పది స్థానాలపై భాజపా గురి
లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా తెలంగాణలో పది లోక్సభ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తోంది.
పార్టీ జాతీయ నాయకత్వం పర్యవేక్షణ
వ్యూహాత్మకంగా కొత్త అభ్యర్థుల ఎంపిక
ప్రచారంలోనూ ముందస్తు కార్యాచరణ
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా తెలంగాణలో పది లోక్సభ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తోంది. శాసనసభ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ.. గత లోక్సభ ఫలితాలు ప్రాతిపదికగా మెజారిటీ స్థానాలపై ఆశావహ దృక్పథంతో ఉంది. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సిటింగ్ స్థానాలతో పాటు అదనంగా మరో ఆరు నియోజకవర్గాలపై పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికల కార్యాచరణ ప్రారంభించిన అధినాయకత్వం అభ్యర్థుల ఎంపికలోనూ అదే వ్యూహాన్ని అనుసరించింది. అభ్యర్థుల ఎంపిక పూర్తయినందున మొదటి విడత ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ప్రధాని రెండు విడతలుగా ప్రచార సభల్లో పాల్గొనగా.. అగ్రనేత అమిత్షా పార్టీనేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంలోనూ భాజపా ప్రత్యేక పంథాలో సాగింది. ప్రధానంగా విజయావకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్తవారికి ప్రాధాన్యమిచ్చింది. ఇతర పార్టీల నేతలను చేర్చుకునేందుకు జాతీయ నాయకత్వమే స్వయంగా రంగంలోకి దిగింది. ఇద్దరు భారాస సిటింగ్ ఎంపీలతో పాటు అదేపార్టీకి చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఒక లోక్సభ స్థానం మినహా అన్ని స్థానాల్లో లక్ష్యం మేరకు చేరికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు పార్టీనేతలు పేర్కొంటున్నారు.
టికెట్ల కేటాయింపులో సమీకరణాలు
భాజపా జాతీయ నాయకత్వం టికెట్ల కేటాయింపులోనూ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో రెండు ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో కూడా గిరిజనుల్లో కీలకమైన రెండు వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చింది. భారాసకు చెందిన ఇద్దరు మాజీ ఎంపీలను పార్టీలో చేర్చుకుని బరిలోకి దింపింది. ఆదిలాబాద్ స్థానం నుంచి సిటింగ్ ఎంపీని కాదని మాజీ ఎంపీ జి.నగేశ్ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వగా.. మహబూబాబాద్ లోక్సభ స్థానం లో లంబాడాలకు ప్రాధాన్యమిస్తూ మాజీ ఎంపీ సీతారాం నాయక్ను పార్టీలోకి తీసుకుని బరిలోకి దింపింది. ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లోనూ ఇదే పంథాను అనుసరించింది. నాగర్కర్నూల్ రిజర్వుడ్ స్థానం నుంచి సిటింగ్ ఎంపీ రాములును పార్టీలో చేర్చుకుని ఆయన కుమారుడు భరత్ ప్రసాద్కు టికెట్ కేటాయించింది. పెద్దపల్లి ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి కొత్త అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ను పోటీలో నిలిపింది. మరో ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన వరంగల్లో కూడా భారాస మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ను పార్టీలోకి తెచ్చుకుని టికెట్ ఇచ్చింది. ఇలా నాలుగు రిజర్వుడ్ స్థానాల్లోనూ ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న నేతలకే టికెట్లిచ్చింది. ఇతర స్థానాల్లోనూ పకడ్బందీగానే వ్యవహరించింది. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన ఈటల రాజేందర్, రఘునందన్రావులను లోక్సభ బరిలోకి దించింది. భారాస సిటింగ్ ఎంపీ బి.బి.పాటిల్ను పార్టీలో చేర్చుకుని జహీరాబాద్ అభ్యర్థిగా నిలిపింది. ఇక నియోజకవర్గ, మండల స్థాయి నేతల చేరికలపై దృష్టి సారించింది. ప్రధానంగా భారాస నేతలే లక్ష్యంగా ముందుకెళ్తోంది.
నోటిఫికేషన్కు ముందు అమిత్షా, నడ్డా, రాజ్నాథ్ రాక
మలివిడత జాతీయ నేతల ప్రచారంపై రాష్ట్ర నాయకులు దృష్టి సారించారు. వారి ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్షా, భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ల బహిరంగ సభలను వేర్వేరు చోట్ల నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నోటిఫికేషన్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలు ఏర్పాటు చేయనున్నారు. ప్రచారంలో జాతీయ నేతల సభలతో పాటు క్షేత్రస్థాయిలో బూత్ నుంచి కార్యక్రమాల ఎజెండాను రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గట్టికౌంటర్ ఇచ్చారు. -
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య దిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
రాహుల్ గాంధీ ర్యాలీల్లో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. -
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. -
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు