ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండు చేశారు. అనంతరం వాయిస్ ఓటింగు ద్వారా ఆర్థిక బిల్లును ఆమోదించడంతో సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తర్వాత హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. దీంతో ప్రభుత్వ మనుగడకు కావాల్సిన మెజారిటీ సంఖ్య కూడా 35 నుంచి 32కు మారింది. తాజా పరిణామాల అనంతరం 34 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో ఉన్నంద]ున ప్రస్తుతానికి సర్కారుకు ఢోకా లేదు. మొత్తం 68 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ 40, భాజపా 25 సీట్లను గెలుచుకోగా.. ముగ్గురు స్వతంత్రులు ఎన్నికయ్యారు.
అభిషేక్ సింఘ్వి ఓటమి బాధ్యతను స్వీకరించిన సీఎం
హిమాచల్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి ఓటమి బాధ్యతను ముఖ్యమంత్రి సుఖ్విందర్సింగ్ సుఖు స్వీకరించినట్లు పార్టీ కేంద్ర పరిశీలకుడిగా వచ్చిన డీకే శివకుమార్ తెలిపారు. ఇతర పరిశీలకులు భూపిందర్ సింగ్ హుడా, భూపేశ్ బఘేల్లతో కలిసి గురువారం శిమ్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అందరితో ఏకాంత చర్చలు జరిపామని, విభేదాలు సమసిపోయినట్లు వెల్లడించారు. పార్టీ అంతర్గత విషయాల పరిష్కారానికి ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, ముఖ్యమంత్రిని మార్చాలని రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గతంగా ఓ వర్గం గళమెత్తుతున్న నేపథ్యంలో సీఎం సుఖ్విందర్సింగ్ సుఖు నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు.
‘ఆపరేషన్ కమలం’ విఫలమయ్యేలా చక్రం తిప్పిన ప్రియాంక
హిమాచల్లో ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూసిన భాజపా తన ప్రయత్నంలో విఫలమైందని, రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించింది. రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ విఫలమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రక్రియలో ఏఐసీసీ నాయకురాలు ప్రియాంకాగాంధీ కీలకపాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సుఖ్విందర్సింగ్ సుఖులతోపాటు పార్టీ సీనియర్ నేతలు, పరిశీలకులతో ఆమె ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ మరో రాష్ట్రం తమ నుంచి చేజారకుండా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. హిమాచల్లో భాజపా ‘చాణక్యుడి’ ధన, అధికార బలాన్ని కాంగ్రెస్ నాయకత్వం అడ్డుకొందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’ ద్వారా పోస్ట్ చేశారు.
సంక్షోభానికి కాంగ్రెసే కారణం : భాజపా
రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రతిపక్ష భాజపా నేత జైరాం ఠాకుర్ విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ బిల్లు ఆమోదం కోసమే 15 మంది భాజపా ఎమ్మెల్యేలను సస్పెండు చేసిందన్నారు. రాజ్యసభ ఎన్నికలో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని హిమాచల్ భాజపా చీఫ్ రాజీవ్ బిందల్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. -
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
జగన్.. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. -
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం