2004 చరిత్ర పునరావృతం: జైరాం రమేశ్
రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయన్న భాజపా వాదనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తోసిపుచ్చారు.
దిల్లీ: రాబోయే లోక్సభ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయన్న భాజపా వాదనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తోసిపుచ్చారు. ‘టైగర్ మే అభీ బహుత్ జాన్ హై’ (పులిలో ఇంకా చాలా దమ్ముంది) అని పేర్కొన్న ఆయన.. విపక్ష కూటమి 2004 ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తుందన్నారు. ఆ ఎన్నికల్లో ‘ఇండియా షైనింగ్’ అంటూ బరిలోకి దిగిన భాజపా అధికారం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ‘అయిదు న్యాయాలు’, ‘25 గ్యారంటీలు’తో కాంగ్రెస్ బరిలోకి దిగుతోందని.. విపక్ష ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ రావడం ఖాయమన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘2003 ఎన్నికల్లోనూ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. భాజపా ‘ఇండియా షైనింగ్’ అంది. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇపుడు 20 ఏళ్ల తర్వాత అదే చరిత్ర పునరావృతం అవుతుంది’’ అన్నారు. కాగా, శుక్రవారం మళ్లీ సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ తమిళనాడులో డీఎంకేతో పొత్తులో భాగంగా తమ కోటా కింద వచ్చిన 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చలు జరిపింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర నేతల అంతమే మోదీ లక్ష్యం
తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. -
విపక్ష నేతలకు రాసిన లేఖపై మీరు స్పందించడం ఆశ్చర్యమే
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలకు తాను రాసిన లేఖపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్, సిసోదియా వంటి వారిని భాజపా ఆహ్వానించదు
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలను భాజపాలోకి ఎప్పటికీ ఆహ్వానించబోమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ స్పష్టం చేశారు. -
వరుణ్కు టికెట్ ఇస్తే బాగుండేది: మేనకా గాంధీ
యూపీలోని పీలీభీత్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు తన కుమారుడు వరుణ్ గాంధీకి భాజపా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన తల్లి మేనకా గాంధీ పేర్కొన్నారు. -
పోలింగ్ ముగియగానే విలేకర్ల సమావేశం నిర్వహించండి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతి విడత పోలింగ్ ముగిశాక అదే రోజు విలేకర్ల సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ తదితర మీడియా సంఘాలు డిమాండ్ చేశాయి. -
‘టెంపో’ బిలియనీర్ల తోలుబొమ్మ మోదీ
‘టెంపో బిలియనీర్ల’ చేతిలో తోలుబొమ్మలాంటి 21వ శతాబ్దపు రాజు ప్రధాని నరేంద్రమోదీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.