బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది.
వివేకా హత్య కేసులో జగన్ది రోజుకో అబద్ధం
అయిదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారు
46 రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్ బద్దలవుతుంది
రాప్తాడు, శింగనమల, కదిరి ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. అదనంగా వసూలు చేస్తున్న రూ.140 తాడేపల్లి ప్యాలెస్కు వెళ్తున్నాయి. ఈ జలగ మీ రక్తాన్ని తాగుతూనే ఉంటుంది. ఎన్నికల ముందు మద్యనిషేధం అని ఇప్పుడు ఏమొహం పెట్టుకుని ఓటు అడుగుతున్నారో నిలదీయండి. తన ఆదాయం కోసం నాసిరకం మద్యాన్ని అమ్మి ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేసిన దుర్మార్గుడు జగన్మోహన్రెడ్డి.’’
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
ఈనాడు డిజిటల్, అనంతపురం: సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య విషయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆడుతున్న నాటకాలు బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిని మించేలా ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసులో జగన్ రోజుకో అబద్ధం చెబుతూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు, శింగనమల, కదిరిలో గురువారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘2019 మార్చి 15న సాక్షి టీవీలో వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారన్నారు. తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులన్నారు. తర్వాత గొడ్డలిపోటు అంటూ నారాసుర రక్తచరిత్ర పేరుతో నా చేతిలో కత్తిపెట్టి సాక్షిలో వార్త ప్రచురించారు. తర్వాత బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్ వివాదమే హత్యకు కారణమన్నారు. బాబాయి హత్యను రాజకీయంగా ఉపయోగించుకున్నారు. అధికారంలోకి రాకముందు సీబీఐ విచారణ కావాలని, అధికారంలోకి వచ్చాక వద్దని కేసు విత్డ్రా చేసుకున్నారు. జగన్ను నమ్మి మోసపోయానని వివేకా కుమార్తె పోరాటం మెదలుపెడితే.. రెండో వివాహం కారణమని, ఆస్తి కోసం కుమార్తె, అల్లుడే చంపారని నిందలు వేస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్లు ప్రశ్నిస్తుంటే వారిని నేనే నడిపిస్తున్నానని నాటకాలాడుతున్నారు. సొంత చెల్లెలిపైనే వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేయిస్తున్నారు. తనను ప్రశ్నించిన వారందరినీ వేధింపులకు గురిచేస్తున్న జగన్ ఓ మానసిక రోగి. జగన్ సిద్ధంగా ఉండు.. నిన్ను, నీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు సిద్ధమయ్యారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టేరోజు దగ్గర్లోనే ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
జగన్ అహంకారి, మానసిక రోగి..
‘‘జగన్ తానెప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటానని పదేపదే చెబుతుంటారు. ఎందుకంటే.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి, పోలవరాన్ని పాతిపెట్టిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. దారుణమైన రోడ్లు, నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్, రైతు ఆత్మహత్యలు, నాసిరకం మద్యం, నిత్యావసరాల పెరుగుదల వంటివి తలుచుకున్న ప్రతిసారీ జగన్ గుర్తొస్తారు. రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసి... రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి జగన్. అందరినీ వేధించి ఆనందం పొందుతున్న మానసిక రోగి జగన్.. ఒక్కఛాన్స్ అని తలపై చేతులు పెట్టి ముద్దులిచ్చిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత పిడిగుద్దులు కురిపిస్తున్నారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకునే జలగ జగన్. ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి.. రూ.200 ఉన్న బిల్లును రూ.1,000 చేశారు. విద్యుత్తు ఛార్జీలు తొమ్మిదిసార్లు పెంచారు. 2019లో ఫ్యాన్కు ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు అదే ఫ్యాన్కు ఉరివేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అయిదేళ్ల తెదేపా ప్రభుత్వంలో ఒకసారి కూడా విద్యుత్తు ఛార్జీలు పెంచలేదు’’ అని తెదేపా అధినేత వివరించారు.
ఏమి కోల్పోయారో ఆలోచించండి
‘‘ఈ ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకం. అందుకే మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. మేము కలిసింది అయిదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం. మహిళల రక్షణ, బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవం కోసం కలిసి వస్తున్నాం. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం మాకు మద్దతివ్వాలని కోరుతున్నాం. నిన్నటి వరకు బెదిరించారు. కేసులు పెట్టారు. ఇప్పుడెవరూ భయపడక్కర్లేదు. ఎన్నికల కమిషన్ వచ్చింది. మీ ప్రాణాలకు నా ప్రాణమిచ్చి ప్రజానీకాన్ని కాపాడుతా. అయిదేళ్లలో మీరు ఏం కోల్పోయారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక అహంకారి విధ్వంసంతో రాష్ట్రాన్ని లూటీ చేసి పేదలను నిరుపేదలుగా చేసిన దుర్మార్గుడి అంతుచూసే సమయం ఆసన్నమైంది’’ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.
