డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.
సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు, సీఈఓ పరిశీలించాలి
ఈ వ్యవహారంపై ఆర్టీసీ వివరణ ఇవ్వాలి
తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండు
ఈనాడు డిజిటల్, అమరావతి: అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. విశాఖ డ్రగ్ కంటెయినర్ ఉదంతం మరవకముందే, రేణిగుంటలో డంప్ బయటపడిన 24 గంటల్లోనే తాడేపల్లి కంటెయినర్ వ్యవహారం బట్టబయలైందని ధ్వజమెత్తారు. గతంలో ఏ సీఎం ఇంటికైనా ఇలా కంటెయినర్లు వెళ్లిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఆ కంటెయినర్ ‘మేమంతా సిద్ధం’ యాత్రకు వంటపాత్రలు తరలించడానికి వచ్చిందని వైకాపా నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ‘తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన వాహనం విజయవాడ బస్టాండ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ఆగింది. అందులోంచి కరెన్సీ కట్టలతో నిండిన అట్టపెట్టెలను డిపో క్లర్క్ దించి, ఓ అధికారి ఛాంబర్లోకి తీసుకెళ్లారు’’ అని ఆరోపించారు.
స్మగ్లర్ విజయానందరెడ్డి సహకారంతోనే
‘‘ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి లాంటి వ్యక్తులకు ఆర్టీసీలో పదవులు కట్టబెట్టి ఆ సంస్థ ప్రతిష్ఠను జగన్ దిగజార్చారు. ఆయన సహకారంతోనే ఆర్టీసీని క్యాష్ స్మగ్లింగుకు వాడుకుంటున్నారు. ఆ కంటెయినర్లో వచ్చింది డబ్బో కాదో ఆర్టీసీ సమాధానం చెప్పాలి. బస్టాండు సీసీటీవీ ఫుటేజీలు బయటపెట్టాలి. పోలీసులు, ఈసీ బృందం, మీడియా అక్కడికి వెళ్తే అసలు విషయం బయటపడుతుంది. డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి నిజాయతీ ఉంటే ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలి’’ అని డిమాండు చేశారు.
ఏపీఎస్ఆర్టీసీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది?
‘‘దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు చేస్తుంటే ఇంత భారీగా కరెన్సీ కట్టలు వారి దగ్గరికి ఎలా చేరాయో ఏపీఎస్ఆర్టీసీ వివరణ ఇవ్వాలి. ‘మేమంతా సిద్ధం’ అంటూ ప్రచారసభలు నిర్వహిస్తున్న జగన్.. దేనికి సిద్ధం? మాదక ద్రవ్యాలు, నోట్ల కట్టల పంపిణీకా? ఈ కంటెయినర్ల వ్యవహారాలపై ప్రజలకు ఆయన ఏం సమాధానం చెబుతారు? ఈ ఘటనపై విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలి’’ అని పట్టాభిరామ్ డిమాండు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం