ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 99.8% పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది.
ప్రశాంతంగా మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉపఎన్నిక
ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 2న
ఈనాడు, మహబూబ్నగర్- కొడంగల్, న్యూస్టుడే: మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 10 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 1,439 మందికిగాను 1,437 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 99.86 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు కూడా ఎక్స్అఫిషియో హోదాలోనే ఓటేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైనా చాలాసేపటి వరకు ఎవరూ రాలేదు. ప్రధాన పార్టీలకు చెందిన ఓటర్లు గోవా, ఏపీ, కర్ణాటక, తమిళనాడులలో ఏర్పాటు చేసిన శిబిరాలకు వెళ్లడంతో నేరుగా అక్కడి నుంచే పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో వచ్చారు.
పార్టీల వారీగా మూకుమ్మడిగా చేరుకున్నారు. నాగర్కర్నూల్ పోలింగ్ బూత్ పరిధిలో బిజినేపల్లి మండలం గుడ్లనర్వ ఎంపీటీసీ సభ్యురాలు శారద, నారాయణపేట పోలింగ్ బూత్ పరిధిలో మక్తల్ మండలం మంథన్గోడ్ ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర మాత్రమే ఓటుహక్కును వినియోగించుకోలేదు. వనపర్తి జిల్లా ఎదులా-1 ఎంపీటీసీ సభ్యుడు నరేందర్ 2 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ముందుగానే ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పొంది ఆసుపత్రి నుంచి అంబులెన్సులో నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చి భార్య కవిత ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గద్వాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, సీఐ భీంకుమార్ మధ్య వాగ్వాదం జరిగింది. తమ పార్టీకి చెందిన ఓటరు చక్రాలకుర్చీలో వస్తున్నారని వేచి చూస్తున్న ఎమ్మెల్యేను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సీఐ చెప్పడం వివాదానికి దారితీసింది. ఏఎస్పీ వచ్చి సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డి, భారాస అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి పలుచోట్ల ఓటింగ్ సరళిని పరిశీలించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్ నుంచి ఎన్నికల అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగ్ తీరును పర్యవేక్షించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం మహబూబ్నగర్ బాలుర జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంకు బ్యాలెట్ పెట్టెలను తరలించారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు