భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
వరంగల్ బరి నుంచి వైదొలగిన కడియం కావ్య
కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అవకాశం
హస్తం గూటికి చేరనున్నట్లు ప్రకటించిన కేకే
30న తాను చేరుతున్నానన్న మేయర్ విజయలక్ష్మి
ఈనాడు, హైదరాబాద్, వరంగల్: లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
మరోవైపు సీనియర్ నాయకుడు భారాస రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ జి.విజయలక్ష్మి భారాసను వీడి కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ప్రకటించారు. గురువారం ఒకేరోజు చోటుచేసుకున్న ఈ పరిణామాలు భారాసలో కలకలం రేపాయి.
పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు కేసీఆర్కు కావ్య లేఖ
భారాస స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆయన కుమార్తె కావ్య పోటీ నుంచి వైదొలగడం గమనార్హం. ఈ మేరకు ఆమె భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్ట్యాపింగ్, లిక్కర్ స్కాం వంటివి భారాస ప్రతిష్ఠను దిగజార్చాయని, జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటం పార్టీకి మరింత నష్టం చేసిందని, ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని.. కేసీఆర్, భారాస కార్యకర్తలు తనను మన్నించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. మూడు రోజుల క్రితమే కావ్య హైదరాబాద్లో కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి తనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపి.. అంతలోనే బరి నుంచి తప్పుకొంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశం ఉందని సమాచారం. కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే.. శ్రీహరిని కాంగ్రెస్లో చేర్చుకుని, రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
పూర్వ పార్టీలోకి వెళతా: కేకే
రాజకీయ విరమణ దశలో ఉన్న తాను.. తిరిగి తన పూర్వపార్టీలో చేరాలనుకుంటున్నట్లు కేకే స్వయంగా వెల్లడించారు. కాంగ్రెస్లో ఎప్పుడు చేరతాననే నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం భారాస అధినేత కేసీఆర్తో కేశవరావు భేటీ అయ్యారు. అనంతరం రాత్రి హైదరాబాద్లో తన నివాసం వద్ద మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘నేను సుదీర్ఘ కాలం కాంగ్రెస్లో ఉన్నా. ఆ పార్టీ నాకు అన్ని అవకాశాలూ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అప్పటి పరిస్థితుల్లో తెరాస(ప్రస్తుత భారాస)లో చేరా. కోరుకున్నట్లుగా తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. ఆయనపై నాకూ గౌరవం ఉంది. భారాస నేతలు, కార్యకర్తలు బాగా సహకరించారు. ఇప్పుడు నేను రాజకీయ విరమణ దశలో ఉన్నా. భారాసలో యువతకు మరిన్ని అవకాశాలు రావాలి. 84 ఏళ్ల వయసులో తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లాలనుకుంటున్నా. తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా తిరిగి ఇంటికే చేరతారు. నేను కూడా నా సొంత ఇల్లులాంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నా. 53 ఏళ్లు కాంగ్రెస్లో పనిచేశా. భారాసలో పనిచేసింది పదేళ్లే. నేను పుట్టింది.. పెరిగింది.. కాంగ్రెస్లోనే. భారాసకు సంబంధించిన అంశాలపై కేసీఆర్తో చర్చించాను. పార్టీ అంతర్గత విషయాలపైనా చర్చ జరిగింది. కవిత అరెస్టుపై కూడా మాట్లాడుకున్నాం. ఆమెను అక్రమంగా అరెస్టు చేశారు. భారాసలోనే కొనసాగాలని నా కుమారుడు విప్లవ్ తీసుకున్న నిర్ణయం మంచిదే’’ అని కేశవరావు అన్నారు. ఇటీవల కేశవరావు ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ.. కేకేతోపాటు ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారు భారాసను వీడి కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం అప్పటి నుంచే జరుగుతోంది. తాజాగా గురువారం కేకే నిర్ణయంతో అది ఖరారైంది. తండ్రితో పాటు విలేకరుల ఇష్టాగోష్ఠిలో పాల్గొన్న మేయర్ విజయలక్ష్మి తాను ఈ నెల 30న సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు వెల్లడించారు. ‘అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయి. సమస్యలు పరిష్కరించడం సులువు’ అని ఆమె తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంపై పూర్తి నమ్మకం: విప్లవ్కుమార్
కేకే కుమారుడు విప్లవ్కుమార్ తన సోదరి విజయలక్ష్మి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ‘‘భారాసలో చేరిన తక్కువ సమయంలోనే విజయలక్ష్మికి పార్టీ మంచి అవకాశాలిచ్చింది. జీహెచ్ఎంసీ మేయర్ను చేసింది. ఆమె మాత్రం భారాసకు వెన్నుపోటు పొడిచారు. పార్టీ మారాలని విజయలక్ష్మి, కేకే తీసుకున్న నిర్ణయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కుమార్తె ఒత్తిడి మేరకే మా నాన్న కేకే భారాసను వీడుతున్నారని నమ్ముతున్నా. మా పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. భారాసలోనే కొనసాగుతా’’ అని ఒక ప్రకటనలో తెలిపారు.
కేకేపై కేసీఆర్ అసహనం!
ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గురువారం భారాస అధినేత కేసీఆర్తో కేశవరావు భేటీ అయ్యారు. తాను పార్టీ మారుతున్నట్లు కేసీఆర్తో కేకే చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కేకే తీరుపై భారాస అధినేత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పదేళ్లు అధికారం, పదవులు అనుభవించి.. ఇప్పుడు పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని.. మీ ఆలోచన మార్చుకోవాలని కేకేకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. సమావేశం అనంతరం కేకే తిరిగి హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు. మరోవైపు గురువారం మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్రెడ్డి కేకే నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.
భారాసను వీడి.. ఇతర పార్టీల గూటికి చేరి...
