ప్రతి పోలింగ్ బూత్లో 370 ఓట్లు లక్ష్యం
ప్రజల్లో భాజపాకు ఉన్న సానుకూల ధోరణిని ఓట్లుగా మలచుకుని మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని భాజపా రాష్ట్ర నాయకత్వం పార్టీ శ్రేణులకు నిర్దేశించింది.
ఒక్కో ఓటర్ని మూడుసార్లు కలవాలి
లోక్సభ ఎన్నికలకు భాజపా 50 రోజుల కార్యాచరణ
అభ్యర్థులు, పదాధికారులు, ఎన్నికల నిర్వహణ కమిటీలకు దిశానిర్దేశం
ఈనాడు, హైదరాబాద్: ప్రజల్లో భాజపాకు ఉన్న సానుకూల ధోరణిని ఓట్లుగా మలచుకుని మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా లోక్సభ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని భాజపా రాష్ట్ర నాయకత్వం పార్టీ శ్రేణులకు నిర్దేశించింది. ఎన్నికల్లోపు ఇంటింటికీ మూడుసార్లు వెళ్లడంతో పాటు ప్రతి ఓటర్ని మూడుసార్లు కలవడం లక్ష్యంగా పెట్టుకోవాలంది. లోక్సభ ఎన్నికలకు 50 రోజుల కార్యాచరణను నాయకత్వం వివరించింది. ‘ఇదే సమయం.. సరైన సమయం’ అని పార్టీ శ్రేణులు గుర్తించాలంది. ప్రతి పోలింగ్ బూత్ నుంచి 370 కంటే ఎక్కువ ఓట్లు సాధించేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలంది. ఆదివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి నేతృత్వంలో కీలక సమావేశాలు జరిగాయి. లోక్సభ అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా సమావేశమైంది. రాష్ట్ర పదాధికారులు, ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చేరికలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ నేతలు ముందుకు వెళ్లాలన్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఇన్ఛార్జులు సునీల్బన్సల్, చంద్రశేఖర్ తివారి, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ముఖ్యనేతలు ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్రెడ్డి, శాసనసభాపక్షనేత మహేశ్వర్రెడ్డి, లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన నేతలు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
కలసికట్టుగా ముందుకెళ్లండి
‘‘విజయమే లక్ష్యంగా అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సహకరించాలి. అభ్యర్థులు కూడా లోక్సభ స్థానం పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో కలసికట్టుగా ముందుకు వెళ్లాలి. మండలాలు, నియోజకవర్గాల వారీగా కార్యాచరణను రూపొందించుకుని ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి. జాతీయ నాయకులు, రాష్ట్రస్థాయి నేతల సభలు అన్ని ప్రాంతాల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటుచేస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను అభ్యర్థులకు అందజేస్తాం. వీటి ఆధారంగా లబ్ధిదారులను కలసి పథకాల గురించి వివరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. సామాజిక మాధ్యమాలను సమర్థంగా ఉపయోగించుకుంటూ వ్యతిరేక ప్రచారాలను దీటుగా ఎదుర్కోవాలి. జనసంపర్క్ అభియాన్ లక్ష్యంగా ఉండాలి. సామాజిక వర్గాల ముఖ్యనేతలతో భేటీ అవ్వాలి. శక్తి కేంద్రాల వారీగా సమావేశాలు జరపాలి. త్వరలోనే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎన్నికల నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయనున్నాం’’ అని సమావేశాల్లో నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెలరోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను తెలియజేశారు.
ప్రతి ఓటర్ని కలుస్తాం: మహేశ్వర్రెడ్డి
ప్రతి ఓటర్ని కలవడమే లక్ష్యంగా భాజపా కార్యాచరణను సిద్ధం చేసినట్లు పార్టీ శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి తెలిపారు. ఆదివారం సమావేశాల అనంతరం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్రెడ్డి, కాసం వెంకటేశ్వర్లుతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మే ఆరో తేదీన టిఫిన్ బైఠక్ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతి పోలింగ్ బూత్లోనూ ఇది జరుగుతుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100, 200 మందితో కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కమిటీ మూడు రోజులకు ఒకసారి సమావేశమై చర్చిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని మహేశ్వర్రెడ్డి తెలిపారు.
సానుకూల వాతావరణం: కిషన్రెడ్డి
‘‘తెలంగాణలో భాజపాకు సానుకూల వాతావరణం ఉంది. లోక్సభ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసినా, డబ్బులు ఖర్చుపెట్టినా భాజపాకు రెండంకెల స్థానాలు ఖాయం. ప్రజలంతా మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మహిళలు స్వచ్ఛందంగా భాజపా కార్యక్రమాలకు వస్తున్నారు. ప్రతి బూత్కి ఒక ముఖ్యనేతను సమన్వయకర్తగా నియమించుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయదనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి’’ అని సమావేశంలో కిషన్రెడ్డి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి