ప్రజల దృష్టి మరల్చేందుకే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలను వదిలేసిందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
పదేళ్ల నిజానికి.. వంద రోజుల అబద్ధానికి మధ్య ఎన్నికలివి
13న చేవెళ్లలో కేసీఆర్ బహిరంగ సభ
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలను వదిలేసిందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. పాలన చేతకాక స్కాములు, స్కీములు, ట్యాపింగ్ల పేరుతో డ్రామాలు ఆడుతోందన్నారు. పదేళ్ల నిజానికి.. వంద రోజుల అబద్ధానికి మధ్య జరుగుతున్న ఎన్నికలివి అని అభివర్ణించారు. 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొంతమంది భారాస ఎమ్మెల్యేలతో కలిసి భాజపాలో చేరాలన్నది సీఎం రేవంత్రెడ్డి ఆలోచన అని ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, నేతలతో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘కేజ్రీవాల్ అరెస్టును రాహుల్ గాంధీ అన్యాయం అంటారు. అదే కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే రేవంత్ కరెక్టే అంటున్నారు. రాహుల్ కరెక్టా లేదా రేవంత్రెడ్డి కరెక్టా అనేది కాంగ్రెస్ చెప్పాలి. రేవంత్రెడ్డికి సచివాలయంలో లంకెబిందెలు కనిపించాయో లేదో గాని.. నగరంలో ఖాళీ నీటిబిందెలు మాత్రం కనిపిస్తున్నాయి. భారాస ఒక్క లోక్సభ సీటు కూడా గెలవదని చేవెళ్ల సభలో సీఎం అడ్డగోలుగా మాట్లాడారు. దమ్ముంటే ఇప్పటికైనా నాతో మల్కాజిగిరిలో పోటీకి రావాలి. ఆయనకు సవాల్ను స్వీకరించే దమ్ము లేదు. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం సంక్షోభంలో చిక్కుకున్నా.. కరవుతో సతమతమవుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రేవంత్రెడ్డి మొదలుకొని యూట్యూబ్ ఛానెళ్లలో అడ్డగోలుగా పార్టీపై, నాయకత్వంపై మాట్లాడేవారికి.. ఓటు ద్వారానే బుద్ధి చెబుదాం’’ అని కేటీఆర్ అన్నారు.
రంజిత్రెడ్డి స్వార్థపరుడు..
భారాసను వీడి కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డిపై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకొంటానని చెప్పి అధికారం, ఆస్తుల కోసం రంజిత్రెడ్డి పార్టీని వీడి ద్రోహం చేశారు. తన సోదరిగా చెప్పుకొనే కవితను ఈడీ అరెస్ట్ చేసిన రోజే.. కాంగ్రెస్లో చేరిన స్వార్థపరుడు. గత ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి సైతం పార్టీ కంటే తానే ఎక్కువనుకుని.. వేరే పార్టీలోకి వెళ్తే ఫలితం ఏమైందో తెలుసు. పార్టీ కంటే తామే పెద్దవారమనుకునే వ్యక్తులు రాజకీయాల్లో గెలవలేరు. కొన్ని దశాబ్దాలుగా బీసీలకు అండగా నిలబడిన కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు తథ్యం. ఏప్రిల్ 13న చేవెళ్ల నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొంటారు’’ అని కేటీఆర్ తెలిపారు.
వెన్నుపోటు పొడిచిన వాళ్లకు బుద్ధిచెప్పాలి..
‘‘హుజూరాబాద్, గజ్వేల్లలో ఓడిన ఈటల రాజేందర్ మల్కాజిగిరిలో పోటీ చేస్తున్నారు. దమ్ముంటే మల్కాజిగిరి, కంటోన్మెంట్లకు భాజపా ఏం చేసిందో చెప్పి ఓట్లడగాలి. మల్కాజిగిరిలో పోటీచేస్తున్న కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు కేసీఆర్ ద్వారా పదవులు పొంది వెన్నుపోటు పొడిచారు. వారికి ఓటుతో బుద్ధిచెప్పాలి. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తున్నది రాగిడి లక్ష్మారెడ్డి అయినా.. గులాబీ సైనికులంతా ఎన్నికల్లో నిలబడినట్లుగా పనిచేద్దాం’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారాస విజయానికి కృషి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. పార్టీ మారుతున్నానని తనపై జరుగుతున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని జ్వరమొచ్చినా సమావేశానికి వచ్చానని చెప్పారు. సమావేశంలో భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్యాదవ్(సనత్నగర్), మల్లారెడ్డి(మేడ్చల్), మర్రి రాజశేఖర్రెడ్డి(మల్కాజిగిరి), కేపీ వివేకానంద్(కుత్బుల్లాపూర్), సుధీర్రెడ్డి(ఎల్బీనగర్), బండారి లక్ష్మారెడ్డి(ఉప్పల్), ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్, కుర్మయ్యగారి నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందితకు కేటీఆర్, నేతలు సంతాపం తెలిపారు. ఆమె ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరుకాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
తెలంగాణ బడ్జెట్లో హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలకు రూ.10 వేల కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం