4 ఖరారు.. 4 పెండింగ్
రాష్ట్రంలో మరో నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్కుమార్రెడ్డిలకు అవకాశం కల్పించారు.
ఖమ్మం నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేయాలని విన్నపం
ఆమె నిర్ణయం వెలువడిన తర్వాతే ఆ స్థానానికి అభ్యర్థి ప్రకటన
వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు ఇంకా కొలిక్కిరాని అభ్యర్థిత్వాలు
ఈనాడు, హైదరాబాద్, దిల్లీ: రాష్ట్రంలో మరో నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి అభ్యర్థులను ప్రకటించింది. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, భువనగిరి నుంచి చామల కిరణ్కుమార్రెడ్డిలకు అవకాశం కల్పించారు. దీంతో రాష్ట్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు మినహా మిగతా వాటికి అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) బుధవారం దిల్లీలో సమావేశమై చర్చించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణతోపాటు ఉత్తర్ప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, గోవా అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం గోవా మినహా మిగిలిన 4 రాష్ట్రాల్లోని 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లతో జాబితాను పార్టీ విడుదల చేసింది.
తాజాగా ప్రకటించిన అభ్యర్థుల్లో జీవన్రెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీచేసి ఓడిపోయారు. సుదీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న ఆయన పేరుపై సీఈసీలో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. జీవన్రెడ్డి మినహా మిగిలిన ముగ్గురు అభ్యర్థులు పార్లమెంటుకు పోటీచేయడం ఇదే తొలిసారి. నీలం మధు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు టికెట్ ఆశించినా చివరిక్షణంలో దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. బీసీ కోటాలో ఆయనను ఇప్పుడు మెదక్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సుగుణనే ఎంపిక చేసినా.. పొరపాటున తొలుత డాక్టర్ సుగుణకుమార్ చెలిమల అని జాబితాలో ప్రకటించి.. తర్వాత సవరించారు. సుగుణ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్రెడ్డికి భువనగిరి నుంచి అవకాశం ఇచ్చారు.
ప్రియాంక కోసమేనా...
ఖమ్మం స్థానం నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పోటీచేయాలని రాష్ట్ర నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఆమె ఇప్పటికే ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలి నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెండోస్థానంగా ఖమ్మం నుంచి కూడా పోటీచేయడానికి సుముఖంగా ఉన్నారా? లేదా? అన్న దానిపై ఈ సమావేశంలో స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం కోసం ఖమ్మం అభ్యర్థి ఎంపికను పెండింగ్లో పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ స్థానానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణి నందిని, మాజీ ఎంపీ సురేందర్రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్లు పోటీపడుతున్నారు. అలాగే వ్యాపారవేత్త వీవీ రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకృష్ణలు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర నాయకత్వం ఇక్కడి నుంచి ప్రియాంకాగాంధీ పోటీచేయాలని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ప్రియాంక పోటీ చేయకపోతే ప్రసాద్రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయని నేతల అంచనా.
- కరీంనగర్ నుంచి పోటీ అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానానికి పోటీపడుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్రెడ్డి, వెలిచాల రవీందర్రావు, తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వాలపై మరోసారి సర్వే నిర్వహించి ఒక నిర్ణయానికి రావాలని అనుకున్నట్లు సమాచారం.
- వరంగల్ స్థానానికి పీసీసీ.. సాంబయ్య పేరును ప్రతిపాదించినా అక్కడి నుంచి సిటింగ్ ఎంపీ పసునూరి దయాకర్, నెమిండ్ల శ్రీనివాస్, డాక్టర్ పరమేశ్వర్, పరికి సదానందం పేర్లపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సర్వే నిర్వహించి బలమైన అభ్యర్థిని ఎంపికచేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
- హైదరాబాద్ టికెట్ మైనార్టీలకిస్తే మస్కతీ అలీని లేదంటే బీసీ నేతను త్వరలో ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?