ఎన్ని కుట్రలు చేసినా భాజపా, భారాసలు గెలవలేవు
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో మరోసారి ఘనవిజయం సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన భారాస, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం సీఎం నివాసంలో కాంగ్రెస్లో చేరారు.
మల్కాజిగిరిలో ఎక్కువ మెజార్టీ సాధించాలి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గంలో మరోసారి ఘనవిజయం సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన భారాస, తెలుగుదేశం పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు బుధవారం సీఎం నివాసంలో కాంగ్రెస్లో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరిలో తనకు వచ్చిన దాని కంటే ఎక్కువ మెజార్టీతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ప్రజలను మభ్యపెట్టే చర్యలకు పాల్పడినా భాజపా, భారాసలు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో గెలవలేవన్నారు. ఉనికి లేకుండా పోయే పార్టీలకు ఓట్లు వేసే బదులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు బలపరచాలని కోరారు. ప్రజలతో మమేకమయ్యేలా రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను ఎట్టిపరిస్థితుల్లో అమలు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో తమ అడ్రస్ గల్లంతవుతుందనే భయంతోనే భాజపా, భారాస నాయకులు కాంగ్రెస్పై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పార్టీలో చేరినవారిలో తెదేపా నేత కృష్ణప్రసాద్, తెలంగాణ కమ్మ సంఘం నాయకులు బి.రవిశంకర్, అరికెపూడి ప్రసాద్(మేడ్చల్), బోడు వెంకటేశ్యాదవ్(కుత్బుల్లాపూర్), మాజీ కార్పొరేటర్లు శాలిని, పావనీరెడ్డి, రమణారెడ్డి, మాజీ ఎంపీపీ దేవేందర్రెడ్డి తదితరులు ఉన్నారు.
అండగా ఉంటా: వీహెచ్కు సీఎం హామీ
అన్ని విధాలుగా అండగా ఉంటానని మాజీ ఎంపీ వీహెచ్కు సీఎం రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం టికెట్ ఆశించిన వీహెచ్.. తనకు వచ్చే అవకాశం లేదని భావించి కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీహెచ్ను సీఎం బుధవారం తన నివాసానికి పిలిపించుకుని మాట్లాడారు. అభ్యర్థుల ఖరారుకు పార్టీ అధిష్ఠానం అవలంబిస్తున్న విధానాన్ని వివరించారు. నాయకులందరం ఐక్యంగా ప్రచారానికి వెళ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని అన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్రెడ్డి ఈ సందర్భంగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?