మహావికాస్ అఘాడీలో లుకలుకలు
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం మహారాష్ట్రలోని 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో రగడ రాజుకుంది.
శివసేన (యూబీటీ) 17 మంది అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ అసంతృప్తి
ముంబయి: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) బుధవారం మహారాష్ట్రలోని 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో రగడ రాజుకుంది. ఓవైపు పొత్తులపై చర్చలు జరుగుతుండగా యూబీటీ జాబితా విడుదల చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. పొత్తు ధర్మాన్ని పాటించాలని ఆ పార్టీని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్ కోరారు. తాము పోటీ చేయాలనుకుంటున్న సాంగ్లీ సీటులో యూబీటీ తన అభ్యర్థిని నిలబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్.. సీట్ల సర్దుబాటుకు అంగీకరించిన వారు మహారాష్ట్రలో పార్టీకి సమాధి కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
17 మంది జాబితాలో కేంద్ర మాజీ మంత్రులు
శివసేన ప్రకటించిన జాబితాలో కేంద్ర మాజీ మంత్రులు అనంత్ గీతే (రాయ్గఢ్), అరవింద్ సావంత్ (దక్షిణ ముంబయి)లకు చోటు దక్కింది. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ అనిల్ దేశాయ్ దక్షిణ మధ్య ముంబయి నుంచి పోటీ చేయనున్నారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలున్నాయి. 44 సీట్లకు సంబంధించి మహా వికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్ 16, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 9 సీట్లలో పోటీచేసేందుకు అంగీకారం కుదిరింది. మిగిలిన నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) 17 మందితో తొలి జాబితాను ప్రకటించడం చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం