చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్పై కేసు
ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు బుధవారం చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గృహ నిర్బంధం
పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించిన కిషన్రెడ్డి
బోడుప్పల్, ధూల్పేట- న్యూస్టుడే, ఈనాడు-హైదరాబాద్: ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు బుధవారం చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ప్రాంతానికి వెళ్లబోయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను అడ్డుకుని గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ రెండు ఘటనల్లో పోలీసుల చర్యను తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు.
సంజయ్పై నాచారం ఇన్స్పెక్టర్ ఫిర్యాదు
బండి సంజయ్ బుధవారం చెంగిచర్లకు వచ్చిన సందర్భంలో జరిగిన తోపులాటలో పోలీసు సిబ్బంది గాయపడ్డారంటూ నాచారం ఇన్స్పెక్టర్ నందీశ్వర్రెడ్డి మేడిపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనుమతి లేని ప్రదేశానికి రావడంతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలను తీసుకురావడంతో పోలీసు విధులకు ఆటంకం కలిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ జరిగిన తోపులాటలో పోచారం ఇన్స్పెక్టర్ రాజు, ఎస్సై లక్ష్మణ్, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో బండి సంజయ్తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రభాకర్రెడ్డి తెలిపారు.
నన్ను అడ్డుకోవడం అన్యాయం: రాజాసింగ్
భారాస ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ సర్కారులోనూ హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా ప్రభుత్వాలు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయనడానికి చెంగిచెర్లలో జరిగిన దాడే నిదర్శనమన్నారు. బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన తనను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేయడం అన్యాయమంటూ రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు.
పోలీసులది ఏకపక్ష ధోరణి: కిషన్రెడ్డి
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్పై కేసు పెట్టడం, ఎమ్మెల్యే రాజాసింగ్ని గృహ నిర్బంధం చేయడంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘భాజపా నాయకులపై ఆంక్షలు విధించడం ఏమిటి? ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, అక్రమ అరెస్టులు, కేసులతో అడ్డుకోవడమేనా’’ అని ప్రశ్నించారు. చెంగిచెర్లలో కబేళా తొలగించి, భాజపా నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!