రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
జగన్ను అడుగడుగునా నిలదీయండి
ప్రాజెక్టుల్ని ఎండబెట్టారు... ‘సాక్షి’కి కూడబెట్టారు
జనం ఆవేదన అగ్నిలా మారి అరాచక వైకాపాను భస్మం చేయాలి
బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే బాధ్యత నాది
పలమనేరు, పుత్తూరు ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, చిత్తూరు, తిరుపతి: యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘సీఎం బస్సు యాత్రకు ఖాళీ రోడ్లు, ఇళ్లే స్వాగతం పలకాలి. బాబాయిపై గొడ్డలివేటు వేసిన అవినాశ్రెడ్డీ అదే బస్సులో ఉన్నారు. ఆయనకు జగన్ ఎంపీ టికెట్ ఇచ్చి ప్రజల్ని వెక్కించారు. 2014-19లో నేను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.65 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాం. ప్రత్యేకించి రాయలసీమలోనే రూ.12 వేల కోట్లు వెచ్చించాం. ఒక్క హంద్రీ-నీవా ప్రాజెక్టుకే రూ.4,200 కోట్లు ఇచ్చాం. తర్వాత ఐదేళ్లలో కేవలం రూ.2,165 కోట్లనే వైకాపా ప్రభుత్వం ఖర్చుపెట్టింది. 102 ప్రాజెక్టుల్ని రద్దు చేసింది. అవినీతిలో పుట్టిన సాక్షి పత్రికకు ప్రకటనల రూపంలో వందల కోట్ల రూపాయల్ని దోచిపెట్టారు’ అని చంద్రబాబు మండిపడ్డారు. డబ్బు వసూలుకు, దౌర్జన్యాలు చేసేందుకు నియమించుకున్న సలహాదారులకు సీమ సాగునీటి ప్రాజెక్టులపై పెట్టినదాని కన్నా ఎక్కువ మొత్తం ఇచ్చారని, అందుకే జగన్ను అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా పలమనేరు, తిరుపతి జిల్లా పుత్తూరులో చంద్రబాబు బుధవారం ‘ప్రజాగళం’ సభలు నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
‘భాజపాతో కలిసిన మమ్మల్ని జగన్ విమర్శిస్తున్నారు. పొత్తు మా స్వార్థం కోసం కాదు. దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఎన్డీయేతో జట్టుకట్టాం. ఈ సీఎం రాష్ట్ర అప్పుల భారాన్ని రూ.12 లక్షల కోట్లకు పెంచారు. సంక్షేమ పథకాలు ఇవ్వలేని స్థితికి వచ్చారు. అభివృద్ధి నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో రాష్ట్రం సజావుగా ముందుకు సాగాలంటే కేంద్రం సహకారం అవసరం. అందుకే మూడు పార్టీలూ కలిశాయి’ అని చంద్రబాబు చెప్పారు. ‘ప్రజల్లో ఎక్కడ చూసినా ఆవేదన కనిపిస్తోంది. ఎన్నికల్లో అది అగ్నిగా మారి అరాచక వైకాపాను భస్మం చేయాలి. జగన్రెడ్డీ సిద్ధంగా ఉండు. నిన్ను నీ ప్రభుత్వాన్ని, కుర్చీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత మీ అహంకారం కూలిపోతుంది’ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ‘కలలకు రెక్కలు.. పథకం కింద విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే బాధ్యత నాది. కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్తు ఛార్జీలు పెరగవు. అన్న క్యాంటీన్లు మళ్లీ వస్తాయి. రూ.4 వేల పింఛన్ను మొదటి తేదీనే మీ ఇంటికి చేరుస్తాం. చేనేతల కోసం ప్రత్యేక విధానం తెస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పూజారులపైనా దాష్టీకం
‘వైకాపా పాలనలో ఎస్సీలను చంపి డోర్ డెలివరీలు చేశారు. మైనారిటీ అమ్మాయి మిస్బా ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది. బాగా చదువుకుని మొదటి ర్యాంకు తెచ్చుకుంటే దుర్మార్గులైన వైకాపా నాయకులు వేధించారు. లక్ష్యాన్ని చేరుకోలేనని బాధపడి ఆ చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. వైకాపాకు ఓటేస్తే మిస్బా కుటుంబానికి ఏం జరిగిందో.. మీకూ మీ పిల్లలకూ అదే జరుగుతుంది. కాకినాడ శివాలయంలో పూజారులపై వైకాపా నాయకుడు దాడికి పాల్పడితే రాజీ చేశారు. వైకాపా అంటేనే కొట్టడం, తిట్టడం, దూషించడం’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఆయన పేదవారా?
‘పేదలకు అన్నంపెట్టే అన్నక్యాంటీన్లను రద్దు చేసిన వ్యక్తి పేదవారా? బీద పిల్లల కోసం విదేశీ విద్య ఉన్నత పథకాన్ని తీసుకువస్తే దానిని అటకెక్కించిన వారు పేదవారా? బడుగుల కోసం మేం నిర్మించిన లక్షల ఇళ్లను నిరుపయోగంగా ఉంచిన వ్యక్తి పేదవారా?’ అని చంద్రబాబు విమర్శించారు. ‘దేశంలోని సీఎంలు అందరికీ ఎంత ఆస్తి ఉందో అంతకంటే ఎక్కువ సంపాదించారు ఈ ముఖ్యమంత్రి. పేదలను మరింత నిరుపేదలుగా మారుస్తున్న పెత్తందారు జగన్’ అని దుయ్యబట్టారు.
విద్యుత్తు సరఫరాకు అంతరాయం
పలమనేరు సభలో కొంతసేపు మైకులు పనిచేయలేదు. మొదట సాంకేతిక లోపమని భావించారు. మైకుల కేబుల్ కనెక్టర్ను ఎవరో పగలగొట్టారని తర్వాత గుర్తించారు. దీనిని వైకాపా దుశ్చర్యగా తెదేపా నాయకులు అనుమానిస్తున్నారు. మరో కేబుల్ కనెక్టర్ సాయంతో సభను కొనసాగించారు. పుత్తూరులో మధ్యాహ్నం 3.30 గంటలకు బహిరంగ సభకు చంద్రబాబు వచ్చే సమయానికి విద్యుత్తు నిలిచిపోయింది. సాయంత్రం ఐదు గంటలకు ఆయన సభ ముగించి వెళ్లే దాకా సరఫరాను పునరుద్ధరించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా