ప్రతి పోలింగ్ బూత్లో 370 ఓట్లు లక్ష్యం
ప్రజల్లో భాజపాకు ఉన్న సానుకూల ధోరణిని ఓట్లుగా మలచుకుని మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని భాజపా రాష్ట్ర నాయకత్వం పార్టీ శ్రేణులకు నిర్దేశించింది.
ఒక్కో ఓటర్ని మూడుసార్లు కలవాలి
లోక్సభ ఎన్నికలకు భాజపా 50 రోజుల కార్యాచరణ
అభ్యర్థులు, పదాధికారులు, ఎన్నికల నిర్వహణ కమిటీలకు దిశానిర్దేశం
ఈనాడు, హైదరాబాద్: ప్రజల్లో భాజపాకు ఉన్న సానుకూల ధోరణిని ఓట్లుగా మలచుకుని మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని భాజపా రాష్ట్ర నాయకత్వం పార్టీ శ్రేణులకు నిర్దేశించింది. ఎన్నికల్లోపు ఇంటింటికీ మూడుసార్లు వెళ్లడంతో పాటు ప్రతి ఓటర్ని మూడుసార్లు కలవడం లక్ష్యంగా పెట్టుకోవాలంది. లోక్సభ ఎన్నికలకు 50 రోజుల కార్యాచరణను నాయకత్వం వివరించింది. ‘ఇదే సమయం.. సరైన సమయం’ అని పార్టీ శ్రేణులు గుర్తించాలంది. ప్రతి పోలింగ్ బూత్ నుంచి 370 కంటే ఎక్కువ ఓట్లు సాధించేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలంది. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నేతృత్వంలో కీలక సమావేశాలు జరిగాయి. లోక్సభ అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా సమావేశమైంది. రాష్ట్ర పదాధికారులు, ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చేరికలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ నేతలు ముందుకు వెళ్లాలన్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఇన్ఛార్జులు సునీల్బన్సల్, చంద్రశేఖర్ తివారి, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ముఖ్యనేతలు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్రెడ్డి, శాసనసభాపక్షనేత మహేశ్వర్రెడ్డి, లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన నేతలు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
కలసికట్టుగా ముందుకెళ్లండి
‘‘విజయమే లక్ష్యంగా అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సహకరించాలి. అభ్యర్థులు కూడా లోక్సభ స్థానం పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో కలసికట్టుగా ముందుకు వెళ్లాలి. మండలాలు, నియోజకవర్గాల వారీగా కార్యాచరణను రూపొందించుకుని ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. జాతీయ నాయకులు, రాష్ట్రస్థాయి నేతల సభలు అన్ని ప్రాంతాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటుచేస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను అభ్యర్థులకు అందజేస్తాం. వీటి ఆధారంగా లబ్ధిదారులను కలసి పథకాల గురించి వివరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకుంటూ వ్యతిరేక ప్రచారాలను దీటుగా ఎదుర్కోవాలి. జనసంపర్క్ అభియాన్ లక్ష్యంగా ఉండాలి. సామాజిక వర్గాల ముఖ్యనేతలతో భేటీ అవ్వాలి. శక్తి కేంద్రాల వారీగా సమావేశాలు జరపాలి. త్వరలోనే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎన్నికల నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయనున్నాం’’ అని సమావేశాల్లో నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెలరోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను తెలియజేశారు.
ప్రతి ఓటర్ని కలుస్తాం: మహేశ్వర్రెడ్డి
ప్రతి ఓటర్ని కలవడమే లక్ష్యంగా భాజపా కార్యాచరణను సిద్ధం చేసినట్లు పార్టీ శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి తెలిపారు. ఆదివారం సమావేశాల అనంతరం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లుతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మే ఆరో తేదీన టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతి పోలింగ్ బూత్లోనూ ఇది జరుగుతుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100, 200 మందితో కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కమిటీ మూడు రోజులకు ఒకసారి సమావేశమై చర్చిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని మహేశ్వర్రెడ్డి తెలిపారు.
సానుకూల వాతావరణం: కిషన్రెడ్డి
‘‘తెలంగాణలో భాజపాకు సానుకూల వాతావరణం ఉంది. లోక్సభ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసినా, డబ్బులు ఖర్చుపెట్టినా భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయం. ప్రజలంతా మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మహిళలు స్వచ్ఛందంగా భాజపా కార్యక్రమాలకు వస్తున్నారు. ప్రతి బూత్కి ఒక ముఖ్యనేతను సమన్వయకర్తగా నియమించుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయదనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’’ అని సమావేశంలో కిషన్రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్రెడ్డి విజయం కోసం కృషి చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్