మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది.
ఇదీ వైకాపా పాలన తీరు
‘నిజం గెలవాలి’ యాత్రలో భువనేశ్వరి
ఈనాడు, ఏలూరు, విజయవాడ (హనుమాన్జంక్షన్)- న్యూస్టుడే: ‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే తెదేపా అధికారంలోకి రావాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె రెండో రోజు బుధవారం ‘నిజం గెలవాలి’ యాత్ర చేశారు. టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సాయంత్రం ఆమె కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బిళ్లనపల్లిలో పర్యటించి హనుమాన్జంక్షన్లో మాట్లాడారు. ఆయా సమావేశాల్లో జగన్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని వైకాపా గంజాయి రాజ్యంగా మార్చింది. విశాఖలో 25 వేల కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. అది గంజాయి రాజధానిగా మారింది. నీళ్లు రావటం లేదని స్థానిక వైకాపా నాయకులను ప్రశ్నించినందుకు ఓ మహిళ కళ్లు తీసేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టినందుకు చంద్రయ్య అనే రైతును హత్య చేశారు. వైకాపా పాలనలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మీ ఓటు ఉందో లేదో చూసుకోవాలి. దాంతోపాటు ఇళ్లు, పొలాలు ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీ నాయకులు వాటినీ మింగేస్తారు. మహిళలంతా తెదేపా, జనసేన, భాజపా కూటమికి ఓటెయ్యాలి. నిజాన్ని గెలిపించాలి’ అని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక అప్పట్లో చనిపోయిన టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం వాసి అబ్బదాసరి కృష్ణ, తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన కుంటి శేఖర్, పెంటపాడు మండలం పడమర విప్పర్రులో కోడి అప్పారావు, నిడమర్రులో గొర్రెల సుబ్బారావు కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. కృష్ణా జిల్లాలోని బిళ్లనపల్లిలో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎదురువాడ కిరణ్, సీనియర్ కార్యకర్త ఎదురువాడ బసవరావు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి