ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు.
ఈనాడు, అమరావతి: ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. జిందాల్ కంపెనీకి అప్పగించొద్దని పేర్కొన్నారు. ‘‘ఒంగోలు గ్రామీణ మండలం యర్రజర్ల, టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపాడు, కందులూరు గ్రామాల పరిధిలోని 1,307 ఎకరాల లోగ్రేడ్ మాగ్నటైట్ ఇనుప ఖనిజ నిక్షేపాలను జిందాల్కు అప్పగించడం సరికాదు. విశాఖ ఉక్కు కర్మాగారం అవసరమని కోరినప్పటికీ కేటాయించకపోవడం రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించే చర్య. జిందాల్కు కేటాయించడాన్ని ఆపి, విశాఖ ఉక్కుకు కేటాయించాలి. ఇక్కడ ఉన్న ఖనిజంలో 30శాతం ఇనుప ఖనిజం ఉంటుంది. బెనిఫికేషన్ ద్వారా ఐరన్ కంటెంట్ పెంచి ఉక్కు తయారీకి వినియోగిస్తారు. 2003 ధరల ప్రకారం ప్రపంచ మార్కెట్లో ఇనుప ఖనిజం టన్ను ధర రూ.4,083 ఉంది. 11శాతం వాటా కింద ఖనిజాభివృద్ధి సంస్థకి టన్నుకు రూ.449.13, జిందాల్ కంపెనీకి 89 శాతం వాటా ప్రకారం రూ.3,638.97 వస్తుంది. 50లక్షల టన్నులు తవ్వితే ఖనిజాభివృద్ధి సంస్థకు రూ.224.56కోట్లు, జిందాల్కు రూ.1,816.93కోట్లు రాబడి వస్తుంది. భారీ లాభాలు జిందాల్కు దక్కుతాయి. దీంతో రాష్ట్ర సంపదను అక్రమంగా జిందాల్కు అప్పగించడమే అవుతుంది. వెంటనే జిందాల్తో ఒప్పందం రద్దు చేసుకోవాలి’’ అని సూచించారు.
అర్చకుడిపై దాడి చేసిన నేతపై చర్యలు తీసుకోవాలి
కాకినాడ శివాలయంలో పూజారి వెంకట సత్యసాయిని అసభ్యపదజాలంతో దూషిస్తూ చెంపపై కొట్టి, కాలితో తన్నిన వైకాపా మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావుని తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ‘‘అధికార దర్పంతో దేవాలయ పూజారులపై దాడులు చేయడం, దుర్భాషలాడే వారిపట్ల ఉదాసీనంగా వ్యవహరించడం తగదు. దాడికి పాల్పడిన వైకాపా మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావుని అరెస్టు చేయకుండా రహస్యంగా క్షమాపణ చెప్పించడం విడ్డూరంగా ఉంది. తాను క్షమాపణ చెప్పలేదని చంద్రరావు బహిరంగంగా ప్రకటించడం, ప్రాణహాని ఉందని పూజారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం చూస్తుంటే నామమాత్రపు 47ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం బాధితులకు విశ్వాసం కలిగించదు. పూజారి కుటుంబానికి రక్షణ కల్పించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం