డిపాజిట్ గల్లంతైనా పోటీకి సై
లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు.
లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా 71,246 మందికి దక్కని ధరావతు
2019లో 86% మందికి నిరాశే
దిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఎంతో మందికి డిపాజిట్లు దక్కకున్నా పోటీ నుంచి వెనక్కి తగ్గడంలేదు. తొలి ఎన్నికలు జరిగిన 1951 నుంచి ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసిన 71,246 మంది డిపాజిట్లను దక్కించుకోలేకపోయారు. అంటే పోటీ చేసిన నియోజకవర్గంలో మొత్తం పోలైన చెల్లిన ఓట్లలో 6వ వంతు రాలేదని అర్థం. 2019లో 86శాతం అభ్యర్థులకు డిపాజిట్లు దక్కలేదు. అభ్యర్థుల అనుచిత పోటీని నివారించేందుకు సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును పెంచినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.
- 1951 నుంచి ఇప్పటిదాకా మొత్తం 91,160 మంది అభ్యర్థులు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వారిలో 71,246 మంది డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇది 78శాతంతో సమానం.
- మొదట్లో అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్ జనరల్ కేటగిరీ వారికి రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250 ఉండేది. దీంతో ఎవరుపడితే వారు నామినేషన్ వేసేవారు. దీనిని అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం డిపాజిట్ను పెంచింది. జనరల్ కేటగిరీ వారికి రూ.25,000, ఎస్సీ, ఎస్టీలకు రూ.12,500గా చేసింది.
- 2019 ఎన్నికల్లో బీఎస్పీ 383 సీట్లలో పోటీ చేసింది. అందులో 345 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది.
- గత ఎన్నికల్లో కాంగ్రెస్ 421 చోట్ల పోటీ చేయగా 148 చోట్ల డిపాజిట్లను దక్కించుకోలేకపోయింది.
- 2019లో 49 స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ 41 చోట్ల డిపాజిట్లను కోల్పోయింది.
- 1951-52లో మొత్తం 1,874 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 745 మంది (40శాతం) డిపాజిట్లను దక్కించుకోలేదు.
- 1996లో జరిగిన 11వ లోక్సభ ఎన్నికల్లో 13,952 మంది పోటీ చేశారు. వారిలో అత్యధికంగా 12,688 మంది (91శాతం) డిపాజిట్లు కోల్పోయారు. ఈ ఎన్నికల్లోనే అత్యధికంగా బరిలో నిలిచారు.
- 1991-92లో 8,749 అభ్యర్థులు పోటీ చేయగా 7,539 మంది (86శాతం) డిపాజిట్లను దక్కించుకోలేదు.
- 2009లో 8,070 మంది పోటీ చేయగా 6,829 మంది (85శాతం) డిపాజిట్లను కోల్పోయారు.
- 2014 లోక్సభ ఎన్నికల్లో 8,251 మంది పోటీ చేశారు. వారిలో 7,000 మంది (84శాతం) డిపాజిట్లను దక్కించుకోలేదు.
జాతీయ పార్టీలు మేలే
- జాతీయ పార్టీల నుంచి పోటీ చేసిన వారిలో ఎక్కువ మంది డిపాజిట్ దక్కించుకుంటున్నారు.
- 1951-52లో జాతీయ పార్టీల నుంచి 1,217 మంది పోటీ చేశారు. అందులో కేవలం 344 మందే (28శాతం) డిపాజిట్లను కోల్పోయారు.
- 1957లో 919 మంది అభ్యర్థులు జాతీయ పార్టీల నుంచి పోటీ చేశారు. వారిలో 130 మందికే (14శాతం) డిపాజిట్లు దక్కలేదు.
- 1977లో జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలు అత్యుత్తమంగా నిలిచాయి. ఆ ఎన్నికల్లో 1,060 మంది పోటీ చేయగా 100 మందే (9శాతం) డిపాజిట్లను దక్కించుకోలేదు.
- 2009లో జాతీయ పార్టీల తరఫున అత్యంత చెత్త రికార్డు నమోదైంది. మొత్తం 1,623 మంది పోటీ చేయగా 779 మంది (దాదాపు 40శాతంపైగా) డిపాజిట్లు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
-
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
-
భారాస నేత క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికం: కేటీఆర్
-
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
-
‘రెడ్లైన్ దాటుతున్నారు జాగ్రత్త..!’ - కెనడాలోని సిక్కు వేర్పాటువాదులకు భారత్ హెచ్చరిక