ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తనవద్ద లేదని, అందుకే భాజపా ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
అందుకే పార్టీ ఆఫర్ను తిరస్కరించా
నిర్మలా సీతారామన్ వ్యాఖ్య
దిల్లీ: లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తనవద్ద లేదని, అందుకే భాజపా ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎన్నికల బాండ్లను అన్ని పార్టీలూ సొమ్ము చేసుకున్నాయని, అందుకే ఏ పార్టీకీ విమర్శించే నైతిక హక్కు లేదని అభిప్రాయపడ్డారు. బుధవారం టైమ్స్ నౌ సమ్మిట్లో ఆమె మాట్లాడారు.
‘ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయాలని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆఫర్ ఇచ్చారు. దీనిపై వారం పది రోజులపాటు ఆలోచించాక పోటీ చేయలేనని ఆయనకు చెప్పా. ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నావద్ద లేదు. ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా నాకు ఇబ్బందులున్నాయి. విజయావకాశాలపై పలు ప్రశ్నలు వచ్చాయి. మీరు ఫలానా సామాజిక వర్గమా, ఫలానా మతమా.. మీరు అక్కడి నుంచి వచ్చారా.. ఇక్కడి నుంచి వచ్చారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పా. నా ఈ వాదనను అధిష్ఠానం అంగీకరించింది’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక మంత్రికి ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు లేదా అని ప్రశ్నించగా.. అది దేశానికి సంబంధించిన డబ్బని, తనది కాదని సమాధానమిచ్చారు. ‘నా వేతనం, నా సంపాదన, నా పొదుపు డబ్బులే నావి. మిగతావి దేశం డబ్బు’ అని పేర్కొన్నారు. ఎన్నికల బాండ్లు చట్టబద్ధమైనవని, అన్ని పార్టీలూ వాటిని సొమ్ము చేసుకున్నాయని సీతారామన్ స్పష్టం చేశారు. అందువల్ల ఏ పార్టీకీ వాటిని విమర్శించే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాటిపై మరింత చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. మరింత మంచి విధానంతో తేవాల్సి ఉందని పేర్కొన్నారు. ‘పార్లమెంటులో చేసిన చట్టం ఆధారంగానే ఎన్నికల బాండ్ల విక్రయం సాగింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరికీ ఇచ్చారు. దీనిని కుంభకోణంగా అభివర్ణిస్తున్న పార్టీ కూడా ఎన్నికల బాండ్లను నగదుగా మార్చుకుంది. భాజపాకు విరాళాలిచ్చాక కూడా ఈడీ దాడులు ఆయా కంపెనీలపై జరిగాయి. దానికీ దీనికీ సంబంధం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..