కక్షతోనే అక్రమ కేసులు
ఓటమి భయం నిలువెల్లా కమ్మేసిన సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు.
ఏ కంపెనీలోనూ లేకపోయినా జీఎస్టీ కేసేంటి?
నా కుమారుడికి ఏం జరిగినా జగన్దే బాధ్యత
మాజీమంత్రి, తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు
ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్, న్యూస్టుడే, చిలకలూరిపేట గ్రామీణ: ఓటమి భయం నిలువెల్లా కమ్మేసిన సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీమంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. జీఎస్టీ ఎగవేత అభియోగంపై పోలీసులు తన కుమారుడు శరత్బాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక జగన్ తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. ఏ కంపెనీలోనూ డైరెక్టర్గా కానీ కనీసం షేర్హోల్డర్గా కానీ లేని తన కుమారుడిపై కక్షతో జీస్టీటీ ఎగవేత కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, చట్టపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో తనకు పోటీగా నిలవడానికి అభ్యర్థులు దొరక్క వెతుక్కుంటున్న వైకాపా ఇంతకంటే ఏమీ చేయలేదని చురకలు వేశారు. తన కుమారుడికి కనీసం నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు. తెదేపా తరఫున తనకు చిలకలూరిపేట నుంచి సీటు ఖరారు చేసిన రోజే ఏపీఎస్డీఆర్ఐ కేసు నమోదు చేసిందని తెలిపారు.
ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగానే రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికి ఇది సీఎం జగన్ పన్నిన పన్నాగమని ధ్వజమెత్తారు. నా కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారో.. లేక పోలీసుల పేరుతో వైకాపా రౌడీలు కిడ్నాప్ చేశారో తెలీడంలేదు. అసలు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పడంలేదు. పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు’ అని పుల్లారావు ఆరోపించారు. ‘నా కుమారుడికి ఏం జరిగినా సీఎం జగన్దే బాధ్యత’ అని అన్నారు. తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ‘పుల్లారావును రాజకీయంగా ఎదుర్కోలేక.. ఆయన కుమారుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ను ఏర్పాటు చేసి కేవలం ప్రతిపక్ష నేతలను వేధించేందుకే ఉపయోగిస్తున్నారు. అలెక్సా కార్పొరేషన్ కంపెనీతో శరత్కు సంబంధం లేదు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆయనను ఎందుకు అరెస్టు చేశారు? ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంది’ అని పట్టాభి ఆరోపించారు.
శరత్ అరెస్టు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద చర్య
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘తెదేపా నేతలను లక్ష్యంగా చేసుకొని.. అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద చర్య. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కక్ష సాధింపులు తీవ్రమయ్యాయి. వైకాపా ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యుల్లా పనిచేసే అధికారులు తగిన మూల్యం చెల్లించక తప్పదు. తక్షణం శరత్ను విడుదల చేయాలి’.
చంద్రబాబునాయుడు, తెదేపా అధినేత
రాజకీయంగా ఎదుర్కోలేకే అరెస్టు
రాజకీయంగా ప్రత్తిపాటి పుల్లారావును ఎదుర్కొనే ధైర్యంలేకే ఆయన కుమారుడు శరత్ను అరెస్టు చేశారు. శరత్ ఆచూకీ కూడా చెప్పకుండా వేధించడం సైకో చర్యలకు నిదర్శనం.
అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
కుతంత్రాల్ని తిప్పికొడతాం
శరత్ను తీసుకెళ్లింది పోలీసులా.. జగన్ సైకో ముఠానా..? ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు? ఆయనకు ఏమైనా హాని తలపెట్టారేమోనని అనుమానం కలుగుతోంది. సైకో జగన్ కుతంత్రాల్ని తిప్పికొడతాం.
నారా లోకేశ్, తెదేపా ప్రధాన కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.