రాజధాని లేకుండా చేశారు జగనన్న
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోసం ఆరాటపడే కాంగ్రెస్కు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ఇతర పార్టీలకు మధ్య పోరాటం నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
హోదా కోసం కాంగ్రెస్ అలుపెరగని పోరాటం
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
ఈనాడు, తిరుపతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోసం ఆరాటపడే కాంగ్రెస్కు, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ఇతర పార్టీలకు మధ్య పోరాటం నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే సత్తా, చిత్తశుద్ధి కాంగ్రెస్కే ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం ప్రత్యేకహోదా పైనే చేస్తామని రాహుల్గాంధీ హామీ ఇచ్చారని వెల్లడించారు. శుక్రవారం తిరుపతిలో ప్రత్యేకహోదా కోసం న్యాయసాధన సభలో ఆమె ప్రసంగించారు. ఇదే మైదానం సాక్షిగా రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా కల్పిస్తామని నరేంద్రమోదీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇంకా చాలా అంశాలు నెరవేర్చాల్సి ఉన్నా కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలో చంద్రబాబు, జగనన్న ఏ ఒక్కటీ తీసుకురాలేదని, వాటి కోసం నిలబడ్డారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ మోదీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాయన్నారు. రాముడి భక్తుడిగా చెప్పుకొనే మోదీ మాట తప్పి ప్రజలను మోసం చేశారని, ఇదేనా భక్తి అని ప్రశ్నించారు.
పులి పిల్లి అయ్యింది..
‘ప్రత్యేకహోదా కోసం ప్రతిపక్ష నేతగా జగనన్న నిరాహారదీక్ష చేశారు. మూకుమ్మడి రాజీనామా చేస్తే ఎందుకు రాదన్నారు. ఐదేళ్లలో ఎంతమందితో రాజీనామా చేయించారు? ఎంపీలను ఇస్తే పంజా విసురుతామన్నారు. పులి, సింహం అంటూ మాట్లాడారు. ఇప్పుడు పులి కాస్తా పిల్లి అయ్యింది. మీ పంజాను భాజపా కొట్టేసిందా? చంద్రబాబు 15 ఏళ్లు ప్రత్యేకహోదా కావాలని నాడు మాట్లాడారు. హోదా కోసమే భాజపాతో పొత్తు అన్నారు. సీఎం అయ్యాక దానిగురించి మాట్లాడలేదు. చంద్రబాబు, జగన్లకు భాజపాతో కనిపించని పొత్తు ఉంది. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు జగన్ అండగా నిలిచారు. వంగి వంగి దండాలు పెట్టారు. వీటిపై ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని షర్మిల అన్నారు.
ఒక్క రాజధాని అయినా కట్టారా..
‘రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. చంద్రబాబు సింగపూర్ పేరుతో 3డీ సినిమా చూపించారు. జగనన్న మూడు రాజధానులు నిర్మిస్తామన్నారు. ఒక్కటయినా అయిందా? దక్షిణ భారతదేశంలో మెట్రోలేని ఏకైక రాష్ట్రం ఏపీ’ అని షర్మిల పేర్కొన్నారు.
వీళ్లా వైఎస్ఆర్ వారసులు..
‘ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారు. 23వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ విడుదల చేస్తామన్నారు. ఇప్పుడు ఆరు వేలే ఇచ్చారు. రైతులకు మద్దతు ధర లేదు. వైఎస్ ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఒక్కటీ పూర్తి చేయలేదు. మాట తప్పం.. మడమ తిప్పం అన్న వీళ్లు ఇప్పుడు మాట తప్పారు. వీళ్లా వైఎస్ వారసులు’ అంటూ దుయ్యబట్టారు.
ప్రత్యేకహోదా ప్రజల హక్కు: సచిన్ పైలట్
‘ప్రత్యేకహోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. పదేళ్లుగా భాజపా దీన్ని ప్రజలకు దూరం చేసింది. నాడు ప్రణాళికాసంఘం దీన్ని అమలు చేయాలని చెప్పినా పక్కనబెట్టారు. ఆంధ్రప్రదేశ్లో భాజపా ఉనికి, ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే ఇవ్వడం లేదు. ఉన్నతవర్గాలకే భాజపా కొమ్ముకాస్తోంది. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేకహోదా ఇస్తాం. కేంద్రం సమాఖ్య స్ఫూర్తి గురించి మాట్లాడుతోంది. అయితే రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు దీనిపై దిల్లీలో పోరాడారు. ఏపీ నుంచి ఎవరూ అడగలేదు. పదేళ్ల క్రితం రాజస్థాన్లో కాంగ్రెస్కు 20 సీట్లే వచ్చాయి. నేను పీసీసీ అధ్యక్షుడిని అయ్యాక పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాను. ఏపీలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అని రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్పైలట్ పేర్కొన్నారు. సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కాంగ్రెస్ సీనియర్ నేతలు కనుమూరి బాపిరాజు, రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, తులసిరెడ్డి, జేడీ శీలం, కొప్పుల రాజు, చింతా మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?