ఇప్పటికే పలువురు నేతలు భారాసను వీడి కాంగ్రెస్, భాజపాలలో చేరారు. భారాస చేవెళ్ల సిటింగ్ ఎంపీ రంజిత్రెడ్డి కాంగ్రెస్లోకి చేరి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్సభ బరిలో నిలిచారు. వికారాబాద్ జడ్పీ ఛైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరగా.. ఆమెకు మల్కాజిగిరి టికెట్ లభించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారపార్టీలో చేరి, సికింద్రాబాద్ లోక్సభ టికెట్ దక్కించుకున్నారు. జహీరాబాద్ భారాస ఎంపీ బీబీపాటిల్ భాజపాలో చేరిన వెంటనే ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్కర్నూల్ భారాస ఎంపీ పి.రాములు భాజపాలో చేరగా.. ఆయన కుమారుడికి టికెట్ లభించింది. మాజీ ఎంపీలు జి.నగేశ్, అజ్మీరా సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సైదిరెడ్డిలు ఇప్పటికే భాజపా కండువా కప్పుకొన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ హస్తం గూటికి చేరారు. వరంగల్ నుంచి టికెట్ను ఆశించిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ సైతం కారు దిగి కమలం పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి భారాస కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమయ్యాయి. మరికొందరు ఎమ్మెల్యేలు సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ను కలిసి కాంగ్రెస్లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రకటనల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.. మంత్రులకు చంద్రబాబు సూచన
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడం... వంటి మంచి పనుల్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. -
సకుటుంబ సమేతంగా కేసులు.. అక్రమ కేసులున్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు
వివాహాలు, ఇతర శుభకార్యాలకు సకుటుంబ సపరివార సమేతంగా రావాలని ఆహ్వానిస్తుంటాం.. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై సకుటుంబ సమేతంగా అక్రమ కేసులు నమోదు చేసి వేధించారని చంద్రబాబు, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా.. వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలపై నమోదైన అక్రమ కేసుల సంఖ్యను చంద్రబాబు ప్రస్తావించారు. -
ఏపీ ‘ఎస్కోబార్’ జగన్.. చీకటి సామ్రాజ్యాధిపతితో పోల్చిన చంద్రబాబు
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అరాచకాలను వివరించేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు కొలంబియన్ మాదకద్రవ్యాల చీకటి సామ్రాజ్యాధిపతి పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ చరిత్రను సభకు వినిపించారు. -
‘రఘురామను చిత్రహింసలు పెట్టినప్పుడు మీరంతా ఏమయ్యారు?’
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిల్లీలో చేసిన నిరసనకు ఇండియా కూటమి నాయకులు మద్దతు పలకడాన్ని అనంతపురం తెదేపా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. -
అన్ని వర్గాలకూ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. -
శాంతిభద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు.. రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై శాసనసభలో ఒక రోజు పూర్తిగా చర్చించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. -
ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని దోచేశారు
‘వైకాపా ప్రభుత్వం చేసిన నిర్వాకాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్తు, అమరావతి, పోలవరం, గనులు, మద్యంపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. -
వైకాపా ప్రభుత్వం ఇళ్లు కూల్చింది.. ఆదుకోండి
తెదేపాకు అనుకూలంగా ఉన్నారని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దన్నానపేట గ్రామానికి చెందిన 30 మంది దళితుల ఇళ్లను అప్పటి వైకాపా ప్రభుత్వం కూల్చేసిందని ఆ మండల తెదేపా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు టొంపల నర్సయ్య గురువారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో తెదేపా శ్రేణులపై 2,560 కేసులు
వైకాపా హయాంలో గత ఐదేళ్లలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై 2,560 కేసులు నమోదు చేసి.. 2,370 మందిని అరెస్టు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. -
ఇసుక, మద్యం అవినీతిపై విచారణ జరిపించాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో గురువారం సీపీఎం నాయకులు కలిశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
సమస్యలపై ప్రశ్నిస్తే.. వేధింపులే సమాధానం
శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం విడుదల చేసిన ‘శాంతిభద్రతల శ్వేతపత్రం’పై కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వేదికగా మాట్లాడారు. -
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే జగన్ దిల్లీ యాత్ర
‘ఇండియా’ కూటమితో పొత్తు కోసమే వైకాపా అధ్యక్షుడు జగన్ దిల్లీ వెళ్లినట్లుగా ఉందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. దిల్లీ నుంచి అమరావతి చేరుకున్న జగన్... శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. -
ఇది పసలేని దండగమారి బడ్జెట్: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం పసలేని, దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
బడ్జెట్లో అధిక కేటాయింపుల ద్వారా.. తమది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నట్లయిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. -
ఫైళ్ల దహనంతో మాకు సంబంధం లేదు: వైకాపా ఎంపీ మిథున్రెడ్డి
మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. -
గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతాం: మంత్రి నిమ్మల
సంజీవయ్య గాజులదిన్నె ప్రాజెక్టు పనులపై విచారణ చేపడతామని జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. -
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే జగన్ దిల్లీ నిరసన: హోంమంత్రి అనిత
రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయడానికే మాజీ సీఎం జగన్ దిల్లీలో నిరసన పేరుతో చౌకబారు ఆరోపణలు చేశారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని నిస్సిగ్గుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. -
వరద బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి
కోస్తా జిల్లాల్లోని వరద బాధిత రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గురువారం లేఖ రాశారు. -
రైతుల జీవితాలతో చెలగాటం వద్దు!
‘ఎన్నికలు అయిపోయాయి.. రాజకీయాలు వదిలేయండి.. రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
సంతోషదాయక బడ్జెట్: కూనంనేని
నిధుల పరంగా రాష్ట్రం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంతోషదాయకంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!