Bandi Sanjay: నా ఫోన్‌నూ ట్యాప్‌ చేశారు: బండి సంజయ్‌

గత భారాస ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్‌ చేయించిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు.

Updated : 27 Mar 2024 08:46 IST

చాంద్రాయణగుట్ట, తెలంగాణ చౌక్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: గత భారాస ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్‌ చేయించిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్‌లో పాతబస్తీ అలియాబాద్‌కు చెందిన భాజపా సీనియర్‌ నేత పొన్న సుదర్శన్‌ను ఆయన మంగళవారం రాత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో, కరీంనగర్‌లో మంగళవారం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ మండలాల ఇన్‌ఛార్జులతో ఏర్పాటు చేసిన సమావేశంలోనూ సంజయ్‌ మాట్లాడారు. గత ప్రభుత్వం 18 మంది ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో తనపై నిరంతరం నిఘా పెట్టిందన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్‌ సర్కారు విచారణ పేరుతో సాగదీస్తుండగా, ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని భారాస నిలదీయడం లేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కలిసి తనను ఓడించడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, ఎన్నికల తర్వాత ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడమే గగనమవుతుందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని