రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం నేడు
కాంగ్రెస్ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(పీఈసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది.
హాజరుకానున్న మంత్రులు, ఇతర ముఖ్యనేతలు
తుక్కుగూడ సభ, ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చ
హైదరాబాద్, న్యూస్టుడే: కాంగ్రెస్ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(పీఈసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, ఏఐసీసీ ఇన్ఛార్జి కార్యదర్శులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికలు, ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభ, ఇప్పటివరకు ఖరారైన ఎంపీ స్థానాలు, వంద రోజుల పాలన తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏఐసీసీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆవిష్కరిస్తారు. కాంగ్రెస్ 5 గ్యారంటీలను ఇదే వేదికపై ప్రకటించనున్నారు.
ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు...
అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడ నుంచే ప్రచారానికి శంఖారావం పూరించారు. ఇక్కడి సభావేదిక నుంచే సోనియా గాంధీ 6 గ్యారంటీలు ప్రకటించారు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తుక్కుగూడను పార్టీ సెంటిమెంట్గా భావిస్తోంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న తుక్కుగూడ బహిరంగ సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. సభ విజయవంతానికి ఏర్పాట్లు, నిర్వహణ కమిటీలు, జనసమీకరణ తదితర అంశాలపై శుక్రవారం జరిగే పీఈసీ సమావేశంలో నేతలకు రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.