అంతా తికమక.. గజిబిజి.. గందరగోళం..
అంతా గజిబిజి.. గందరగోళంలా ఉంది వైకాపా అభ్యర్థుల ఎంపిక తీరు! నియోజకవర్గాల సమన్వయకర్తల పేరుతో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను మారుస్తున్న ముఖ్యమంత్రి జగన్.. ఈ మార్పులు చేర్పుల్లో చేస్తున్న గారడీ.. గందరగోళానికి ఆ పార్టీ నేతలూ అయోమయానికి గురవుతున్నారు.
మిగిలేది ఎవరో.. నిలిచేది ఎవరో.. బరిలోకి దిగేది ఎవరో..?
సమన్వయకర్తల పేర్లలో మళ్లీ మార్పులు
ఈ వికృత బంతాటలో అత్యధికంగా బలవుతోంది బడుగులే
ఇదీ వైకాపా నియోజకవర్గాల సమన్వయకర్తల నియామక తీరు
ఈనాడు, అమరావతి: అంతా గజిబిజి.. గందరగోళంలా ఉంది వైకాపా అభ్యర్థుల ఎంపిక తీరు! నియోజకవర్గాల సమన్వయకర్తల పేరుతో రానున్న ఎన్నికలకు అభ్యర్థులను మారుస్తున్న ముఖ్యమంత్రి జగన్.. ఈ మార్పులు చేర్పుల్లో చేస్తున్న గారడీ.. గందరగోళానికి ఆ పార్టీ నేతలూ అయోమయానికి గురవుతున్నారు. వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కించినట్లుగా నియోజకవర్గ సమన్వయకర్తగా పదవి ఇస్తారు.. ఆ వెంటనే పాము మింగేసినట్లుగా ఆ పదవి వేరేవారికంటూ తప్పించేస్తారు. ఇక్కడి వారిని అక్కడికి.. అక్కడి వారిని ఇక్కడికి.. తరవాత వీరిలో కొందరిని మరోచోటకు.. ఈ మధ్యలో కొందరి టికెట్లు ఎగిరిపోతున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ రోజు ఎవరు పార్టీ సమన్వయకర్తగా ఉన్నారనేదీ ఎప్పటికప్పుడు జాబితాను చెక్ చేసుకోవలసిన పరిస్థితి నెలకొంది. మార్పులు చేర్పులు చేస్తూ ఇప్పటి వరకూ వెలువడిన జాబితాల సంఖ్య 9కి చేరింది. మార్చిన జాబితాలనే మళ్లీ మళ్లీ మారుస్తుండడం ఆ పార్టీలో నెలకొన్న అస్థిరతను చాటుతోంది. అభ్యర్థుల సీట్లతో వైకాపా పెద్దలు ఆడుతున్న ఈ వికృత క్రీడలో అత్యధికంగా బలి అవుతోంది దళితులు, బడుగులే. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీలో నిలుస్తారన్నది చెప్పడం కష్టమనే మాట వినిపిస్తోంది
పైకే బీరాలు..
175కు 175 సీట్లు.. వైనాట్ కుప్పం.. అంటూ ముఖ్యమంత్రి జగన్ పదేపదే బీరాలు పోతున్నారు. కానీ, అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఆ ఆత్మవిశ్వాసం ప్రదర్శించలేకపోతున్నారు. ఎవరిని ఎందుకు ఎంపిక చేస్తున్నారు.. మళ్లీ ఎందుకు మార్చేస్తున్నారనే విషయం అర్థం కాక ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. సామాజిక సమీకరణాలంటూ అధిష్ఠానం నెలల తరబడి చేస్తున్న కసరత్తు ఓ ప్రహసనంగా మారిందని ఆ నేతలే వాపోతున్నారు.
అటూ.. ఇటూ.. తర్వాత ఎటూ కాకుండా!
ఆర్టీసీ బస్సు బోర్డుపై విజయవాడ-గుంటూరు అని రాసి మధ్య అటూ ఇటూ రెండు బాణం గుర్తులుంటాయి. అంటే విజయవాడ నుంచి గుంటూరు, తర్వాత గుంటూరు నుంచి విజయవాడకు ఆ బస్సు తిరుగుతుందనేది దాని అర్థం. ఆ స్ఫూర్తినే ముఖ్యమంత్రి తీసుకున్నారేమో! అందుకే నియోజకవర్గాల అభ్యర్థులను అటూ ఇటూ మారుస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఎటూ కాకుండాపోతున్నారు.
- తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడుకు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను తిరుపతి లోక్సభకు మొదట మార్చారు.. ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో ఎంపీని మళ్లీ తిరుపతికే తెచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను మార్చి సత్యవేడులో కొత్త వ్యక్తిని నియమించారు.
- ఇదే తరహాలో చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరుకు, అక్కడున్న ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని చిత్తూరు లోక్సభకు మార్చారు. నారాయణస్వామి ఎదురుతిరగడంతో మళ్లీ ఎవరి స్థానాలకు వారిని మార్చారు. ఇద్దరూ ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటుంటే మళ్లీ గంగాధర నెల్లూరులో నారాయణస్వామిని తప్పించేసి, ఆయన కుమార్తె కృపాలక్ష్మిని సమన్వయకర్తగా ముఖ్యమంత్రి నియమించారు.
ఇక్కడ ఇంకో రకంగా...
ఎక్కడో విద్యా సంస్థలు నిర్వహించుకుంటున్న డాక్టర్ పెంచలయ్యను హడావుడిగా తన పార్టీలోకి ముఖ్యమంత్రి జగన్ చేర్చుకున్నారు. పార్టీలో చేరేటప్పుడు పెంచలయ్యతోపాటు వచ్చిన ఆయన కుమార్తె కటారి అరవింద యాదవ్ను కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించేశారు. కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డిని పక్కనపెట్టేశారు. అయితే అరవింద యాదవ్ నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టకుండానే.. ఫిబ్రవరి 28న కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు. పెంచలయ్య పార్టీలోకి చేరకముందే ఎమ్మెల్యే మధుసూదన్ను కనిగిరి నుంచి తప్పించారు. ఇవ్వాలనుకుంటే అప్పుడే ఆయనకు కందుకూరు ఇచ్చి ఉండొచ్చు. అలా చేయకుండా పెంచలయ్యను పార్టీలోకి తెచ్చుకుని, వారి కుటుంబానికి బాధ్యతను అప్పగించి..తర్వాత వారిని కాదని ఎమ్మెల్యే మధుసూదన్కు ఇచ్చారు. పెంచలయ్య కుటుంబాన్ని ఎందుకు పార్టీలోకి తీసుకువచ్చారో? ఆయన కుమార్తెను సమన్వయకర్తగా ఎందుకు నియమించారో...ఇప్పుడు మళ్లీ ఎందుకు తీసేశారో ఎవరికీ అంతుపట్టడం లేదు.
ఆర్కేపోయి...చిరంజీవి.. ఇప్పుడు లావణ్య
మంగళగిరిలో సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి..అక్కడ గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించారు. ఆయన అప్పటి నుంచి నియోజకవర్గంలోని గ్రూపులను కలుపుకొని వెళ్లేందుకు శ్రమిస్తున్నారు. ఇటీవల పార్టీకి సంబంధించిన శిక్షణ కార్యక్రమం మంగళగిరి పరిధిలో నిర్వహించగా...భారీగా ఖర్చు పెట్టి బ్యానర్లు, ఫ్లెక్సీలు, సీఎంకు స్వాగత తోరణాలనూ ఏర్పాటు చేశారు. మూడు రోజులు తిరక్కుండానే శుక్రవారం మంగళగిరి నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను నియమించేశారు. చిరంజీవిని తప్పించి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్యను సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు వైకాపా ప్రకటించింది. ఇప్పుడు చిరంజీవి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరమైంది.
