మాజీ మంత్రి చిత్తరంజన్దాస్ కాంగ్రెస్లో చేరిక
మాజీ మంత్రి చిత్తరంజన్దాస్.. నాగర్కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తలకొండపల్లి మండలం సంగాయిపల్లిలో బుధవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి(కల్వకుర్తి), వంశీకృష్ణ (అచ్చంపేట) సమక్షంలో చిత్తరంజన్దాస్కు మల్లు రవి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
తలకొండపల్లి, న్యూస్టుడే: మాజీ మంత్రి చిత్తరంజన్దాస్.. నాగర్కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. తలకొండపల్లి మండలం సంగాయిపల్లిలో బుధవారం ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి(కల్వకుర్తి), వంశీకృష్ణ (అచ్చంపేట) సమక్షంలో చిత్తరంజన్దాస్కు మల్లు రవి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. చిత్తరంజన్దాస్ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో జడ్చర్లలో భాజపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1989లో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్పై చిత్తరంజన్దాస్ కల్వకుర్తిలో విజయం సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో భాజపాలోకి వెళ్లానని.. మళ్లీ కాంగ్రెస్లో చేరడంతో సొంత గూటికి వచ్చినట్లుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శ్రీనివాస్గౌడ్, యాట నర్సింహ, గట్ల కేశవరెడ్డి, మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!