రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
జగన్ను అడుగడుగునా నిలదీయండి
ప్రాజెక్టుల్ని ఎండబెట్టారు... ‘సాక్షి’కి కూడబెట్టారు
జనం ఆవేదన అగ్నిలా మారి అరాచక వైకాపాను భస్మం చేయాలి
బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే బాధ్యత నాది
పలమనేరు, పుత్తూరు ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, చిత్తూరు, తిరుపతి: యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘సీఎం బస్సు యాత్రకు ఖాళీ రోడ్లు, ఇళ్లే స్వాగతం పలకాలి. బాబాయిపై గొడ్డలివేటు వేసిన అవినాశ్రెడ్డీ అదే బస్సులో ఉన్నారు. ఆయనకు జగన్ ఎంపీ టికెట్ ఇచ్చి ప్రజల్ని వెక్కించారు. 2014-19లో నేను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.65 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాం. ప్రత్యేకించి రాయలసీమలోనే రూ.12 వేల కోట్లు వెచ్చించాం. ఒక్క హంద్రీ-నీవా ప్రాజెక్టుకే రూ.4,200 కోట్లు ఇచ్చాం. తర్వాత ఐదేళ్లలో కేవలం రూ.2,165 కోట్లనే వైకాపా ప్రభుత్వం ఖర్చుపెట్టింది. 102 ప్రాజెక్టుల్ని రద్దు చేసింది. అవినీతిలో పుట్టిన సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో వందల కోట్ల రూపాయల్ని దోచిపెట్టారు’ అని చంద్రబాబు మండిపడ్డారు. డబ్బు వసూలుకు, దౌర్జన్యాలు చేసేందుకు నియమించుకున్న సలహాదారులకు సీమ సాగునీటి ప్రాజెక్టులపై పెట్టినదాని కన్నా ఎక్కువ మొత్తం ఇచ్చారని, అందుకే జగన్ను అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు, తిరుపతి జిల్లా పుత్తూరులో చంద్రబాబు బుధవారం ‘ప్రజాగళం’ సభలు నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
‘భాజపాతో కలిసిన మమ్మల్ని జగన్ విమర్శిస్తున్నారు. పొత్తు మా స్వార్థం కోసం కాదు. దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఎన్డీయేతో జట్టుకట్టాం. ఈ సీఎం రాష్ట్ర అప్పుల భారాన్ని రూ.12 లక్షల కోట్లకు పెంచారు. సంక్షేమ పథకాలు ఇవ్వలేని స్థితికి వచ్చారు. అభివృద్ధి నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో రాష్ట్రం సజావుగా ముందుకు సాగాలంటే కేంద్రం సహకారం అవసరం. అందుకే మూడు పార్టీలూ కలిశాయి’ అని చంద్రబాబు చెప్పారు. ‘ప్రజల్లో ఎక్కడ చూసినా ఆవేదన కనిపిస్తోంది. ఎన్నికల్లో అది అగ్నిగా మారి అరాచక వైకాపాను భస్మం చేయాలి. జగన్రెడ్డీ సిద్ధంగా ఉండు. నిన్ను నీ ప్రభుత్వాన్ని, కుర్చీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత మీ అహంకారం కూలిపోతుంది’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘కలలకు రెక్కలు.. పథకం కింద విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే బాధ్యత నాది. కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు పెరగవు. అన్న క్యాంటీన్లు మళ్లీ వస్తాయి. రూ.4 వేల పింఛన్ను మొదటి తేదీనే మీ ఇంటికి చేరుస్తాం. చేనేతల కోసం ప్రత్యేక విధానం తెస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పూజారులపైనా దాష్టీకం
‘వైకాపా పాలనలో ఎస్సీలను చంపి డోర్ డెలివరీలు చేశారు. మైనారిటీ అమ్మాయి మిస్బా ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది. బాగా చదువుకుని మొదటి ర్యాంకు తెచ్చుకుంటే దుర్మార్గులైన వైకాపా నాయకులు వేధించారు. లక్ష్యాన్ని చేరుకోలేనని బాధపడి ఆ చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. వైకాపాకు ఓటేస్తే మిస్బా కుటుంబానికి ఏం జరిగిందో.. మీకూ మీ పిల్లలకూ అదే జరుగుతుంది. కాకినాడ శివాలయంలో పూజారులపై వైకాపా నాయకుడు దాడికి పాల్పడితే రాజీ చేశారు. వైకాపా అంటేనే కొట్టడం, తిట్టడం, దూషించడం’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఆయన పేదవారా?
‘పేదలకు అన్నంపెట్టే అన్నక్యాంటీన్లను రద్దు చేసిన వ్యక్తి పేదవారా? బీద పిల్లల కోసం విదేశీ విద్య ఉన్నత పథకాన్ని తీసుకువస్తే దానిని అటకెక్కించిన వారు పేదవారా? బడుగుల కోసం మేం నిర్మించిన లక్షల ఇళ్లను నిరుపయోగంగా ఉంచిన వ్యక్తి పేదవారా?’ అని చంద్రబాబు విమర్శించారు. ‘దేశంలోని సీఎంలు అందరికీ ఎంత ఆస్తి ఉందో అంతకంటే ఎక్కువ సంపాదించారు ఈ ముఖ్యమంత్రి. పేదలను మరింత నిరుపేదలుగా మారుస్తున్న పెత్తందారు జగన్’ అని దుయ్యబట్టారు.
విద్యుత్తు సరఫరాకు అంతరాయం
పలమనేరు సభలో కొంతసేపు మైకులు పనిచేయలేదు. మొదట సాంకేతిక లోపమని భావించారు. మైకుల కేబుల్ కనెక్టర్ను ఎవరో పగలగొట్టారని తర్వాత గుర్తించారు. దీనిని వైకాపా దుశ్చర్యగా తెదేపా నాయకులు అనుమానిస్తున్నారు. మరో కేబుల్ కనెక్టర్ సాయంతో సభను కొనసాగించారు. పుత్తూరులో మధ్యాహ్నం 3.30 గంటలకు బహిరంగ సభకు చంద్రబాబు వచ్చే సమయానికి విద్యుత్తు నిలిచిపోయింది. సాయంత్రం ఐదు గంటలకు ఆయన సభ ముగించి వెళ్లే దాకా సరఫరాను పునరుద్ధరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి