మంగళగిరిలో మళ్లీ మార్చారు
వైసీపీ అభ్యర్థుల మార్పులు అయిపోయాయని గత నెల 27న ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్.. ఆ మర్నాడు 8వ జాబితాలో, తాజాగా శుక్రవారం విడుదల చేసిన 9వ జాబితాలోనూ మార్పులు చేస్తూనే ఉన్నారు.
సమన్వయకర్తగా మురుగుడు లావణ్య
నెల్లూరు లోక్సభకు విజయసాయిరెడ్డి
కర్నూలు అసెంబ్లీకి ఇంతియాజ్
9వ జాబితా విడుదల చేసిన వైకాపా
ఈనాడు, అమరావతి: వైసీపీ అభ్యర్థుల మార్పులు అయిపోయాయని గత నెల 27న ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్.. ఆ మర్నాడు 8వ జాబితాలో, తాజాగా శుక్రవారం విడుదల చేసిన 9వ జాబితాలోనూ మార్పులు చేస్తూనే ఉన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించిన నియోజకవర్గ సమన్వయకర్తల 9వ జాబితాలో నెల్లూరు లోక్సభకు వేణుంబాక విజయసాయిరెడ్డిని, కర్నూలు అసెంబ్లీ స్థానానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్ను, మంగళగిరికి మురుగుడు లావణ్యను నియమించినట్లు వెల్లడించింది.
పాపం సాయిరెడ్డి!
వైకాపా తరఫున రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని ఇప్పుడు నెల్లూరు లోక్సభ సమన్వయకర్తగా నియమించారు. అక్కడ అభ్యర్థిగా ప్రకటించిన మరో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి వైకాపాకు గుడ్బై చెప్పారు. శనివారం ఆయన తెదేపాలో చేరబోతున్నారు. దీంతో నెల్లూరుకు అభ్యర్థి కోసం పలువురి పేర్లను పరిశీలించి, చివరికి సాయిరెడ్డిని ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి 2022 జూన్లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనకు 2028 జూన్ వరకు అంటే మరో నాలుగేళ్లు పదవీకాలం ఉంది. ఇంతలోనే నెల్లూరు లోక్సభ బరిలో దింపుతున్నారు. ‘నెల్లూరు లోక్సభ సమన్వయకర్తగా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ కొత్త బాధ్యతను చిత్తశుద్ధితో స్వీకరిస్తా’ అని సాయిరెడ్డి శుక్రవారం రాత్రి ఎక్స్ వేదికగా స్పందించారు.
నెల్లూరులో ఎదురీతే!
నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన వేమిరెడ్డి పార్టీ వదిలి వెళ్లిపోయారు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పార్టీనీ వీడి తెదేపాలోకి వెళ్లారు. వారిపై అనర్హత వేటూ పడింది. నెల్లూరు లోక్సభ పరిధిలోకొచ్చే కందుకూరులో ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డిని తప్పించి కొత్త అభ్యర్థిని తీసుకువచ్చారు. ఇక మహీధర్రెడ్డి పార్టీలో ఉంటారా లేదా అనేది అనుమానమే. 2019లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్వీప్ చేసిన వైకాపాకు ఇప్పుడు జిల్లాలో సీనియర్లు లేక, ఉన్నవారు సరిపోతారో లేదో అర్థం కాక ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో లోక్సభ అభ్యర్థిగా సాయిరెడ్డి తనను, జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులను ఎలా గెలిపించుకోగలుతారనేది ప్రశ్నార్థకమే.
మంగళగిరిలో ఆర్కే దెబ్బ!
మంగళగిరిలో మురుగుడు లావణ్యను కొత్త సమన్వయకర్తగా ప్రకటించారు. అక్కడ శుక్రవారం సాయంత్రం వరకూ గంజి చిరంజీవి సమన్వయకర్తగా కొనసాగారు. డిసెంబరు 11న సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించారు. ఆ రోజునే ఆర్కే పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారు. ఓవైపు ఆర్కే వర్గం, మరోవైపు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వర్గాలతో చిరంజీవి పోరాడాల్సి వచ్చింది. 2014లో చిరంజీవి తెదేపా అభ్యర్థిగా ఆర్కేపై పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైకాపా అధికారంలోకొచ్చాక ఆయన ఆ పార్టీలో చేరారు. తన ప్రత్యర్థిని తీసుకువచ్చి, తనను పక్కన పెట్టారని కినుక వహించిన ఆర్కే డిసెంబరులో రాజీనామా చేశారు. తర్వాత వైకాపా పెద్దలు ఆయనతో సంప్రదింపులు జరిపి, మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చారు. అయితే చిరంజీవి కాకుండా మరో బీసీ అభ్యర్థిని మంగళగిరిలో నిలబెడితేనే తాను మద్దతిస్తానని పార్టీలోకి తిరిగి వచ్చేటప్పుడు ఆర్కే షరతు పెట్టినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు లావణ్యను నియమించారంటున్నారు. హనుమంతరావు కుటుంబసభ్యులు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల తదితరులందరినీ వెంటబెట్టుకుని ఆర్కే శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ను కలిశారు. ఆ తర్వాతే లావణ్య పేరును ప్రకటించారు.
ఇంతియాజ్ అలా..అలా..
ఐఏఎస్ అధికారిగా ఉన్న ఏఎండీ ఇంతియాజ్ ఫిబ్రవరి 28న ఉదయం తన పదవికి స్వచ్ఛంద విరమణ చేస్తూ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సాయంత్రానికి ప్రభుత్వం నుంచి అనుమతిస్తూ జీఓ వచ్చేసింది. గురువారం ఆయన వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైకాపాలో చేరిపోయారు. శుక్రవారం ఆయన పేరును కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్