దళితుల గొంతుకోశారు..
‘‘దళితులకు న్యాయం చేస్తానని చెప్పి గొంతుకోసిన వ్యక్తి జగన్. తెదేపా ప్రభుత్వంలో 27 పథకాలు తీసుకొస్తే.. అన్నింటినీ రద్దుచేసి దళితులకు ద్రోహం చేశారు. దళితులకు ఎక్కడా స్వాతంత్య్రం లేదు. విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నారు. నాలుగున్నరేళ్లలో దళితులపై ఆరువేలకుపైగా కేసులు పెట్టారు. 188 మంది దళితులను వేధింపులకు గురిచేసి చంపేశారు. కాకినాడలో దళితుడిని చంపి డోర్డెలివరీ చేశారు. సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెదేపా. 1996-97లో ఎస్సీల్లో అందరికీ న్యాయం చేయాలని ఏబీసీడీ వర్గీకరణ తీసుకొస్తే వాటిని కాపాడలేని వ్యక్తి రాజశేఖరరెడ్డి. వర్గీకరణకు ఇప్పుడు ఎన్డీయే సహకరిస్తోంది. మాల, మాదిగ, రెల్లి కులస్తులకు న్యాయం చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.
మెగాడీఎస్సీపై తొలి సంతకం
‘‘అనంతకు కియా తీసుకురావడం, యువతకు ఉపాధి కల్పించడం తెదేపా బ్రాండ్ అయితే... జాకీ పారిపోయేలా చేయడం, పెట్టుబడులను తరిమేయడం జగన్ బ్రాండ్. తెదేపా అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే. ఉద్యోగాల్లేకుండా జే బ్రాండ్ మద్యం, గంజాయి, డ్రగ్స్ అందుబాటులోకి తెచ్చాడు. దుర్మార్గుడి పాలనలో సమాజం చెడిపోయింది. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్తకాదు. సమైక్యాంధ్రప్రదేశ్లో దాదాపు తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. మళ్లీ రెండు రాష్ట్రాలు కలిస్తే తప్ప ఈ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేరు. వైకాపా ప్రభుత్వంలో అందరూ నష్టపోయారు. తెదేపాను గెలిపిస్తే మీ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటాను’’ అని చంద్రబాబు చెప్పారు.
మైనారిటీల అభ్యున్నతికి కృషి చేసింది తెదేపానే
‘‘పేదలకు సహాయం చేయాలని ఖురాన్ చెబుతుంది. ఆ సిద్ధాంతాన్నే తెలుగుదేశం నమ్ముతుంది. ఎన్డీయేలో వాజ్పేయీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 13 జిల్లాల్లో ఉర్దూను రెండోభాషగా చేసింది తెదేపానే. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ, హజ్హౌస్ ఏర్పాటుచేశారు. మైనారిటీల్లో ఎక్కువశాతం పేదవాళ్లు ఉన్నారని వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది నందమూరి తారకరామారావు. రంజాన్ తోఫా ఇచ్చాం. మైనారిటీ ఆడపిల్లల వివాహాల కోసం 33వేల మందికి దుల్హాన్ పథకం ద్వారా సహాయం చేశాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వైకుంఠం ప్రభాకరచౌదరి, కందికుంట వెంకటప్రసాద్, హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు బీవీ వెంకట్రాముడు, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్, శింగనమల అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, పెనుకొండ అభ్యర్థి సవిత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ధైర్యముంటే అసెంబ్లీకి రా!
‘వైకాపా హయాంలో జరిగిన విధ్వంసం, అరాచక పాలనపై మేం శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. జగన్కు నిజంగా ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి.. మీరు చెబుతున్నది సరైనది కాదు. అసలు వాస్తవమిది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవిగో అంటూ చూపించాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు. -
రాష్ట్ర అప్పు రూ.12 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యంలేదు
‘అధికారంలోకి రాగానే రాష్ట్ర అప్పుల వివరాలు అడిగితే అధికారులు రూ.6లక్షల కోట్లు అన్నారు. ప్రస్తుతం ఇది రూ.9.75లక్షల కోట్లకు చేరింది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)లో లెక్కలు సరిగ్గా నమోదు చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. -
‘విద్యా కానుక’ అమలు చేస్తాం
రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని అమలు చేసి తీరుతామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చిన బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే.. అదే పాఠశాల, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎవరేమన్నారంటే..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వివిధ అంశాలపై వారు ఏమన్నారంటే.. -
పంచాయతీరాజ్లో గత ప్రభుత్వ అరాచకాలెన్నో..
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన ఆర్థిక అరాచకాలపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని ఆ శాఖ మంత్రి పవన్కల్యాణ్ అభిప్రాయపడ్డారు. చర్చకు కనీసం నాలుగైదు గంటల సమయం అవసరమని పేర్కొన్నారు. -
రాజ్యాంగ అధిపతైన మీతోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పించింది
‘ఉభయ సభలనుద్దేశించి మీరు చేసిన ప్రసంగంలో.. రాష్ట్ర అప్పులు రూ.10లక్షల కోట్లు ఉన్నాయంటూ మీతో ఎన్డీయే కూటమి ప్రభుత్వం చెప్పించింది. ఈ మొత్తం వాస్తవ అప్పుల కంటే చాలా ఎక్కువ’అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్.. -
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
‘వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పూయడం సిగ్గుచేటు. దాన్ని నా కుటుంబానికి అంటకట్టడం దారుణం. ఫొటో దిగితేనే సంబంధం ఉన్నట్లయితే.. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భారతితో సెల్ఫీ దిగాడు. -
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
‘నా దగ్గర రెడ్బుక్ ఉందని దాదాపు 90 సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు ఆ బుక్లో చేర్చి, చట్టప్రకారం శిక్షిస్తామని అప్పట్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నా’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ అంశంపై స్పందించారు. -
ఎక్సైజ్ శాఖలో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీల వెనుక భారీ కుట్ర
గత వైకాపా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో రూ. 99 వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సర్వత్రా డిజిటల్ లావాదేవీలు జరుగుతుండగా.. నాడు ఎక్సైజ్ శాఖలో నగదు లావాదేవీలు భారీగా జరగడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వెల్లడించారు. -
గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంతో అప్పుల భారం
నాటి వైకాపా పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం ప్రభావంతో రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెరిగిందని శాసనసభలో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమం కోసం కాకుండా.. స్వార్థ ప్రయోజనాలతో నాటి వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. -
ఇలాంటి సంస్కృతి ఐదేళ్లలో ఎన్నడూ చూడలేదు
నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారం రాత్రి దిల్లీకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎన్డీయే ఎంపీలతో కలిసి భోజనం చేశారు. -
సంక్షిప్త వార్తలు(7)
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో పాటు పలువురు తెదేపా నేతలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని తెదేపా కార్యాలయాన్ని అప్పటి వైకాపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. -
బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు విడ్డూరం
రాష్ట్ర ఆదాయం, వ్యయం అంచనా వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ పెడితే.. గ్యాస్, ట్రాష్ అంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
కేసీఆర్, రేవంత్ల ఆలోచనా విధానం ఒకటే
తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ఉన్నా, రేవంత్రెడ్డి ఉన్నా ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకేలా ఉన్నాయని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. -
బయటపడిన కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. -
రూ.వేల కోట్లు దోచేసి.. మాపై నిందలా!
‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే గత అక్టోబరు 21న మేడిగడ్డ కుంగింది. నాడే జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షక సంస్థ(ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు గేట్లు ఎత్తి నీటిని వదిలేశారు. -
ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని ఇలా వదిలేస్తున్న ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. -
ఆరోగ్యశాఖను అనారోగ్యశాఖగా మార్చిన వైకాపా ప్రభుత్వం
గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను అనారోగ్య శాఖగా మార్చేసిందని ఆ శాఖ మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, జగదీశ్వరి, విజయకుమార్, ఈశ్వరరావు తమ నియోజకవర్గాల్లో వైద్య ఆరోగ్య సేవలు మెరుగు పరచాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. -
‘సాక్షి’కి గత ఐదేళ్లలో రూ. 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు
వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్ భార్య భారతిరెడ్డి ఛైర్మన్గా ఉన్న సాక్షి దినపత్రికకు, ఆనాటి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఇంకొన్ని పత్రికలకు ప్రకటనల రూపంలో అడ్డగోలుగా రూ.కోట్లలో ప్రజాధనం దోచిపెట్టారని, దీనిపై విచారణకు సభాసంఘాన్ని ఏర్పాటుచేయాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర, బెందాళం అశోక్, తెనాలి శ్రావణ్కుమార్ డిమాండ్ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి