East Godavari: వైకాపా కానుకలు.. అడ్డుకున్న తెదేపా శ్రేణులు
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక సచివాలయంలో వైకాపా నాయకులు కానుకలు పంపిణీ చేస్తుండగా తెదేపా శ్రేణులు అడ్డుకున్నారు.
పంపిణీకి సర్క్యులర్ ఉందన్న పంచాయతీ కార్యదర్శి
సీతానగరం, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక సచివాలయంలో వైకాపా నాయకులు కానుకలు పంపిణీ చేస్తుండగా తెదేపా శ్రేణులు అడ్డుకున్నారు. రాజానగరం వైకాపా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి రాజశ్రీ ఆధ్వర్యంలో.. సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు వీటిని అందిస్తున్నారు. కొద్దిరోజులుగా రాజానగరం నియోజకవర్గంలో ‘వాలంటీర్లకు పురస్కారాల’ పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ తాయిలాలు ఇస్తున్నారు. మంగళవారం బొబ్బిల్లంకలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై తెదేపా వర్గీయులు, పంచాయతీ వార్డు సభ్యులు పోలిన శ్రీదేవి, పెండ్యాల మోహన్ నిలదీశారు. కానుకల సంచులపై సీఎం జగన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫొటోలు ఉండటంపై పంచాయతీ కార్యదర్శి సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ సర్క్యులర్ ఉందని, ఎంపీడీవో సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు రావడంతో సర్పంచి నేతృత్వంలో ఏర్పాటు చేశామని కార్యదర్శి మహ్మద్ రజాక్ సమాధానమిచ్చారు. సర్క్యులర్ చూపించాలని తెదేపా నాయకులు పెండ్యాల అవిస్వామి, పోలిన కృష్ణ అడగ్గా.. సర్క్యులర్ తన వద్ద లేదని సాయంత్రం ఇస్తానంటూ కార్యదర్శి చెప్పారు. సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో అసహనానికి గురైన ఆయన ఎన్నికల కోడ్ ఇంకా రాలేదని అనడంపై పంచాయతీ పాలకవర్గ సభ్యులు మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంతో రైతులకు తీవ్ర నష్టం
భూ హక్కు చట్టం అమలుతో రైతులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
జనసేన ప్రచార ప్రధాన కార్యదర్శిగా ఏఎం రత్నం
జనసేన పార్టీ ఎన్నికల ప్రచార ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంను పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ నియమించారు. తిరుపతి నియోజకవర్గంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయనకు సూచించారు. -
సీఎఫ్డీ ‘ఏపీ ఎలక్షన్ వాచ్’ వెబ్సైట్ ఆవిష్కరణ
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో www.apelectionwatch.com పేరుతో ఓ వెబ్సైట్ను ఆవిష్కరించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
‘నిజం మాట్లాడితే నోటీసులిస్తారా?’
సీఎం జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే చంద్రబాబు, లోకేశ్పై కేసులు పెడతారా? అని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
6 వేల మంది రైతుల ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణం
వైకాపా ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో ఆరు వేల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. ఈ ఆత్మహత్యలకు జగన్రెడ్డే కారణమని ఆరోపించారు. -
క్యాంపస్లలో వేధింపుల పరిష్కారానికి.. రోహిత్ వేముల చట్టం చేస్తాం: కేసీ వేణుగోపాల్
హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల 2016లో మృతి చెందిన ఘటనపై గతంలో నిర్వహించిన దర్యాప్తులో అనేక వైరుధ్యాలున్నాయని.. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం ఆయన కుటుంబానికి న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్