- అరకు ఎంపీ గొడ్డేటి మాధవిని తొలుత అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు..అరకు ఎమ్మెల్యే ఫల్గుణను పక్కన పెట్టారు. తర్వాత మాధవిని తప్పించి అరకు సమన్వయకర్తగా రేగం మచ్చలింగంను నియమించారు.
- ఎమ్మిగనూరులో మొదట మాచాని వెంకటేష్ను తర్వాత ఆయన్ను తప్పించి బుట్టా రేణుకను నియమించారు. ఇలా పలు నియోజకవర్గాల్లో వైకాపా పెద్దలు సీట్ల బంతాటను కొనసాగిస్తూనే ఉన్నారు.
ఫ్లెక్సీల ఖర్చులు పెరిగిపోతున్నాయి...
ఎంపీ అభ్యర్థి మారగానే..సంబంధిత లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు/పార్టీ ఇన్ఛార్జులు ప్రచారం కోసం వేసుకున్న ఫ్లెక్సీలను వెంటనే మార్చుకోవాల్సి వస్తోంది. బుధవారం వరకు గుంటూరు లోక్సభ సమన్వయకర్తగా వెంకటరమణ ఉండడంతో ఆయన ఫొటోతోపాటు(సీఎం సహా)తమ చిత్రాలతో ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలు వేయించుకున్నారు. బుధవారం హఠాత్తుగా రమణ స్థానంలో రోశయ్య వచ్చారు. దీంతో రమణ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను మార్చి రోశయ్య చిత్రాలతో కొత్త ఫ్లెక్సీలు వేసుకోవాల్సిన పరిస్థితి ఎమ్మెల్యేలది. ఇవైనా ఎన్నికల వరకూ ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జులు మారినప్పుడల్లా స్థానిక నాయకులదీ ఇదే పరిస్థితి. ‘తరచూ ఈ ఫ్లెక్సీలను మార్చాల్సి వస్తోంది. వీటి పెట్టుబడే మాకు భారీగా పెరిగిపోతోంది’ అని వైకాపా నేతలే చెబుతున్న పరిస్థితి.
అంబటి పోయి.. ఉమ్మారెడ్డి వచ్చె.. ఉమ్మారెడ్డి పోయి కిలారు వచ్చే
గుంటూరు లోక్సభ స్థానానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును మార్చాలని సీఎం మొదట ప్రయత్నించారు. అందుకు ఆయన ససేమిరా అన్నారు. దీంతో చేసేది లేక ప్రత్యామ్నాయాలను వెతికారు. 2019లో అక్కడ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మోదుగుల వేణుగోపాలరెడ్డిని మళ్లీ తీసుకురావాలనుకున్నారు. కానీ ఆయన స్పందించలేదు. తర్వాత క్రికెటర్ అంబటి రాయుడును హడావుడిగా పార్టీలోకి చేర్చుకుని, ‘గుంటూరు నీదే పని చేసుకో’ అని ఆయనకు సీఎం చెప్పి పంపారు. అలా చెప్పి వారం తిరక్కుండానే అక్కడకు మళ్లీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను రమ్మన్నారు. అప్పుడు కూడా ఆయన అంగీకరించలేదు. ఇంకోవైపు తనకు సీటిచ్చి ఇప్పుడు ఇంకొకరిని ఎందుకు తెస్తున్నారో అర్థంకాక అవమానంతో అంబటి రాయుడు పార్టీకో నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. వెతగ్గా..వెతగ్గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ దొరికారు. ఆయన్ను సమన్వయకర్తగా నియమించారు. ఆయన ఫొటోలతో గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. వాటిని ఏర్పాటు చేసుకున్నన్ని రోజులు కూడా పట్టలేదు.. రమణను తీసేయడానికి. రమణను తప్పించి ఆయన బావ ఎమ్మెల్యే కిలారు రోశయ్యను గుంటూరు సమన్వయకర్తగా బుధవారం నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(4)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం